Adilabad

News June 2, 2024

ADB: 3రోజుల్లో ఫలితాలు.. అభ్యర్థుల్లో TENSION

image

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరో మూడురోజుల్లో వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం జిల్లా కేంద్రంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ పూర్తయినప్పటి నుంచి పోలీస్ అధికారుల నడుమ 24 గంటలపాటు భద్రత కొనసాగుతోంది. కాగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. అటు ఎంపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

News June 1, 2024

PL SURVEY : ఆదిలాబాద్ టఫ్, పెద్దపల్లి కాంగ్రెస్‌దే!

image

పెద్దపల్లి ఎంపీ స్థానంలో కాంగ్రెస్‌దే గెలుపని పొలిటికల్ ల్యాబరేటరీ (PL) సర్వే తెలిపింది. అయితే ఆదిలాబాద్ స్థానంలో టఫ్ ఫైట్ ఉండనుందని ఆ సర్వే పేర్కొంది. ADB నియోజకవర్గంలో బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి స్థానంలో కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

చాణక్య X : ఆదిలాబాద్, పెద్దపల్లి కాంగ్రెస్‌దే!

image

ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీ స్థానాలు కాంగ్రెస్‌వే అని చాణక్య X సర్వే తెలిపింది. ADB నియోజకవర్గంలో బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

ఆదిలాబాద్: జూన్ 2 నుంచి అందుబాటులోకి 90 వేల ప్యాకెట్లు

image

రైతులు కోరుకుంటున్న రాశీ 659 పత్తి విత్తనాలను గత సంవత్సరం కంటే ఎక్కువ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 1.50 లక్షల ప్యాకెట్లను కంపెనీని నుంచి తెప్పిస్తున్నామని, ఇప్పటి వరకు రైతులు 60 వేల ప్యాకెట్లు కొనుగోలు చేశారన్నారు. జూన్ 2 నుంచి మరో 90 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దశల వారీగా రాశీ 659 స్టాకు వస్తుందని స్పష్టం చేశారు.

News June 1, 2024

AARA SURVEY: ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవనుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

ADB: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదు: వ్యవసాయశాఖ డైరెక్టర్

image

రాష్ట్రంలో పత్తివిత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి అన్నారు. ఆదిలాబాద్‌లో రాశి కాటన్ సీడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం, సరిపడా విత్తనాలు లేకపోవడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తమిళనాడు నుంచి 30 వేల ప్యాకెట్లను తెప్పించి ఆదిలాబాద్ పంపించినట్టు ఆయన తెలిపారు. మరో 4, 5 రోజుల్లో 40 వేల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

News June 1, 2024

ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా దాహెగాం 45.9, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 45.7, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదని సూచించారు.

News June 1, 2024

నేటి నుంచి బాసర ట్రిపుల్ఐటీలో దరఖాస్తుల స్వీకరణ

image

బాసర ట్రిపుల్ఐటీలో 2024-25 విద్యాసంవత్సరానికి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు VC వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ఎస్సెస్సీ బోర్డు సర్వర్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, పేరు తదితర వివరాలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయన్నారు. జూన్ 1నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News June 1, 2024

ఆదిలాబాద్: PG విద్యార్థులకు ONLINEలో అసైన్‌మెంట్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు www.braou.online.in వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి అసైన్‌మెంట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం ఆన్‌లైన్‌లోనే ఈనెల20వ తేదీ లోపు సబ్మిట్ చేయాలన్నారు.

News June 1, 2024

ADB: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండటంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. ADB, PDPL పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!