India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెస్రం వంశస్థుల్లో నూతన వధువులను నాగోబా దేవునికి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా కుల పెద్దలు నూతన వధువులను నాగోబా దేవుని దగ్గరకు తీసుకువెళ్లి వారితో పూజ చేయించి నాగోబాకు పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కియావాల్’ అంటారు. అక్కడి నుంచి శ్యాంపూర్లోని బోడుందేవ్ జాతర పూర్తయ్యాక ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోతారు.
నార్నూర్ మండలంలో ఐచర్ బోల్తా ఘటన ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్ కనక శ్రీరామ్ ఐచర్ వాహనం నడిపినట్లు పేర్కొన్నారు. డ్రైవర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతి చెందగా.. 35 మందికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియాల్ను సోమవారం సాయంత్రం హైదరాబాద్లో కలిశారు. కవ్వాల్ అభయారణ్యంలో ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టవద్దని, వాహనాలను ఆపవద్దని కోరారు. అలాగే ఆర్ఓఆర్లో రైతులను కూడా ఇబ్బంది పెట్టవద్దని విన్నవించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం ఉన్నారు.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ కాన్ఫరెన్స్ హాల్లో వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అధ్యక్షతన సమావేశం సోమవారం నిర్వహించారు. OSD మురళీధర్షన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇంజినీర్ రెండో సెమిస్టర్ ప్రారంభంలో తీసుకోవాల్సిన చర్యలు, అకాడమిక్స్ సంబంధిత అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపర్చి వర్సిటీ బలోపేతానికి చర్యలు చేపడతామని వీసీ పేర్కొన్నారు.
అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున నిర్మల్, ఖానాపూర్, ముధోల్ మూడు నియోజకవర్గాలకు కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 10,500 మంజూరు చేయనునట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం ఈనెల 24 వరకు గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవరావ్ కుటుంబాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి పరమార్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. రైతు ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకొని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.
NRML జిల్లా <<15204489>>బాసర గోదావరి<<>> నదిలో దూకి శివరాం(62) మృతిచెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. NZB జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటకు చెందిన శివరాం పెద్దకొడుకు 2ఏళ్ల కింద మరణించారు. మనస్తాపం చెందిన శివరాం ఇంటి వద్ద రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించగా కుటుంబీకులు కాపాడారు. సోమవారం బాసరకు వచ్చి గోదావరిలో దూకారు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శివరాం చిన్నకొడుకు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు.
ADB ఆకాశవాణి కేంద్రంలో మంగళవారం “కీరదోస సాగులో మెళకువలు” గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా.వి.మురళీతో ఫోన్ఇన్ నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం హెడ్ తెలిపారు. రైతులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆయన సమాధానిలిస్తారని పేర్కొన్నారు. రైతులు మంగళవారం రాత్రి 7.15 నుంచి 7.45 వరకు 08732-295081, 230081 నంబర్లలో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలన్నారు.
ప్రకృతిని, అడవిని దైవంగా భావిస్తూ ఆదివాసులు ప్రత్యేక పూజలు చేస్తారు. నాగోబా మహా జాతర ప్రారంభమవుతున్న వేళ ఆదివాసులు ఇంద్రాయి, నాగోబా, జంగుబాయి దేవతలకు పూజలు చేస్తారు. గంగాజలం తీసుకువెళ్లే మెస్రం వంశీయులు మొదట ఇంద్రాయి దేవతకు పూజలు చేస్తారు. అనంతరం గోదావరి జలాలతో నాగోబాకు పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. జాతర పూర్తయిన తర్వాత ఆదివాసులు జంగుబాయిని దర్శించి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఓ యువకుడిపై ADB 1 టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. DSP జీవన్ రెడ్డి వివరాలు.. ఓ కళాశాలలో చదువుతున్న బాలిక (17)తో సుందరయ్యనగర్కు చెందిన చౌహాన్ అంకుష్ (23) పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఈనెల 10న ఆమెను HYD తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నమోదు చేసిన పోలీసులు బాలిక ఆచూకీ తెలుసుకున్నారు. అనంతరం అతడిపై కిడ్నాప్, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.