Adilabad

News March 21, 2024

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆత్రం సుగుణ

image

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆత్రం సుగుణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంఛార్జ్ జిల్లా మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో గురువారం చేరారు. హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆమె ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆమె బరిలో ఉన్నారు.

News March 21, 2024

ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత

image

ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ఓయూ జేఏసీ నేత, కడెం మండలానికి చెందిన సిద్ధార్థ నాయక్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు గురువారం కడెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడి ఉందని వాపోయారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆయన తెలిపారు. ఓయూ జేఏసీ తరఫున పోటీ చేయనున్నానని ఆయన వెల్లడించారు.

News March 21, 2024

ఆదిలాబాద్-మహారాష్ట్ర బార్డర్‌లో హై అలర్ట్ 

image

మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీసులు అలర్ట్ అయ్యారు. గడ్చిరోలి ఎన్ కౌంటర్‎తో మావోలు ప్రాణహిత దాటి మహారాష్ట్ర నుంచి తెలంగాణాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రాణహిత తీరం వెంట హై అలర్ట్ ప్రకటించారు.
మహారాష్ట్రలోని అటవీప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో పలువురు హతమవ్వగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెంచారు.

News March 21, 2024

నేడు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

ఆదిలాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థిని నేడు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ BRS అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. BJP అభ్యర్థిగా గోడం నగేశ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన నాయకుడిని బరిలో నిలపాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో తమ పార్టీ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారో కామెంట్ చేయండి.

News March 21, 2024

మంచిర్యాల: BRSకు మాజీ ఎమ్మెల్సీ బిగ్ షాక్

image

మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ BRSకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బాల్కసుమన్‌తో విభేదాలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల నుంచి BRS టికెట్టు రాకపోవటంతో ఆయన BRS కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్టపడ్డా గుర్తింపు రాలేదని పార్టీని వీడుతున్నట్లు సమాచారం. ఆయన పార్టీని వీడటం చెన్నూర్‌కి తీరని లోటని స్థానికులు భావిస్తున్నారు.

News March 21, 2024

నిర్మల్: కారు దిగేందుకు సిద్ధం!

image

ఎన్నికలు సమీపిస్తున్న వేళ..BRS నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండటంతో ఆ ప్రభావం నిర్మల్ జిల్లాలో కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో కాంగ్రెస్, BJP బలంగా ఉండటంతో ఈ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి, BRS కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు BRSను వీడనున్నారు.

News March 20, 2024

ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా డా.సుమలత..?

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి 2వ విడత జాబితా ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా డా.సుమలత పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి ఫోన్ రాగా ఆమె హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె మొదట బీజేపీ నుంచి టికెట్ ఆశించారు. బీజేపీ గోడం నగేశ్‌కు టికెట్ కేటాయించడంతో కాంగ్రెస్‌లో చేరారు.

News March 20, 2024

ఆసిఫాబాద్: పోక్సో కేసులో ఒకరికి జీవీతఖైదు

image

కాగజ్‌నగర్ మండలం భట్టుపెల్లికి చెందిన రమేశ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలికను మే8, 2023న అత్యచారం చేశాడు. కుటుంబీకులు అదేరోజు కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేశారు. మంగళవారం 14 మంది సాక్షులను విచారించిన న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

News March 20, 2024

ఆదిలాబాద్: ప్రాణం తీసిని చేపల వేట

image

ఆదిలాబాద్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామానికి చెందిన మత్స్యకారుడు రాజన్న(46) మంగళవారం గ్రామ సమీపంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాళ్లకు వల చుట్టుకొని నీటిలో మునిగాడు. గమనించిన జాలరులు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News March 20, 2024

ADB: హత్యాయత్నం కేసులో ఇద్దరికి రిమాండ్‌కు

image

ఒకరిపై కత్తితో దాడిచేసి కేసులో ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కోలిపూరకు చెందిన మునీర్ బేగ్‌పై సోమవారం రాత్రి 11 గంటలకు కేఆర్కే కాలనీకి చెందిన షేక్ షాబాద్, సయ్యద్ రెహాన్ హష్మీ కత్తితో దాడితో చేశారు. బాధితుడి తల్లి గులాబ్ బీ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.