India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ధరణి దరఖాస్తులను పరిష్కరించేందుకు చర్యలను తీసుకుంటున్నామని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. శుక్రవారం చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) ప్రధానకార్యదర్శి నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ (VC) నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి, సీఎం ప్రజావాణి దరఖాస్తులపై చర్చించారు.
తనను ప్రేమించడం లేదని ఓ వ్యక్తి వివాహితపై దాడి చేశాడు. ఈ ఘటన నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను జైభీమ్ అనే వ్యక్తి రెండేళ్లుగా ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఆమె ఎంతకీ ఒప్పుకోకపోవడంతో శుక్రవారం ఆమెపై కత్తిదాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని భైంసా తరలించగా.. అక్కణ్నుంచి మెరుగైన వైద్యంకోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.
ఆదిలాబాద్ సర్కిల్ పరిధిలో జీరో విద్యుత్ ప్రమాదాల లక్ష్యంగా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టామని ఎస్ఈ జయవంత్ చౌహన్ తెలిపారు. నిర్లక్ష్యం, అవగాహన లోపం వలన విద్యుత్ వినియోగదారుల గృహాల్లోని నాణ్యమైన వైరింగ్ లేకపోవడం వల్ల, నాసిరకం విద్యుత్ పరికరాలు వాడటం వలన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి, క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేరడిగొండ మండలం రాజురా పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్లు అందజేసి చాక్లెట్లను పంచారు. విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని సూచించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదువుకొని ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న పాఠశాల భవన పనులను పరిశీలించారు.
మంచిర్యాల పట్టణం NTRనగర్కు చెందిన రవికుమార్(28) ఆత్మహత్య చేసుకున్నట్లు SI ప్రశాంత్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవికుమార్ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కూలి డబ్బులు సరిపోక అప్పులు చేశాడు. అప్పు చెల్లించలేక ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
ఓపెన్ స్కూల్ దూర విద్య పదో తరగతి, ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షకు 746 మంది హాజరుకాగా 313 మంది ఉత్తీర్ణులై 41.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్లో 443 మందికి 243 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్లో 56.12 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఓపెన్ స్కూల్ సమన్వయ కర్త అశోక్ వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా బంజారా సేవ సంఘ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ గురువారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి, శ్రీకాకుళం పార్లమెంట్ ఎంపీ కింజరాపు రామ్ మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేశారు. కేంద్రంలో మంత్రి పదవి దక్కడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు * బెల్లంపల్లిలో కర్రల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా * శ్రీరాంపూర్ గనిలో కార్మికునికి గాయాలు *తానూర్లో పిడుగు పడి వ్యక్తి మృతి *మంచిర్యాలలో ప్రహరీ గోడ కూలి ముగ్గురు మృతి *భైంసాలోని ఏకముఖి ఆలయంలో చోరీ *సిర్పూర్లో అక్రమంగా తరలిస్తున్న పశువుల పట్టివేత *భైంసాలో 2BHK ఇళ్ల కోసం మహిళల రాస్తారోకో *ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
గాదిగూడలోని ధర్మగూడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూలిపోయింది. ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలో లేదని గ్రామస్థులు వాపోయారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక CRT ఉపాధ్యాయులచే చెట్టు కిందనే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల నిర్మించాలని కోరారు.
గాదిగూడలోని ధర్మగూడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూలిపోయింది. ఎమ్మెల్యే, అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడంలో లేదని గ్రామస్థులు వాపోయారు. పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులు లేక CRT ఉపాధ్యాయులచే చెట్టు కిందనే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల నిర్మించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.