India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింగరేణి సంస్థలో భారీ సంఖ్యలో అధికారులను బదిలీ చేస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 9 విభాగాల్లో 200 మందికి పైగా అధికారులకు స్థాన చలనం కలిగింది. ఒకేసారి ఇంతమంది బదిలీ కావడం పదేళ్లలో ఇదే ప్రథమం. ఎన్నికల ప్రక్రియ ముగిశాక బదిలీలపై సుదీర్ఘ కసరత్తు చేసిన యాజమాన్యం ఎక్కువ కాలం ఒకే చోట ఉన్న వారిని వేరే
ప్రాంతాలకు బదిలీ చేసింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన క్యాతం అపర్ణ అనే యువతి తొలి ప్రయత్నంలోనే ఇరిగేషన్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించింది. ఇటీవల విడుదలైన టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) ఉద్యోగానికి ఎంపికైంది. సాధారణ నిరుపేద రైతు కుటుంబం నుంచి మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కావడంతో పలువురు ఆమెను అభినందిస్తున్నారు.
ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంకెన గ్రామానికి చెందిన నైతం దత్తు రాం(19) పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఈనెల 1న పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో గడిచిన నాలుగు రోజుల్లో మూడు టీఎంసీల నీటి మట్టం తగ్గింది. వర్షాలు లేక ఎగువ ప్రాంతాల నుంచి వరద నిలిచిపోగా ప్రాజెక్ట్ నీటిని నంది పంప్ హౌస్కు తరలిస్తుండటంతో నీటి మట్టం తగ్గింది. ప్రాజెక్ట్ నీటిమట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.40 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీలకు గాను 15.900 టీఎంసీలుగా ఉంది. 3,600 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.
రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బేల(M) సాంగిడికి చెందిన ప్రీతమ్(27) భిక్కనూరు(M) TU పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో వీడ్కోలు సమావేశం ఉండడంతో పనుల నిమిత్తం శుక్రవారం బయటికి వెళ్లాడు. బస్టాండ్ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ప్రీతమ్ అక్కడికక్కడే చనిపోయాడు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో గత నెల 13వ తేదీన అత్తను హత్య చేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అల్లుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు స్థానిక సీఐ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తరచుగా అత్త అల్లుడి మధ్య గొడవలు జరుగుతుండేవి. దీంతో వెంకటేశ్ మద్యం మత్తులో విజయతో గొడవపడి కత్తితో హత్య చేశాడు. ఆయనను స్థానిక బస్టాండ్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సర్పంచ్ పదవికి పోటీ చేయాలని పలు గ్రామాల్లో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఓడిన, పోటీ చేయలేక వెనక్కి తగ్గిన వారు ఈసారి తగ్గేదేలే అంటున్నారు. కాగా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది.
జిల్లాలోని వనరులను సద్వినియోగం చేసుకుంటూ జిల్లా నుంచి వివిధ రకాల ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశానికి DRDO సురేందర్తో కలిసి హాజరయ్యారు. జొన్నలతో తయారుచేసిన ఆహార పదార్థాలను కూడా ఎగుమతి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు.
తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ దోత్రే అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం పోస్టర్ను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళా శిశు వైద్యశాఖ అధికారులతో తల్లిపాల వారోత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
దహెగాం మండల కేంద్రానికి చెందిన బండ మల్లేశ్ (33), ఎల్లూర్ గ్రామానికి చెందిన మంజుల అలియాస్ సుజాత(30)కు 13ఏళ్లక్రితం పెళ్లయింది. ఆరేళ్ల క్రితం సుజాత అదే గ్రామానికి చెందిన గుర్ల రాజు(23)తో అక్రమసంబంధం పెట్టుకుంది. సుజాత, ప్రియుడు రాజుతో కలిసి మల్లేశ్ గొంతునులిమి హత్య చేసినట్లు సీఐ అల్లం రాంబాబు, ఎస్సై కందూరి రాజు శుక్రవారం పేర్కొన్నారు. సుజాత, రాజును రిమాండ్కు తరలించామన్నారు.
Sorry, no posts matched your criteria.