India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా పంచాయతీ శాఖలో పనిచేసే గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితాను అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 320 మంది గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇందులో 245 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 40% మాత్రమే బదిలీచేయాలనే నిబంధనల మేరకు 128 మందిని అర్హులుగా గుర్తించారు. సంబంధిత సీనియారిటీ జాబితా సిద్ధం చేసిన అధికారులు కలెక్టర్ అనుమతితో నోటీస్ బోర్డుపై ఉంచారు.

KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు పారిపోగా పోలీసులు వీరిని హైదరాబాదులో గుర్తించారు. జైపూర్ KGBV నుంచి ఇద్దరు విద్యార్థినులు బుధవారం ఉదయం 3 గంటలకు పారిపోయారని అధికారిణీ శ్రీలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఈమేరకు దర్యాప్తు ప్రారంభించి CC కెమెరాలను పరిశీలించి భాగ్యనగర్ రైల్లో హైదరాబాద్ వెళ్లినట్లు గుర్తించామని శ్రీరాంపూర్ CI. మోహన్, SI.రాములు తెలిపారు.

ఆదిలాబాద్ జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 11 మంది పంచాయతీరాజ్ పర్యవేక్షకులకు స్థానచలనం కలగనుంది. జోనల్ స్థాయిలో జరిగే ఈ బదిలీల్లో జడ్పీ నుంచి వివరాలు ఉన్నతాధికారులకు నివేదించగా ఉద్యోగుల పేర్లతో జాబితాను పంపించారు. ఎక్కడైనా అయిదు చోట్ల ప్రాధాన్యం వారీగా వీరు ఖాళీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరితోపాటు జోనల్ స్థాయి పోస్టులైన పీఆర్ సీనియర్ అసిస్టెంట్లు ఏడుగురు బదిలీ కానున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో నేడు నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. ఉట్నూరులో నిర్వహించే రైతు భరోసా ప్రజాభిప్రాయ సేకరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి తుమ్మల, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి సీతక్క హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ తెలిపారు. మండల కేంద్రంలోని KB కాంప్లెక్స్ లో ఉ.10.30కు నిర్వహించే ఈ సభలో వీరు పాల్గొంటారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 15 పాఠశాలలు పదోన్నతుల ప్రక్రియ తర్వాత మూతబడ్డాయి. జిల్లాలోని 12 మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ఆయా పాఠశాలల్లో అత్యల్పంగా 10 మంది విద్యార్థులు ఉంటే.. అత్యధికంగా 50 మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖవర్గాలు చెబుతున్నాయి. మరో వైపు 80 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అత్యవసర సమయంలో ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఆయా పాఠశాలలకు అనధికారిక సెలవు ప్రకటించాల్సిందే.

నిర్మల్ సహాయక ఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టిన జితేందర్ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ ఏఎస్పీగా 6 జనవరి 1995 నుంచి 12 డిసెంబరు 1995 వరకు పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.. నిర్మల్ ఏఎస్పీగా ఉన్న సమయంలో ఆయన వివాహం జరిగింది. ఏడాదిపాటు పనిచేసిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేసినట్లు ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన పోలీసులు వెల్లడించారు.

వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వాహనాన్ని సీజ్ చేయటంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి హెచ్చరించారు. ట్రాఫిక్ CI ప్రణయ్ కుమార్, SI ముబీన్తో కలిసి DSP పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. గత వారం రోజుల్లో 321 వాహనాలను సీజ్ చేశామన్నారు. తాజాగా బుధవారం 55 వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

గ్రూప్-I మెయిన్స్ కొసం ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. గ్రూప్-I మెయిన్స్కు అర్హత పొందిన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=bce లో జులై 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణ ఈనెల 22 నుంచి 75 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. హైదరాబాద్లో 150, ఖమ్మంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు.

తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులపై దృష్టి సారించారు CM రేవంత్ రెడ్డి. అదిలాబాద్ జిల్లాలో ఈనెల చివరి వారంలో ప్రాజెక్టుల సందర్శన పేరిట పర్యటించనున్నారు. సదర్మాట్, మత్తడి వాగు ప్రాజెక్టులను స్వయంగా పరిశీలించి 2025 మార్చిలోగా పనులు పూర్తి చేసేందుకు నిర్ణయించారు. సీఎంతో పాటు ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క కూడ ఇదే జిల్లాలో పర్యటించే అవకాశం ఉంది.

హాస్టల్ నుంచి తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లడం లేదంటూ విద్యార్థిని భవనం పైనుంచి దూకిన ఘటన నస్పూర్లో చోటుచేసుకుంది. కస్తూర్బాలో 6వ తరగతి చదువుతున్న అక్షర అనే బాలిక తను హాస్టల్లో ఉండనని ఇంటికి తీసుకువెళ్లాలంటూ తల్లిదండ్రులను కోరింది. అందుకు వారు నిరాకరిస్తూ హాస్టల్లోనే ఉంటూ చదవాలన్నారు. దీంతో మనస్తాపానికి గురైన అక్షర హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Sorry, no posts matched your criteria.