India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బంగారం పేదవాడికి అందని ద్రాక్షగా మారనుందా.? అంటే వాటి గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా పసిడి రేటు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఈరోజు మంగళవారం బంగారం ధర మార్కెట్లో తులానికి రూ.1,31,500 పలికి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. పసిడి రేటును చూసి సాధారణ ప్రజలు బెంబలెత్తిపోతున్నారు.

పోలీస్ ఫ్లాగ్ డే (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా అక్టోబర్ 21న నిర్వహించే కార్యక్రమాల కోసం వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసుల కీర్తి ప్రతిష్ఠలు, సేవలను పెంపొందించే అంశాలపై 3 నిమిషాలకు తగ్గకుండా షార్ట్ వీడియోలను, అలాగే పోలీసులు అందించిన సేవల ఫొటోలను రూపొందించి ఈ నెల 23 లోగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అందించాలని ఆయన సూచించారు.

ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఒకరు ట్రాన్స్ఫోర్ట్ కావాలని ఆన్లైన్లో వెతకగా నకిలీ కస్టమర్ కేర్ వ్యక్తులు బాధితున్ని సంప్రదించారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తికి కేరళ లాటరీ రూ.5 లక్షలు వచ్చిందంటూ సైబరాసురులు మోసాలకు పాల్పడ్డారు. జిల్లాలో 2వారాల వ్యవధిలో 26మోసాలు జరిగాయంటే అమాయకులు ఎలా మోసపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.

పనిలో వృత్తి నైపుణ్యం కలిగిన సర్టిఫికెట్ లేని అభ్యర్థులకు న్యాక్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో రెండు బ్యాచ్లకు ఒక రోజు RPL ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా నైపుణ్యాన్ని పరీక్షించి సర్టిఫికెట్లు అందించనున్నట్లు ట్రైనింగ్ కోఆర్డినేటర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ పొందుటకు శిక్షణ రుసుం రూ.1,200 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9154548063 నంబర్ను సంప్రదించాలని సూచించారు.

ఆదిలాబాద్ పట్టణ వెండి, బంగారు వర్తక సంఘం ధరలు ప్రకటించింది. 24 కారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.1,30,500 గా నమోదైంది. అదేవిధంగా వెండి 10 గ్రాములకు రూ.1,850గా ఉంది. ఈ కొత్త ధరలు నేటి మధ్యాహ్నం 12 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. బంగారం ధరల్లో పెరుగుదల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఆదిలాబాద్లో రియాల్టీ ముఠా భారీ కుంభకోణాన్ని బయట పట్టినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సూర్య రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈడీ, ఎస్బీఐ మార్టగేజ్ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడిన ముఠాలో నిందితులు రమేష్ శర్మ, ఇబ్రహీం మహమ్మద్ అరెస్టు చేశామన్నారు. అదేవిధంగా యతేంద్రనాథ్, హితేంద్రనాథ్, రాకేష్, మనోజ్ కుమార్, పూనం, అనుపమ, శివాజీపై కేసు చేశామన్నారు.

భూ కబ్జా కేసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా తప్పు చేసిన భూకబ్జా దారులందరిపై కేసులు నమోదు అవుతున్నాయి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చాక రియల్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా ఎస్.బి.ఐ బ్యాంకు అధీనంలోని భూమిని కబ్జా చేసిన ఘటనలో ఆదిలాబాద్కు చెందిన మామ్లా సెట్, రమేశ్ శర్మతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆదిలాబాద్ డీసీసీ పీఠం కోసం జిల్లా నేతలు పోటీ పడుతున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం డీసీసీలపై దృష్టి సారించింది. ఆదిలాబాద్ నుంచి డీసీసీ రేసులో గండ్రత్ సుజాత, గోక గణేష్ రెడ్డి, కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడే గజేందర్, అడ్డి బోజారెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరీ అధిష్టానం ఎవరికి పీఠం కట్ట బెడుతుందో చూడాలి.

కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల ధరలు నిర్ణయించింది. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడిప్పుడే వానాకాలం పంటలు చేతికి వస్తున్నాయి. అధికంగా సాగు చేసే పత్తిలో మధ్యరకం పింజ కలిగిన దానికి క్వింటాకు రూ.7,710, పొడవురకానికి రూ.8,110, వరి సాధారణ రకానికి రూ.2,369, ఏ గ్రేడ్కు రూ.2,389, జొన్నలు హైబ్రిడ్కు రూ.3,699, మాల్ దండికి రూ.3,749, సోయా రూ.5,328, కంది రూ.8,000గా నిర్ణయించారు.
SHARE IT

జాతీయ స్థాయిలో ఆదిలాబాద్ జిల్లా తనదైన గుర్తింపు పొందుతూ అవార్డులను సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే నీతీ ఆయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ ద్వారా నార్నూర్ మండలం ఎంపిక కాగా.. ఇటీవల జలసంచాయ్.. జన్ భగీధారి అవార్డును అందుకుంది. కలెక్టర్ రాజర్షి షా ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ లెర్నింగ్ ఫౌండేషన్ ప్రోగ్రాం ‘ఇంప్రూవ్ సాఫ్ట్ స్కిల్స్ ఆమాంగ్ స్టూడెంట్స్’ థీమ్ కింద విజేతగా నిలిచింది. దీంతో మరో అవార్డు జిల్లా ఖాతాలో పడింది.
Sorry, no posts matched your criteria.