India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రూప్2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.
అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కోరాట చనాక ప్రాజెక్ట్కు నిధులు కేటాయించి పూర్తిచేయాలని, కుప్టి ప్రాజెక్ట్ ప్రారంభించాలని కోరుతున్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి పునఃప్రారంభిస్తే ఎందరికో ఉపాధి దొరుకుతుంది. బోథ్కు రెవెన్యూ డివిజన్ ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బజార్హత్నూర్కు చెందిన బిట్లింగ్ లక్ష్మణ్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ 404 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి తమ ప్రతిభ కనబర్చారు. ఉదయ్ పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ అధికారి, వీఆర్వో, గ్రూప్ -4, సింగరేణి (ఎస్సీసీఎల్ )జాబ్ సంపాదించి మరోపక్క గ్రూప్2కు సన్నద్ధమయ్యాడు. మంగళవారం వెలువడిన గ్రూప్2 ఫలితాల్లో ఉద్యోగం సాధించడం పట్ల అభ్యర్థుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
ADBలో ACB దాడుల్లో అవినీతి అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. స్థానిక మైనార్టీ రెసిడెన్షియల్ భవనానికి రూ.2 కోట్లు మంజూరైతే ఒక శాతం లంచం ఇవ్వాలని ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా శంకర్ను పట్టుకొని కరీంనగర్ కోర్టులు హాజరుపర్చారు.
వేసవి ప్రారంభం ముందే ఆదిలాబాద్ జిల్లా ఉష్ణోగ్రతలతో అట్టుడుకుతోంది. జిల్లాలో నిత్యం 39డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారు. మహారాష్ట్రకు సరిహద్దయిన గాదిగూడ మండలంలో మంగళవారం 40డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా పక్క మండలమైన నార్నూర్లో 39డిగ్రీలు నమోదైంది. ఉదయం 10 నుంచే వేడిమి పెరగడంతో బయటకు వెళ్లలేకపోతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన రుసుం మార్చి 31లోపు చెల్లించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుడికి ప్రొసీడింగ్ కాపీని కలెక్టర్ అందజేశారు. 25% రాయితీతో ప్రభుత్వం ఇచ్చిన సదవాకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు ఉన్నారు.
ఆదిలాబాద్ రిమ్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రతిపాదికన భర్తీ చేయుటకు అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ట్యూటర్స్, సీనియర్ రెసిడెంట్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, సీఎంఓ పోస్టులు ఉన్నాయన్నారు. ఈనెల 18న ఇంటర్వ్యూలు ఉంటాయని, వివరాలకు rimsadilabad.org వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
ఉట్నూర్ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ వాగ్మారే జగ్జీవన్ కుమారుడు వాగ్మారే రోహిత్ గ్రూప్-1 పరీక్షా ఫలితాల్లో సత్త చాటాడు. ఇటీవల నిర్వహించిన గ్రూప్-1, 2, 3 పరీక్షలకు ఆయన హాజరవ్వగా.. సోమవారం విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో 438 మార్కులు సాధించాడు. దీంతో ఆయనను మంగళవారం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ రూ.50 వేల లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) నిర్మాణ స్థలంలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఆయనను పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో పాత మొబైల్ ఫోన్లకు ఆయా వస్తువులు అమ్ముతున్న <<15720691>>బిహార్ ముఠా<<>> వివరాలను మంగళవారం పోలీసులు వెల్లడించారు. A1గా తబరాక్, A2 మొహమ్మద్ మెరాజుల్, A3 మహబూబ్ ఆలం, A4 మొహమ్మద్ జమాల్, A5 ఉజీర్, A6గా అబ్దుల్లాగా గుర్తించారు. దీంతో సోమవారం సాయంత్రం బస్సు స్టాండ్ సరిహద్దుల్లో A3 నుంచి A6 వరకు మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.