India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో II, IV, VI సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థుల కోసం 123 పరీక్ష కేంద్రాలను,123 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. విద్యార్థులు పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఓ నవ వధువు వరుడి ఇంటి ముందు ఆందోళన చేసింది. వివరాలిలా.. గత నెల 24న BPL మండలం కాసిరెడ్డిపల్లెకు చెందిన ప్రవీణ్కు MNCLకు చెందిన ఓ యువతి(22)తో వివాహమైంది. పెళ్లయిన నాలుగో రోజే ఆమెను తల్లిగారి ఇంటి వద్ద విడిచిపెట్టాడు. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఇంట్లో అన్నం తినకుండా, జ్యూస్లే తాగుతుందని చెప్పడంతో కుటుంబసభ్యులు విస్తుపోయారు. ఎస్ఐ నరేశ్ సోమవారం ఇరువర్గాలను కౌన్సిలింగ్కు రావాలని చెప్పామన్నారు.

ఓటు వేయడానికి ఈ కింది వాటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకువెళ్లాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఓటర్ కార్డు, ఆధార్, MNREGA జాబ్ కార్డు, ఫోటోతో ఉన్న పోస్టఫీస్ పాస్బుక్, కార్మికశాఖ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, లేబర్ గుర్తింపు కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫోటోతో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్, దివ్యంగుల కార్డు, MP, MLA గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలన్నారు.

ఖానాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఆదివారం ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం ఆమె తల్లి కనక బుధవ్వ విస్తృత ప్రచారం నిర్వహించారు. పేదింటి ఆడపడుచును కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎంపి, అభ్యర్థిగా అవకాశం కల్పించిందన్నారు. తన బిడ్డ చదువుకొని ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమందికి సేవ చేసిందని.. ఆమెను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్లు తప్పకుండా గెలుస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం సాయంత్రం కాగజ్నగర్లో ఏర్పాటు చేసిన బీజేపీ జనసభలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల లూటీ జరిగిందని అన్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి రాహుల్ గాంధీ, ఖర్గే రాలేదని అన్నారు. వారికి హిందూ సమాజం పై ప్రేమ లేదని ఆరోపించారు.

నిర్మల్లో నిర్వహించిన జనసభలో రాహుల్ గాంధీ మాట్లాడిన ముఖ్యాంశాలు. ★ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన చేసి తీరుతాం ★త్వరలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తాం
★ఉద్యోగులను నిరుద్యోగులుగా మార్చిన మోదీ ప్రభుత్వం ★రిజర్వేషన్లకు మోదీ వ్యతిరేకం ★కేంద్రంలో 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం ★ఉపాధి హామీ కింద రోజుకు 400 కూలీ ఇస్తాం ★ప్రతి మహిళ అకౌంట్లో ఏడాదికి రూ.లక్ష వేస్తాం.

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, కోర్సుల్లో 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి, నాలుగో సెమిస్టర్ మే 7 నుంచి జరగనున్నాయి. రెండో సెమిస్టర్ మే 6, 8, 10, 16, 18, 21, 24, 27వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ మే 7, 9, 15, 17, 20, 22, 25, 28వ తేదీల్లో ఉదయం 9 నుంచి 12 వరకు జరగనున్నాయి.

మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సతీశ్ ఈరోజు ఉదయం వ్యాయామంలో భాగంగా స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. తాండూరు మండలానికి చెందిన ఆయన రెబ్బెన పరిధిలో విధులు నిర్వహించినట్లు మండల వాసులు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.

నిర్మల్ జిల్లాలో 45.7 డిగ్రీల అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఐదు మండలాలైన నర్సాపూర్ జి, కడెం, కుబీర్, ఖానాపూర్, భైంసా మండలాలను వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్గా ప్రకటించింది. వీటిలో 45.1 డిగ్రీ నుంచి 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించి బయటకు వెళ్లాలని సూచించారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ సభాస్థలి ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పరిశీలించారు. హెలి ప్యాడ్, పార్కింగ్, తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.