India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరిస్తున్నట్లు ADB కలెక్టర్ రాజర్షిషా కమిషనర్కు వివరించారు.

అంధుల పాలిట వెలుగులు నింపిన లూయి బ్రేయిల్ 217వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈనెల 9న ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మిల్క ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలకు అంధ ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరు కావాలని కోరారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని, అంధుల సమస్యలపై అవగాహన కల్పించేలా కార్యక్రమం సాగుతుందని పేర్కొన్నారు.

రెవెన్యూ శాఖ పరిధిలోని పెండింగ్ దరఖాస్తులు, భూ సమస్యలు, వివిధ సంక్షేమ పథకాలతో సంబంధం ఉన్న వినతులను ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పీవో యువరాజ్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ఉన్నారు

ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల మీదుగా ప్రతిపాదించిన రహదారి నిర్మాణ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అటవీ సంరక్షణ చట్టాల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ అభివృద్ధి పనులు కొనసాగించాలని సూచించారు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో గూడ్స్ సరుకులు రవాణా చేయవద్దని, ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపారు. డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడపకుండా ఓనర్లు బాధ్యత వహించాలని, రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనుమానాస్పద ప్రయాణికులు, నిషేధిత పదార్థాలపై అప్రమత్తంగా ఉండి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

కేస్లాపూర్లో ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతర ఏర్పాట్లను ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతరకు భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వాహనాల పార్కింగ్, రూట్ మ్యాప్ను సిద్ధం చేశామన్నారు. అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఇతర సిబ్బంది ఆయనతోపాటు ఉన్నారు.

విద్యార్థుల శారీరక, మానసిక వికాసమే ప్రధాన లక్ష్యంగా జిల్లాలో ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో ఆరోగ్య పాఠశాలపై సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో మున్సిపల్ ఎన్నికలు, ఓటర్ల జాబితా సవరణ, అభ్యంతరాల పరిష్కారంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఇంద్రవెల్లిలోని కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేస్లాపూర్ నాగోబా దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు తోపాటు సీఎం సలహాదారుడు నరేందర్ రెడ్డిలను హైదరాబాద్లో కలిశారు. ఈనెల 18న నాగోబా మహా పూజ, 22న దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నాగోబా జాతరకు హాజరు కావాలని ఆహ్వాన పత్రం అందించారు.

వైద్య ఆరోగ్యశాఖ NHM పరిధిలో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ డా.నరేందర్ రాథోడ్ తెలిపారు. పూర్తి వివరాలను కార్యాలయ నోటీస్ బోర్డ్ తోపాటు http://adilabad.telangana.gov.in వెబ్సైట్లో ఉంచినట్లు వెల్లడించారు. ఈనెల 9 తేదీలోపు దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.