Adilabad

News July 10, 2024

ఆదిలాబాద్: ఇప్పటి వరకు 94 వేల మందికి లబ్ది

image

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500 వంట గ్యాస్ సిలిండరు ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లాలో పథకం కోసం సుమారు 3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివరాలు సక్రమంగా ఉండి LPG సిలిండర్లు ఉన్నవారికి ఇప్పటి వరకు జిల్లాలో 94వేల మంది లబ్ది పొందారని జిల్లా పౌరస రఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్సిడీని డీబీటీ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.

News July 10, 2024

ADB: పంచాయతీ కార్యదర్శుల సీనియారిటీ జాబితా ప్రకటన

image

జిల్లా పంచాయతీ శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. బాసర జోన్ పరిధిలో జరిగే గ్రేడ్-1, 2, 3 కార్యదర్శుల సీనియారిటీ జాబితాను సిద్ధం చేసిన అధికారులు మంగళవారం ప్రకటించారు. గ్రేడ్-1లో ఎనిమిది మందికి గాను ఒకరు, గ్రేడ్-2లో 09 మందికి నలుగురు, గ్రేడ్-3లో 57 మందికి 41 మంది నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నారు. వీరు తప్పనిసరిగా బదిలీపై వెళ్లనున్నారు. ఈమేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.

News July 10, 2024

మంచిర్యాలలో పేకాట రాయుళ్ల అరెస్ట్

image

మంచిర్యాలలోని ఒక రెస్టారెంట్‌లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశాలతో మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి వద్ద నుంచి రూ.1 లక్ష 78 వేలు నగదు స్వాధీనం చేసుకుని, తదుపరి విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్లు సమాచారం.

News July 10, 2024

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం..!

image

నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాని వెల్లడించింది. నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సరైనా వర్షాలు లేక జిల్లాలోని ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి.

News July 10, 2024

STATE 1ST ర్యాంక్ సాధించిన ఆదిలాబాద్ యువకుడు

image

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2015 బ్యాచ్‌కు చెందిన బీ.కాం. విద్యార్థి యోగేంద్రసింగ్ జూనియర్ లెక్చరర్ల పోస్టులకు జరిగిన పరీక్ష ఫలితాలలో హిందీ సబ్జెక్టులో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. ప్రిన్సిపల్ డాక్టర్ అచ్చి శ్రీనివాస్, కామర్స్ ప్రిన్సిపల్ డాక్టర్ జలగం అనిత, తన హిందీ గురువు T. ప్రతాప్ సింగ్, అధ్యాపకులు జగరామ్, దయాకర్ యువకుడిని సన్మానించి అభినందించారు.

News July 9, 2024

కార్పొరేషన్ ఛైర్మన్‌గా మంచిర్యాల జిల్లా వాసి

image

విద్యార్థి దశ నుంచే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దండేపల్లి మండలం అల్లీపూర్‌కు చెందిన ఆదివాసీ నేత కొట్నాక తిరుపతికి రాష్ట్ర స్థాయి పదవి వరించింది. గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా తిరుపతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

News July 9, 2024

నేరడిగొండ: ప్రమాదవశాత్తు లారీ డ్రైవర్ మృతి

image

లారీకి మరమ్మతులు చేస్తుండగా ఓ డ్రైవర్ ప్రమాదవశాత్తు మరణించిన ఘటన నేరేడిగొండ మండలం ఆరేపల్లిలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి రబ్బర్ లోడుతో తమిళనాడు-ఢిల్లీకి వెళ్తుండగా అకస్మాత్తుగా లారీ నిలిచిపోయింది. డ్రైవర్ లారీని నిలిపి హ్యాండ్ బ్రేక్ వేయకుండా టైర్ల వద్ద మరమ్మతులు చేస్తుండడంతో లారీ వెనక్కి వచ్చి డ్రైవర్‌పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.

News July 9, 2024

వాంకిడి: గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

image

వాంకిడి మండల కేంద్రానికి చెందిన గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుడు మడావి రాజేశ్వర్(58) గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారు జామున అస్వస్థతకు గురికావడంతో మహారాష్ట్రలోని చంద్రపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాజేశ్వర్ తిర్యాణి మండలం గుండాల గిరిజన పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News July 9, 2024

ఆదిలాబాద్: ముగిసిన EAPCET కౌన్సెలింగ్.. 715 మంది హాజరు

image

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్‌ తొలివిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఆదిలాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో 3 రోజులపాటు జరుగగా సోమవారంతో ముగిసింది. నేడు 201 మంది హాజరు కాగా మొత్తం 715 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ వెరీఫికేషన్ పూర్తయినట్లు కోఆర్డినేటర్ వీరస్వామి తెలిపారు. జులై 15 వరకు వెబ్ అప్షన్లు పెట్టుకోవాలని, 19న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.

News July 8, 2024

ఆసిఫాబాద్: అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన దంపతులు

image

ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024లో సత్తా చాటారు. జూన్ 5 నుంచి 7 వరకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జరిగిన 5KM వాకింగ్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో శకుంతల(48) రెండో స్థానం, ఆమె భర్త ఆనంద్ రావు(56) ఐదో స్థానం సాధించారు. దీంతో వారిని జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ అడ్మిన్ ప్రభాకర్ రావు సన్మానించి అభినందించారు.