Adilabad

News June 12, 2024

ఆసిఫాబాద్: 44 మంది ఉపాధి సిబ్బందికి నోటీసులు

image

పేదలకు వంద రోజుల పని కల్పించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకంలో ఏటా సామాజిక తనిఖీలు జరుగుతున్నా. ఈ సంవత్సరంలో నాలుగు మండలాల్లో తనిఖీలు పూర్తయ్యాయి. ఇందులో 44 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు అందచేయగా ఇద్దరు ఫీల్డ్, మరో ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

News June 12, 2024

ADB: నేటి నుంచి పాఠశాలు ప్రారంభం

image

ఏప్రిల్ 23 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూసి వేసిన బడులు నేటితో ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి సిద్ధం చేశారు. పాఠశాలల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై పాఠశాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయనున్నారు.

News June 11, 2024

ASF: కుక్కల బారి నుంచి జింకను రక్షించిన యువకుడు

image

కుక్కల దాడి నుంచి జింకను ఓ యువకుడు కాపాడి అటవీ అధికారులకు అప్పగించాడు. ఆసిఫాబాద్‌లోని మాణిక్ గూడలో శివారులో ఓ మచ్చల జింకను కుక్కలు చుట్టు ముట్టి దాడికి యత్నించాయి. తప్పించుకునే ప్రయత్నంలో అది ఫయాజ్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చింది. అక్కడ ఉన్న ఫయాజ్ కుమారుడు రహ్మన్ కుక్కలను తరిమి కొట్టి జింకను కాపాడాడు. అనంతరం దానిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. దీంతో యువకుడిని అధికారులు అభినందించారు.

News June 11, 2024

గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి: ఖుష్బూ గుప్తా

image

గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం ఉట్నూర్ పట్టణంలోని పీఎంఆర్సీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గిరిజనులకు నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే నూతన ఒరవడిలో ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించడానికి దృష్టి సారించామని ఆమె వెల్లడించారు.

News June 11, 2024

మంచిర్యాల: ఐటీఐలో అడ్మిషన్ గడువు పొడిగింపు

image

మంచిర్యాల ప్రభుత్వ ఐటిఐలో మొదటి దఫా అడ్మిషన్ 2024 ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం.చందర్ తెలిపారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్స్ లలో శిక్షణను పొందడానికి మొదటి దఫా సీట్ల కొరకు జూన్ 14వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.https://iti.telanhana.gov.in వెబ్ సైటులో నిజ ధ్రువపత్రాల ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News June 11, 2024

కేయూ పరిధిలో జులై 1 నుంచి రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు జూలై 1 నుంచి ప్రారంభం అవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి నర్సింహచారి తెలిపారు. మొదటి పేపర్ జులై 1న, రెండో పేపర్ 3న, మూడో పేపర్ 5న, నాలుగో పేపర్ 8న, ఐదో పేపర్ 10వ తేదీల్లో ఉంటాయని, ఆరో పేపర్ మాత్రం 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

News June 11, 2024

MNCL: రామాలయంలో చోరీ.. బంగారం అపహరణ

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గల రామాలయంలో చోరీ జరిగినట్లు పట్టణ సీఐ బన్సీలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం మెడలో ఉన్న బంగారు పుస్తెను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. ఆలయం నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

News June 11, 2024

మంచిర్యాల: రైల్వే టీసీ పై పెట్రోల్ పోసి దాడికి యత్నం

image

మంచిర్యాల రైల్వే స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న రాజు అనే టికెట్ కలెక్టర్ పై ఒప్పంద కార్మికుడు దాడికి యత్నించాడు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరగుతున్నట్లు సమాచారం. సోమవారం రైల్వే స్టేషన్ లో వీరి మధ్య వివాదం తలెత్తగా ఒప్పంద కార్మికుడు.. రాజుపై పెట్రోల్ పోసి దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తం కావటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనిపై కేసు నమోదైనట్లు సమాచారం.

News June 11, 2024

వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి: సీతక్క

image

వర్షాకాలం శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా, అధిక వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News June 10, 2024

మానవత్వం చాటుకున్న నిర్మల్ పోలీసులు

image

నిర్మల్ పట్టణ పోలీసులు అజార్ ఖాన్, రాథోడ్ అనిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. పట్టణంలో డ్యూటీ నిర్వహిస్తున్న సమయంలో మతిస్థిమితం లేని ఓ మహిళ దుస్తులు లేకుండా రోడ్డు పై కనబడింది. దీంతో ఆ మహిళకు తమ సొంత ఖర్చులతో దుస్తులు కొనిఇచ్చి స్థానిక మహిళల సహాయంతో బట్టలు తొడిగించారు. తమ విధులతో పాటు సామాజిక సేవలో ముందున్న పోలీసులను స్థానికులు అభినందించారు.