Adilabad

News January 18, 2025

‘రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి’

image

 రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, ప్రధాన కార్యదర్శి రమేష్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ జట్టుకు శనివారం  క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. 

News January 18, 2025

ఈ యాప్‌తో నిరుద్యోగులకు ఎంతో మేలు: కలెక్టర్

image

నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్‌లో కళాశాలల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అధికారులు ఈ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. డైట్ యాప్‌లో తమ విద్యార్హతలతో పేరును నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వారికి అవసరమయ్యే ఉద్యోగులను నియమించుకుంటుందని చెప్పారు.

News January 18, 2025

నిర్మల్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడి దారుణహత్య

image

నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. చిట్యాలలో 12 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి (12) కల్లు బట్టిలో పనిచేస్తున్నాడు. కాగా గ్రామ శివారులోని చింతలచెరువు సమీపంలో రిషి మర్మంగాలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఇవాళ బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు రిషి మృతదేహన్ని గుర్తించి నిర్మల్ పోలీసులకు సమాచారం అందించారు.

News January 18, 2025

సారంగాపూర్: చిరుత పులి దాడిలో లేగదూడ మృతి

image

సారంగాపూర్ మండలంలోని ఆదివాసీ తండా, దుప్యతండాల మధ్య అటవీ క్షేత్రం సమీపంలో చిరుత దాడిలో రైతు జాదవ్ ప్రేమ్‌కుమార్ చెందిన లేగదూడ మృతి చెందినట్లు అటవీ ఉప క్షేత్ర అధికారి నజీర్ ఖాన్ తెలిపారు. రైతు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకొని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లేగదూడ మృతదేహానికి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌బీఓలు సుజాత, వెన్నెల తదితరులు ఉన్నారు.

News January 18, 2025

ADB: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. APPLY NOW

image

రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధిస్ట్, పార్శి అభ్యర్థులకు గ్రూప్-1,2,3,4, RRB, SSC, బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్ DMWO రాజలింగు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 15 లోపల మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.  నాలుగు నెలల బేసిక్ ఫౌండేషన్ కోర్సు ఇస్తామని.. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 18, 2025

ADB: కాంగ్రెస్ గెలుపునకు సమన్వయంతో పనిచేయాలి: సీతక్క

image

ఇచ్చోడ మండలంలోని స్థానిక గార్డెన్‌లో మంత్రి సీతక్క అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం రాత్రి నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేసి పార్టీ గెలుపునకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సీతక్క సూచించారు.

News January 18, 2025

MNCL: తప్పుడు అఫిడవిట్‌లు సమర్పిస్తే చర్యలు : CP

image

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పాస్‌పోర్ట్, ఉద్యోగ నియామకాలు, విదేశాలకు వెళ్లేందుకు పోలీస్ కేసులు లేవని క్లియరెన్స్ నిమిత్తం తప్పుడు అఫిడవిట్‌లు సమర్పించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. పోలీస్ వెరిఫికేషన్, క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం కొంతమంది గతంలో కేసులు నమోదైన తప్పుడు అఫిడవిట్‌లు సమర్పిస్తున్నట్లు తెలిపారు.

News January 17, 2025

దిలావర్‌పూర్‌: అటవీ ప్రాంతంలో భార్యాభర్తల SUICIDE

image

ఇద్దరు భార్యాభర్తలు ఉరేసుకొని మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఒకే చెట్టుకు ఉరేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానిక ఎస్సై సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 17, 2025

మందమర్రి: కారుణ్య నియామకాలతో 1806 కొలువులు

image

మందమర్రి ఏరియాలో నూతనంగా ఉద్యోగాలు పొందిన 8 మంది డిపెండెంట్లకు జీఎం దేవేందర్ గురువారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటివరకు కారుణ్య నియామకాల ద్వారా 1806 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. నూతన కార్మికులు క్రమం తప్పకుండా విధులకు హాజరై అధిక బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.

News January 17, 2025

ఉట్నూర్: గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల ఉద్యోగాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. హిస్టరీ, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టులలో ఒక్కో పోస్టు ఖాళీగా ఉందన్నారు. పీజీలో 55% ఉత్తీర్ణత కలిగి ఉండి నెట్, సెట్ అర్హత ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈనెల 20 తేదీలోపు కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.