India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సివిల్ సర్వీస్ పరీక్ష కోసం 2024-25 విద్యా సంవత్సర మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ DMWO రాజలింగు ఓ ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులకు 33% సీట్లు, వికలాంగులకు 5 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్లో వచ్చేనెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వుడ్ పార్లమెంట్ స్థానానికి బీఎస్పీ నుంచి ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బన్సీలాల్ రాథోడ్ బరిలో నిలిచే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ నుంచి గొడం నగేశ్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ బరిలో ఉన్న విషయం తెలిసిందే.

ప్రతి చోటా వాతావరణంం.. ఇంటింటికీ వాతావరణం పేరుతో భారత వాతావరణ విభాగం(IMD) ‘పంచాయత్ సేవా మౌసం యాప్’ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా నేరుగా ఇంటి నుంచే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సేవలు 12 భాషల్లో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఎండల తీవ్రత, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు పెరగనుండటంతో దీని ద్వారా ముందస్తుగా సమాచారం తెలుసుకోవచ్చు. కాగా, ఈ యాప్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది.

అదిలాబాద్ ఎంపీకి జరుగుతున్న పోటీల్లో 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు గతంలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. BRS అభ్యర్థి ఆత్రం సక్కు సైతం గతంలో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎమ్మెల్యే అయ్యారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఇటీవల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ఎంపీ బరిలో నిలిచారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్టకేలకు అభ్యర్థులు ఖరారయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలోనే తమ అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించడంలో ఉత్కంఠ జరుగగా తాజాగా తమ అభ్యర్థి పేరు ప్రకటించేశారు. BJP నుండి గోడం నగేష్, CONG నుంచి సుగుణక్క, BRS నుండి ఆత్రం సక్కు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇక ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ మూడు పార్టీల నుండి ఈసారి త్రిముఖ పోటీ తప్పేలా లేదు.

వేసవి ప్రారంభంలోనే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన 10 ప్రాంతాల్లో ఆరు ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ మండలంలో 42.3 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదయింది. అదేవిధంగా సత్నాలలో 42.3, చాప్రాలలో 42.1, ఆసిఫాబాద్లో 42.0 , అర్లి(టి)లో 42.0, దస్తురాబాద్ మండలంలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మద్యం మత్తులో నీటి ట్యాంకులో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బైంసా మండలంలో చోటుచేసుకుంది. టాక్లీ గ్రామానికి చెందిన తలుపుల రాజు(32)అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇదే విషయమై తరుచూ భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతుండడంతో రాజు భార్య ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మద్యం మత్తులో గ్రామంలోని వాటర్ ట్యాంకులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భైంసా రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ (కాంగ్రెస్ పార్టీ) ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆత్రం సుగుణ మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకు, ఎమ్మెల్యే బొజ్జుకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం సూచించిన గడువులోగా (సీఎంఆర్) కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రైస్మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సీఎంఆర్ లక్ష్యాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాల పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ 2023-24 సంవత్సరం లక్ష్యాలను గడువులోగా వెంటనే పూర్తి పూర్తిచేయాలని తెలిపారు

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. లోక్సభ అభ్యర్థులు నిబంధనలను ఉల్లంఘిస్తే గుర్తించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాలను నియమించింది. ప్రత్యేకబృందానికి కేటాయించిన వాహనానికి సీసీ కెమెరా ఏర్పాటు చేసి ఉంది. ఈ బృందం రాజకీయ పార్టీల కార్యక్రమాలు, అభ్యర్థుల ర్యాలీలు జరిగే చోటుకు వెళితే చాలు అవన్నీ కెమెరాలో రికార్డయి అధికారులకు సమాచారం పోతుంది.
Sorry, no posts matched your criteria.