Adilabad

News June 25, 2024

ఆదిలాబాద్: PM విశ్వకర్మ యోజన పథకానికి 6061 దరఖాస్తులు

image

PM విశ్వకర్మ యోజనపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం సోమవారం కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల జనరల్ మేనేజర్ పద్మభూషణ్ విశ్వకర్మ యోజన గురించి వివరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 6061 దరఖాస్తులు చేసుకున్నారని అందులో 1820 దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని తెలిపారు. కాగా మిగతా 4241 దరఖాస్తులను త్వరగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.

News June 24, 2024

కుంటాల: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఓలకు చెందిన బొమ్మన ప్రకాష్ (35) లెఫ్ట్ పోచంపాడు గురుకుల పాఠశాలలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్‌గా పని చేస్తున్నాడు. కొన్నిరోజులుగా మద్యానికి బానిసై
మద్యం మత్తులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. భార్య రీనా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI రజినీకాంత్ తెలిపారు.

News June 24, 2024

ఆదిలాబాద్ : రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు

image

ఇంటర్ సప్లీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎవరికైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఇంటర్ బోర్డ్ అధికారి రవీందర్ తెలిపారు. మొదటి సంవత్సరంలో జనరల్‌లో 3,313 మంది విద్యార్థుకు 2,212 మంది, ఒకేషనల్‌లో 128 మందికి 91 మంది ఉత్తీర్ణత సాధించారు. 2వ సంవత్సరం జనరల్‌లో 2,334 మందికి 1,479, ఓకేషనల్‌లో 235 మందికి 133 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

News June 24, 2024

ఆదిలాబాద్: గుర్తుపడితే సమాచారం ఇవ్వండి

image

ఇటీవల రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితుల ఫొటోను పోలీసులు విడుదల చేశారు. బేల, తాంసీ మండలాల్లో మహిళల మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్ చేసిన విషయం తెలిసిందే. స్నాచర్స్‌ను ఎవరైనా గుర్తుపడితే SDPO 8712659914, జైనథ్ సీఐ 8712659916, రూరల్ సీఐ 8712659915 నంబర్లకు సమాచారం ఇవ్వాలని DSP జీవన్ రెడ్డి కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News June 24, 2024

ఆదిలాబాద్: అంగన్వాడీ టీచర్లకు 3రోజులు శిక్షణ తరగతులు

image

జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా నూతన పాఠ్య ప్రణాళికల్లో జరిగిన మార్పులపై ఆదిలాబాద్‌లో అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభించారు. దీనికి ఐసీడీఎస్ సీడీపీఓ వనజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్య వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. సూపర్వైజర్లు ఫర్హా, విజయలక్ష్మి, నీరజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

News June 24, 2024

జైపూర్‌లో సెల్ టవర్ ఎక్కి కార్మికుడి నిరసన

image

జైపూర్‌లోని పెగడపల్లి గ్రామంలో పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని ఏస్టీపీసీ కార్మికుడు మధు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వెంటనే సంబంధిత అధికారులు తనకు రావాల్సిన పీఎఫ్ డబ్బులను చెల్లించాలని డిమాండ్ చేశాడు.

News June 24, 2024

ADB: ఆయిల్ ఫామ్ సాగు నిర్వహణ నిధులు విడుదల

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 వేల మందికి పైగా రైతులు 16 వేల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేశారు. ఇందులో అదిలాబాద్ జిల్లాలో 1,364 ఎకరాలకు రూ.57.27 లక్షలు, నిర్మల్ 4,523 ఎకరాలకు రూ.189.20 లక్షలు, మంచిర్యాల 599 ఎకరాలకు రూ.25.19లక్షలు, ఆసిఫాబాద్ 494 ఎకరాలకు రూ.20.12లక్షలు విడుదలయ్యాయి.

News June 24, 2024

కేయూ పరిధిలో నేటి నుంచి పరీక్షలు

image

కేయూ బీఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షలు నేటి(సోమవారం) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక ఓ ప్రకటనలో తెలిపారు. కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో బీఫార్మసీ (సీబీసీఎస్) 8వ సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్మెంట్) ఈనెల 24, 26, 28, జులై 1వ తేదీల్లో నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.

News June 24, 2024

నిర్మల్ జిల్లా వాసికి అకాడమి పురస్కారం

image

నిర్మల్ ఉపాధ్యాయునికి జిద్దా ఉర్దూ అకాడమీ పురస్కారం లభించింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బాలుర) ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మహమ్మద్ ఇంతియాజ్‌కు ప్రతి ఏడాది సౌదీ అరేబియాలోని జిద్దా ఉర్దూ అకాడమీ వారు ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. దీంతో జిద్దా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఆయనను హైదరాబాద్‌లో సన్మానించారు.

News June 23, 2024

ఉమ్మడి జిల్లాలో రూ.2,215 కోట్ల రుణాలు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా రైతులు 17 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.2లక్షల లోపు రుణాలు తీసుకున్న దాదాపు 3.90 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలంటే సుమారు రూ.2,215 కోట్లు నిధులు అవసరమని అధికారుల అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు రుణాలు తీసుకున్న రైతులకు ఇది వర్తించనుంది.