Adilabad

News June 20, 2024

తలమడుగులో 2 చిరుతల సంచారం

image

తలమడుగులో 2 చిరుతలు సంచరిస్తున్న విషయం కలకలం రేపింది. కుచులపుర్ గ్రామంలోని ఆశన్నకు చెందిన ఎద్దుపై మంగళవారం చిరుత దాడి చేసింది. మామిడి శేఖర్ అనే వ్యక్తి బుధవారం మేకలను మేపడానికి కొత్తూరు శివారులోని అడవికి వెళ్లాడు. అక్కడ మేకలపై చిరుతలు దాడి చేయడం చూసి గ్రామస్థులకు సమాచారం అందించాడు. FBO అవినాశ్, DYRO రన్వీర్, మండల పశు వైద్యులు డా.దూద్ రామ్ ఘటన స్థలానికి చేరుకొని చిరుతల అడుగులను గుర్తించారు.

News June 19, 2024

సిరికొండ: బడికెళ్లాలంటే 1.5 కి.మీ నడవాల్సిందే

image

సిరికొండ మండలం సాత్ మెారి గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే కాలినడకన 1.5 కి.మీ నడిచి బోరింగూడకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోయారు. మండలంలోని సూర్యగూడ, రాంజీగూడ, బోరింగూడ గ్రామాలకు బస్ సౌకర్యం లేదని, కొన్నిసార్లు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉండక పోవడంతో విద్యార్థులకు కాలినడక తప్పడం లేదన్నారు. అధికారులు స్పందించి బస్ ఏర్పాటు చేయాలని కోరారు.

News June 19, 2024

ADB: నేటి నుంచి 3వ విడత అడ్మిషన్లు షురూ

image

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి, రెండో విడతలు ముగియగా నేటి నుంచి మూడో విడత అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూన్‌ 19 నుంచి జులై 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే నేటి నుంచి జులై 3 వరకు 3వ దశ వెబ్‌ ఆప్షన్లు పెట్టుకోవాలి. జులై 6న మూడో దశ సీట్ల కేటాయింపు జరుగుతుంది. జులై 8 నుంచి డిగ్రీ కళాశాలల తరగతులు ప్రారంభం కానున్నాయి.
>SHARE IT

News June 19, 2024

ఇంద్రవెల్లి: PM కిసాన్ ఈ కేవైసీ సందేశం.. క్లిక్ చేయగానే నగదు ఖాళీ

image

పీఎం కిసాన్ ఈ కేవైసీ సందేశంతో బ్యాంకు ఖాతాలోని రూ.9,945 ఖాళీ అయిన ఘటన బుధవారం వెలుగుచూసింది. ఇంద్రవెల్లి మండలం దొంగరగావ్‌‌కు చెందిన మడావి సురేశ్ ఫోన్‌కి పీఎం కిసాన్ ఈ కేవైసీ అప్‌డేట్ అనే సందేశం వచ్చింది. అతడు ఆ లింకును ఓపెన్ చేయగానే తన బ్యాంక్ ఖాతా నుంచి రూ.9945 నగదు విత్ డ్రా అయినట్లు మరో సందేశం వచ్చింది. దీంతో అతడు సైబర్ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

News June 19, 2024

భైంసా ఆర్టీసీ డీఎంపై సస్పెన్షన్ వేటు

image

భైంసా ఆర్టీసీ డీఎం ఎం.అమృతను సస్పెండ్ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై కరీంనగర్ జోనల్ ఈడీ ఆదేశాల మేరకు నిజామాబాద్ డిప్యూటీ ఆర్ఎం విచారణ జరిపారు. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆదిలాబాద్ ప్రాంతీయ డిప్యూటీ మేనేజర్ ప్రణీత్ వివరాల ప్రకారం బాసర, ముథోల్, తదితర బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపట్టకుండానే డీఎం బిల్లులు రూపొందించి కాజేసినట్లు తేలింది.

News June 19, 2024

ఆదిలాబాద్ : PG విద్యార్థులకు ONLINEలో అసైన్ మెంట్

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్మెంట్లు www.braou.online.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. విద్యార్థులు తమ అసైన్మెంట్లు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం ఆన్లైన్లోనే ఈనెల 20వ తేదీ వరకు
సబ్మిట్ చేయాలని సూచించారు.

News June 19, 2024

ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడి రిమాండ్

image

ఆదిలాబాద్‌లోని ఒక కాలనీకి చెందిన బాలిక(16)కు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేయటంతో పాటు కుటుంబీకులను సైతం బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. బాలిక కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 16న ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్‌స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. నిందితుడు మోరె రాజమౌళి(30)ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.

News June 19, 2024

ఆదిలాబాద్: గ్రూప్-2 అభ్యర్థులకు GOOD NEWS

image

గ్రూప్-2 ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఉచిత గ్రాండ్ టెస్ట్ ల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి ఆదిలాబాద్ కె. రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మొత్తం 12 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి గ్రాండ్ టెస్ట్‌లు జులై 8న
ఉదయం 10 గంటలకు పేపర్-1 మధ్యాహ్నం 1.30కి పేపర్ 2 ఉండును అదేవిధంగా 9న ఉదయం 10 గంటలకు పేపర్-3 ఉంటుందన్నారు.

News June 18, 2024

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాగల ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలుంటాయని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 22 వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

News June 18, 2024

మందమర్రి: సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి

image

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు బకాయి పడిన రూ.30 వేల కోట్లు చెల్లించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) అధ్యక్షులు సీతారామయ్య డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని అరికట్టాలన్నారు. గుర్తింపు సంఘం పత్రం వెంటనే అందించి స్ట్రక్చర్ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. కార్మిక వర్గానికి అండగా నిలిచి కొత్త గనులు సాధిస్తామని తెలిపారు.