India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాలు.. నరేశ్, సరస్వతికి సంవత్సరం క్రితం వివాహమైంది. అయితే భార్య భర్తల గొడవ కారణంగానే శనివారం సరస్వతి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. వెంటనే రిమ్స్కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.
ఆదిలాబాద్ మాజీ MP రమేశ్ రాథోడ్, అట్టడుగు స్థాయి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. నార్నూర్ మండలం తాడిహత్నూర్కి చెందిన రమేశ్ OCT 20 1966లో జన్మించారు. రాజకీయ ప్రస్థానం TDP తరఫున 1995లో జడ్పీటీసీగా ప్రారంభమైంది. పలు పదవుల్లో బాధ్యతలు స్వీకరించి ఎనలేని సేవలను అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తనదైన శైలిలో రాజకీయ ముద్ర వేసుకున్నారు. కాగా, నిన్న అస్వస్థతకు గురై మృతి చెందాడు.
DED కళాశాలలో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష కోసం జున్ 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DEO ప్రణీత పేర్కొన్నారు. ఆసక్తి గల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జులై 10న ఆన్లైన్ లో ఉంటుందని పేర్కొన్నారు. ఎడిట్ ఆప్షన్ నేటితో ముగుస్తుందని తెలిపారు. పూర్తి వివరాలకు htpp://deecet.cdse. telangana. gov.in ను సందర్శించాలని సూచించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు కలిశారు. ఢిల్లీలో శనివారం కేంద్రం రక్షణ శాఖ మంత్రిని కలిసి ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్, సైనిక్ పాఠశాల ఏర్పాటు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం 2014లోనే ఆదిలాబాద్లో వైమానిక దళం స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను ప్రారంభించినట్లు వారు గుర్తు చేశారు.
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో రమేష్ రాథోడ్ టిడిపి నుండి ఖానాపూర్ ఎమ్మెల్యేగా, ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ ఛైర్మన్గా పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆదివాసి, గిరిజన గ్రామాల అభివృద్ధికి ఆయన కృషి చేశారని, రమేష్ రాథోడ్ మృతి తనను ఎంతో బాధించిందని ఆయన వెల్లడించారు.
సోన్ మండలం గాంధీనగర్ సమీపంలోని శ్రీరాంసాగర్ జరాష్ట్యంలో చేపల వేటకు వెళ్లి జాలరు మృతి చెందినట్లు ఎస్సై సంతోషం రవీందర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాస్ కుంటే సూర్య (23) అనే జాలరు శనివారం ఉదయం 7 గంటలకు శ్రీరామ సాగర్ జలాశయంలోకి చేపల వేటకు వెళ్ళాడు. ప్రమాదవ శాత్తు వల చిక్కుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
★నార్నూర్ మండలానికి చెందిన వ్యక్తి
★తొలిసారిగా TDP నుండి నార్నూర్ ZPTCగా ఎన్నికయ్యారు.
★ ఖానాపూర్ నుండి రెండుసార్లు MLAగా సేవాలందించారు.
★1999 – 2004 మద్యకాలంలో ఏపీ శాసనసభ సభ్యునిగా
★2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ ZP ఛైర్మన్గా ఉన్నారు.
★2009లో MPగా పనిచేసారు.
★కొన్ని నెలలో BRS నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
★2021 లో BJP లో చేరారు.
★2023లో ఖానాపూర్ MLA గా పోటీచేసి ఓడిపోయారు.
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత అర్ధరాత్రి ఉట్నూర్లోని ఆయన నివాసంలో అస్వస్థతకు గురి కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఎంఐసీయూలో చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎంపీ కోమాలో ఉన్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
గ్రామ పంచాయతీల మాదిరిగానే జిల్లా, మండల ప్రజా పరిషత్లూ త్వరలోనే ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. జులై 4, 5 తేదీల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. దీంతో గ్రామ పంచాయతీల మాదిరిగానే మండల, జిల్లా పరిషత్లోనూ ప్రత్యేకాధికారుల పాలనే అమలులోకి వచ్చే అవకాశం కన్పిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ కసరత్తు చేస్తున్నారు.
ఆదిలాబాద్ SGT సీనియారిటీ జాబితా విడుదలైంది. ఈ మేరకు DEO అన్ని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు SGTలు & తత్సమాన కేడర్ల బదిలీల కోసం సీనియారిటీ జాబితా వెబ్సైట్లో పొందుపరిచినట్లు సందేశాలు పంపారు. ఇందులో ఖాళీల జాబితా కూడా ప్రదర్శించామని పేర్కొన్నారు. MEOలు ఉపాధ్యాయులు ఖాళీలను ధ్రువీకరించాలని, బదిలీలో, జాబితాలో ఏమైనా సవరణలు ఉంటే శనివారం మధ్యాహ్నం 1లోగా దరఖాస్తులు చేసుకోవాలని అభ్యర్థించారు.
Sorry, no posts matched your criteria.