Adilabad

News April 17, 2024

ఇచ్చోడలో ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి.. వివరాలు ఇవే..!

image

ట్రాక్టర్ అదుపుతప్పి <<13067453>>వ్యక్తి మృతి<<>> చెందిన ఘటన ఇచ్చోడ మండలం చించోలి క్రాస్ రోడ్ వద్ద జరిగిన విషయం తెలిసిందే. SI నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డర్ గూడకు చెందిన రాజేందర్ (33) ఇచ్చోడలో ట్రాక్టర్‌తో ఇటుక లోడు ఖాళీ చేసి వస్తుండగా ట్రాక్టర్ అతివేగంగా నడుపుతుండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News April 17, 2024

సివిల్స్‌లో సత్తాచాటిన ఆదిలాబాద్ జిల్లా బిడ్డ

image

సివిల్ సర్వీసెస్ మంగళవారం వెలువరించిన ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా వాసి ర్యాంక్ సాధించాడు. మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ సివిల్స్‌లో 718 ర్యాంక్ సాధించి సత్తాచాటాడు. దీంతో గ్రామస్థులు, కుటుంబసభ్యులు విశాల్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా తండ్రి వెంకన్న మంచిర్యాల ACPగా విధులు నిర్వహిస్తున్నారు.

News April 17, 2024

ADB: హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

image

హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసిన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. వివరాలిలా.. అక్రమ నిర్మాణం చేపట్టడమే కాకుండా.. నిర్మాణ పనులు నిలిపివేయాలని వెళ్లిన మున్సిపల్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో తమ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై హెడ్ కానిస్టేబుల్ మురాద్ అలీపై మున్సిపల్ కమిషనర్ MD ఖమర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

News April 17, 2024

ఆదిలాబాద్: BRS టు CONGRESS వయా BJP

image

ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ వలసలు కొనసాగుతున్నాయి. కొన్నినెలల క్రితం BRS నుండి BJPలో చేరిన ప్రముఖ నాయకులు తాజాగా BJPని వీడటం చర్చనీయాంశమైంది. బోథ్ మాజీ MLA రాథోడ్ బాపురావ్ అసెంబ్లీ ఎన్నికల వేళ BJPలో చేరి తాజాగా ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. దీంతో సోమవారం CM సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అటు ADBజడ్పీ ఛైర్మన్ జనార్దన్ రాథోడ్ సైతం ఫిబ్రవరిలో బీజేపీలో చేరగా మంగళవారం తిరిగి KTR సమక్షంలో BRSలో చేరారు.

News April 17, 2024

UPSCలో 703 ర్యాంకు సాధించిన మరో ఆదిలాబాద్ వాసి

image

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ చెందిన ముకుంద్ రావు-గీత దంపతుల కుమారుడు చౌహన్ రాజ్ కుమార్ సివిల్స్ ఫలితాల్లో అలిండియా 703వ ర్యాంకు సాధించాడు. ఈయన కాగజ్‌నగర్ నవోదయలో పదోతరగతి పూర్తిచేసి, వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. ఆదిలాబాద్ రురల్ మండలంలోని చందా(టి) గ్రామానికి చెందిన విశాల్ 718ర్యాంకు, ఇంద్రవెల్లి మండలం ముత్నూరుకు చెందిన శుభం 790 ర్యాంకు సాధించారు.

News April 16, 2024

తానూర్ ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం తానూర్ మండలంలో జరిగింది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాలిలా.. మండలంలోని భోసీకి చెందిన దినేష్ (23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి దినాజీ చికిత్స నిమిత్తం హెదరాబాద్ వెళ్లాడు. ఈరోజు ఇంటికి వచ్చాడు. అతను వచ్చేసరికి కొడుకు దినేశ్ ఉరేసుకుని ఉన్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 16, 2024

నిర్మల్: విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి నివేదిక అందజేయాలి: కలెక్టర్

image

విద్యార్థి ఆత్మహత్య ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బాసర ట్రిపుల్ ఐటీలో జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆయన అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థి ఆత్మహత్య బాధాకరమని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనలు తీసుకున్న చర్యలపై నివేదికలు అందజేయాలన్నారు.

News April 16, 2024

సివిల్స్‌లో ఆదిలాబాద్ వాసీకి 790 ర్యాంకు

image

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ-గీత దంపతుల కుమారుడు రేకుళ్వార్ శుభం సివిల్స్‌లో అలిండియా స్థాయిలో 790వ ర్యాంకు సాధించాడు. ఈయన కాగజ్‌నగర్‌లోని నవోదయ విద్యాలయంలో పదోతరగతి పూర్తిచేశాడు. అనంతరం అస్సాంలోని గువాహటి IITలో సివిల్ ఇంజినీరింగ్ సీటు సాధించాడు. తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ ఎంపికయ్యాడు.

News April 16, 2024

నిర్మల్: కాంగ్రెస్‌లో చేరిన మాజీ కేంద్రమంత్రి 

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్ చారి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని రేవంత్ రెడ్డి ఆయనకు సూచించారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జీవన్ రెడ్డి తదితరులున్నారు.

News April 16, 2024

మళ్లీ BRSలో చేరిన జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్

image

ఇటీవల బీజేపీ కండువా కప్పుకున్న ఆదిలాబాద్ జడ్పీ ఛైర్మన్ రాథోడ్ జనార్ధన్ తోపాటు పలువురు నాయకులు తిరిగి మంగళవారం బీఆర్ఎస్‌లో చేరారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వారు సొంతగూటికి చేరుకున్నారు. బీజేపీలో సరైన ప్రాధాన్యత, గుర్తింపు లేకపోవడం వల్లనే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. కేటీఆర్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.