Adilabad

News May 1, 2024

ఆసిఫాబాద్: CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన SP

image

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్‌లో ఏర్పాటు చేసి సభ స్థలాన్ని, హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు, సభ స్థాయికి వచ్చి వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు. అనంతరం భద్రతాపరంగా తీసుకోవలసిన చర్యల గురించి, బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.

News April 30, 2024

రూ.37 లక్షల విలువైన గంజాయి కాల్చివేత: ADB ఎస్పీ

image

ADB జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లలో నమోదైన 19 కేసుల్లో నిందితుల వద్ద సీజ్ చేసిన 150 కిలోల గంజాయిను మంగళవారం తలమడుగు మండలం సుంకిడి అటవీ ప్రాంతంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. నిషేధిత గంజాయి విలువ సుమారుగా రూ.37లక్షలు ఉంటుందని ఎస్పీ గౌష్ ఆలం తెలిపారు.

News April 30, 2024

కాగజ్‌నగర్‌లో 60 లీటర్ల నాటుసారా స్వాధీనం

image

ఆసిఫాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో దహేగాం, కౌటాల, చింతలమానేపల్లి మండలంలోని లంబాడీహెట్టి, గుప్పగూడెం, కల్వాడ, రణవెల్లి, మర్రిగూడెం గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 4వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు.

News April 30, 2024

ఇంద్రవెల్లి: ఆత్మహత్య చేసుకున్న హోంగార్డు

image

పురుగు మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటుచేసుకుంది. ఉట్నూరు మండలం జైత్రాం తండాకి చెందిన నూర్ సింగ్ ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. నూర్ సింగ్ మంగళవారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు వెంటనే రిమ్స్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.

News April 30, 2024

నిర్మల్: అందరి సహకారంతోనే ప్రథమ స్థానం: డీఈవో

image

అందరి సహకారంతోనే పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా విద్యాధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఉపాధ్యాయులు సకాలంలో సిలబస్‌ను పూర్తి చేసి ప్రత్యేక స్టడీ మెటీరియల్ ద్వారా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారని ఒకటి, రెండు మార్కులతో పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వారు ఆందోళన చెందకుండా సప్లమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కావాలని తెలిపారు.

News April 30, 2024

BREAKING: పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా టాప్

image

పదోతరగతి ఫలితాల్లో నిర్మల్ సత్తా చాటింది. 99.05 శాతంతో రాష్ట్రంలోనే మెుదటి స్థానంలో నిలిచింది. 8908 మంది విద్యార్థులకు గాను 8823 మంది పాసయ్యారు. 92.93 శాతంతో ఆదిలాబాద్ 17వ స్థానంలో నిలిచింది. 10,374 మందికి 9,641 మంది పాసయ్యారు. 92.42 శాతంతో MNCL జిల్లా 20వ స్థానంలో నిలిచింది. 9283 మందికి గాను 8579 మంది పాసయ్యారు. 83.29 శాతంతో ASF జిల్లా 31 వస్థానంలో నిలిచింది. 6393 మందికి గాను 5325 మంది పాసయ్యారు.

News April 30, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‌కు మోదీ, యోగి, అమిత్ షా..?

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా BJP తరపున ఆదిలాబాద్‌లో జరగాల్సిన మహారాష్ట్ర CM ఏక్నాథ్ శిండే, విదేశాంగమంత్రి శివశంకర్ పర్యటనలు రద్దయ్యాయి. కాగా మే మొదటి వారంలో PM మోదీ, ఉత్తరప్రదేశ్ CM యోగి, కేంద్రమంత్రి అమిత్ షా సభలను ఖరారు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. అనుకూలిస్తే ఆసిఫాబాద్- కాగజ్ నగర్ కలిసేలా మోదీ, ఆదిలాబాద్ – ఉట్నూర్ కలిసేలా యోగి, నిర్మల్ -ముథోల్ కలిసేలా అమిత్ షా సభలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

News April 30, 2024

ఆదిలాబాద్: తేలిన ఓటర్ల లెక్క.. వారితోనే గెలుపు

image

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల లెక్క తేలింది. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 16,50,175 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. జాబితాలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 36,338 మంది ఎక్కువగా ఉండటం విశేషం. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వారిదే ఆధిపత్యం. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మహిళా ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

News April 30, 2024

MNCL: ప్రేమించిన యువతి దక్కతుందో లేదోనని సూసైడ్

image

ప్రేమించిన యువతి తనకు దక్కుతుందో.. లేదో.. తమ పెళ్లి జరుగుతుందో.. లేదోనని ఓ యువకుడు క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వేమనపల్లి చోటుచేసుకుంది. SI శ్యామ్ పటేల్ ప్రకారం.. సంపుటంకు చెందిన నితిన్(20) గోదావరిఖనికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లి ఖరారు చేసుకుందామని నచ్చజెప్పారు. అయినప్పటికీ తన ప్రేమ ఎక్కడ విఫలమవుతుందనే భయపడి యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.

News April 30, 2024

10TH రిజల్ట్స్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 35,369 మంది

image

పదోతరగతి ఫలితాలు నేడు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 10,405 మంది రెగ్యులర్,106 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. ఇందులో 5192 మంది బాలురు, 5213 మంది బాలికలు ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 8,923 , మంచిర్యాల జిల్లాలో 9298 , ఆసిఫాబాద్ జిల్లాలో 6637 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.