India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పోలీస్ జాగిలం ‘తార’ అందజేసిన సేవలు మరువలేనివని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. తార పదవీ విరమణ కార్యక్రమాన్ని పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని జాగిలాన్ని శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. బాంబులు, మందు గుండు సామాగ్రి కనుగొనడంలో తార ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు.
అధిక వర్షాలు, వరదలతో ప్రతిఏటా ఆదిలాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరుగుతోంది. అయినప్పటికీ రైతులు మాత్రం పంటనష్ట పరిహారానికి నోచుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5.30 లక్షల ఎకరాల్లో పత్తి, సోయా, జొన్న, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతున్నాయి. కానీ పంట నష్టం జరిగితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వక అటు కేంద్రం నుంచి వచ్చే పరిహారం రాకపోవడంతో రైతుల మీద అప్పులు, పెట్టుబడి భారం పెరిగిపోతోంది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడ కాలనీకి చెందిన వరలక్ష్మి(12)ఇంట్లో ఉన్న కూలర్ తగిలి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న యాపల్ గూడ 2వ పోలీస్ బెటాలియన్ కమాండెంట్గా నిఖిత పంత్ జిల్లాకు బదిలీపై వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రాజర్షి షా, నిఖిత పంత్ దంపతులు. ఒకే జిల్లాలో IPS, IASగా దంపతులు విధులు నిర్వర్తించడం విశేషం.
రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల ఉచిత శిక్షణకు గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ తెలిపారు. ఆసక్తి గలవారు http: //tsstudycircle.co.in వెబ్ సైట్ లో ఈ నెల 17 నుంచి జులై 10 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SHARE IT
ఆదిలాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ అస్వస్థతకు గురైందని ఎలాంటి
హైడ్రామా చేయలేదని జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు తనకు తినటం ఇబ్బందిగా, కడుపునొప్పి ఉందని తెలిపింది. ఆమెను విచారించగా జైలుకి రాక ముందు చిన్నచిన్న బ్లేడు ముక్కలు మింగిందని చెప్పింది. దీంతో చికిత్స నిమిత్తం రిమ్స్ కు తరలించగా వైద్యులు అవసరమైన చికిత్స అందించి సోమవారం డిశ్చార్జ్ చేశారు.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్లో మునిగి అసిఫాబాద్ జిల్లాలో పే అండ్ అకౌంట్లో పని చేసే విజయ్ మృతి చెందాడు. ఎల్ఎండీ వద్ద కూతురు సాయినిత్య, కుమారుడు విక్రాంత్ ఫొటో దిగుతుండగా రిజర్వాయర్లో పడ్డారు. ఈ క్రమంలో వారిని కాపాడబోయిన విజయ్ నీటిలో మునిగి మృతి చెందాడు. కాగా, విజయ్ పిల్లలను జాలరి శంకర్ కాపాడారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలో అంకొలి గ్రామంలో మద్యపానం నిషేధించారు. గ్రామంలోని ప్రజలు, యువకులు, మహిళలు అందరు కలిసి ఈ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత చెడు అలవాట్లకు లోను రాకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17 వేలకు పైగా ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో తమ సమస్యలు పరిష్కారం కాకా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల్లో ఎక్కువగా భూ విస్తీర్ణం, సర్వే నెంబర్లలో తప్పులు, పేరు మార్పిడి, పట్టాల్లో తప్పులు దొర్లడం వంటి అంశాలకు సంధించిన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అత్యధికంగా పెండింగ్ దరఖాస్తులు మంచిర్యాల జిల్లాలో ఉండగా అత్యల్పంగా అదిలాబాద్లో ఉన్నాయి.
బాలికపై ఆమె బంధువు మాయమాటలు చెప్పి ఏడాది కాలంగా అత్యాచారం చేస్తున్న ఘటన ఆదిలాబాద్ పట్టణంలో వెలుగు చూసింది. పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక(17)ను ఆమె బంధువు రాజమౌళి(30) మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలిసిన బాలిక కుటుంబీకులు అతడిని మందలించగా వారిని సైతం వేధించాడు. దీంతో వారు ఆదివారం 2టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతడిపై పొక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.