India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.

అభం శుభం తెలియని పసిపిల్లల జీవితాలతో విధి ఆడుకుంది. తల్లిదండ్రులను దూరం చేసి వారిని అనాథలుగా మార్చింది. గాదిగూడలోని దాబా(కే) గ్రామానికి చెందిన సోయం కిషన్(37) అనారోగ్యంతో శనివారం మృతిచెందగా ఆయన భార్య తూర్పబాయి 2021లో మృతిచెందింది. దీంతో వారి పిల్లలు దేవరావు, రాజేశ్వరి అనాథలుగా మారారు. తల్లిదండ్రులను కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న వారిని దాతలు ఆదుకొని భవిష్యత్తుకు దారి చూపాలని వేడుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడిజిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో సమస్యలపై MLAలు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఇతరులను కలవాల్సి వచ్చేది. దీంతో ప్రజల సమస్యలు తీరలేదనే ఆరోపణలున్నాయి. అయితే ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయనే ప్రచారం ఊపందుకుంది. ఈ విడతలో చెన్నూర్ MLA వివేక్, తర్వాత MNCL MLA ప్రేమ్సాగర్రావుకు దక్కనున్నట్లు సమాచారం.

మీడియా అక్రెడిటేషన్ కార్డుల గడువు ఈనెల 31 వరకు ముగియనున్న నేపథ్యంలో వాటి గడువు మరో మూడు నెలలు పొడగించినట్లు ఆదిలాబాద్ పౌర సంబంధాల అధికారిణి తిరుమల పేర్కొన్నారు. గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లాలోని పాత్రికేయుంతా మంగళవారం నుండి అక్రెడిటేషన్ కార్డ్స్ పై స్థిక్కర్లు వేయించుకోవాలి కోరారు.

ప్రజలకు మంచి పోలీసు సేవలను అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీసు అధికారులతో ఆయన సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. స్టేషన్ SHOలు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని, ప్రతి పోలీసుకు క్రమశిక్షణ తప్పనిసరి అని సూచించారు. జిల్లావ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను, మాదకద్రవ్యాలను పూర్తిగా అరికట్టాలని, ‘పోలీసు మీకోసం’ కార్యక్రమాలు కొనసాగాలన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో MRPS జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేశ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరుగుతున్న దండోరా ఉద్యమానికి మొదటి నుంచి అండగా ఉండి కేంద్ర పెద్దలను కిషన్ రెడ్డి ఒప్పించారని మల్లేశ్ అన్నారు. అనంతరం ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాలువతో సత్కరించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదిలాబాద్ అమ్మాయి సత్తాచాటింది. HYDలో ఆదివారం నిర్వహించిన పోటీల్లో ఆదిలాబాద్కు చెందిన క్రీడాకారిణి జాదవ్ కుషవర్తి అండర్ 20 విభాగంలో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ సందర్భంగా జాదవ్ కుషవర్తితోపాటు కోచ్ సౌమ్య, మేనేజర్ అనిల్ను జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేష్, పలువురు అభినందించారు

కళాకారులకు మంచి అవకాశాలున్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని తామను తాము నిరూపించుకోవాలని ప్రముఖ నిర్మాత డాక్టర్ రవి కిరణ్ యాదవ్ అన్నారు. ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో ఆదిలాబాద్ ఫిల్మ్ సొసైటి ఆధ్వర్యంలో తెలంగాణ భాష సంస్కృతిక శాఖ సౌజన్యంతో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టులను మీడియా ఎక్సలెన్సీ అవార్డు, షార్టు ఫిలిం తీసిన వారికి ప్రశంసాపత్రాలు అందించి శాలువాతో సత్కరించారు.

ఆదిలాబాద్లోని TTDCలో విపత్తు నిర్వహణపై ఈ నెల 24 నుంచి 29 వరకు మర్రి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18 నుంచి 40 సం.రాల వయస్సు లోపు పది పాసైన 50 మందికి అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. టిఫిన్, భోజనం ఖర్చులకు వంద రూపాయలతో పాటు రాత్రి వసతి కూడా ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ తలంబ్రాల బుకింగ్ కోసం ప్రత్యేక కౌంటర్ను ఆదిలాబాద్ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. శనివారం ఆమె కౌంటర్ను ప్రారంభించారు. భక్తులు రూ.151 చెల్లించి బుక్ చేసుకుంటే కార్గో సేవల ద్వారా మీ ఇంటి వద్దనే తలంబ్రాలు అందజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.