India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుడుంబా విక్రయించిన ఇద్దరు మహిళలకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఇచ్చోడ ఎక్సైజ్ సీఐ జుల్ఫికర్ అహ్మద్ తెలిపారు. సోమవారం నింధితులను జిల్లా జైలుకు తరలించారు. గుడిహత్నూర్కి చెందిన జాదవ్ విమల, భక్వాడ్ లక్ష్మి గుడుంబా అమ్ముతూ పలుమార్లు పట్టుబడగా వారిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. మళ్ళీ గుడుంబా అమ్ముతూ పట్టుబడటంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఆయన వెల్లడించారు.
నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్దన్ అనే రైతు పురుగు మందు డబ్బాతో వచ్చాడు. తన సమస్య పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కిష్టాపూర్ IKPకేంద్రం ఆధ్వర్యంలో తను మామిడి కాయలు అమ్మినట్లు తెలిపాడు. రూ.1.50లక్షలు వరకు కేంద్రం నుంచి రావాలని, నెల రోజులైనా అధికారులు డబ్బు చెల్లించడం లేదని వాపోయాడు. ఎన్నిసార్లు కేంద్రం చుట్టూ తిరిగిన పట్టించుకోవడం లేదన్నాడు.
ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అరుదైన పక్షి దర్శనం ఇచ్చింది. తలమడుగు మండలం కోసాయి గ్రామ సమీప అడవుల్లో పొన్నంకి పిట్ట సోమవారం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ కెమెరాకు చిక్కింది. హిమాలయాల అడవులు, మధ్య పశ్చిమ భారత దేశంలోని కొండలలో ఎక్కువగా ఉండే ఈ పక్షి జిల్లా అడవుల్లో ప్రత్యక్షమైంది. ఇది తొమ్మిది రంగుల్లో ఉంటుంది. తెల్లవారుజామున, సంధ్యా సమయంలో వినసొంపైన రెండు శబ్దాలను చేస్తుంది.
ప్రాజెక్టులో గల్లంతైన విద్యార్థి మృతదేహం సోమవారం లభ్యమైంది. భైంసా పట్టణం పిప్రి కాలానికి చెందిన సోలంకె పవన్(18)
ఆదివారం స్నేహితులతో కలిసి సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారీ ప్రాజెక్టులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో గల్లంతయ్యాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం రాత్రి వరకు గాలించినప్పటికీ మృతదేహం లభ్యమవ్వలేదు. సోమవారం ఉదయం మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మినహా దాదాపు అన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మూడు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆదిలాబాద్లో 39.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదైనట్లు తెలిపింది.
సెల్ఫీ కోసం వెళ్లి ప్రమాదవశాత్తు యువకుడు నీటలో గల్లంతైన ఘటన ఆదివారం భైంసాలో చోటుచేసుకుంది. ఏపీనగర్కు చెందిన సోలంకి పవన్(18)తన స్నేహితులతో కలిసి గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద బండపై కూర్చొని సెల్ఫీ దిగుతుండగా సూర్యవంశీ చెప్పు నీటిలో పడిపోయింది. దానిని తీసేందుకు పవన్, శివ కార్తీ నీటిలో దిగి గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు శివ, కార్తీను రక్షించగా పవన్ గల్లంతయ్యాడు. చీకటి పడడంతో ఆచూకీ లభించలేదు.
ఆదిలాబాద్ పట్టణంలో స్టార్ 50 పేరిట ఐటీడీఏ, గిరిజన గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణ తరగతులతో విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటారు. ఎస్టీ కేటగిరి విభాగంలో పవార్ చంటి 422 ర్యాంకు, సాయి కృష్ణ 734 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబర్చారు. మరో 16 మందికి మంచి ర్యాంకులు వచ్చాయని, వారందరికి ఎస్టీ కోటాలో ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాలు లభిస్తాయని కేంద్రం ఇన్ఛార్జ్ మారుతి శర్మ తెలిపారు.
ఎంపీ ఎన్నికలు ముగిసిపోవడంతో నామినేట్ పదవులు భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలోని బోథ్ మార్కెట్ కు ఇప్పటికే పాలకవర్గం ఏర్పాటు చేశారు. తాజాగా ఆదిలాబాద్, జైనథ్, ఇచ్చోడ మార్కెట్లకు కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేస్తూ ప్రతిపాదనను పంపించారు. రెండు రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నాయి. ఆదిలాబాద్, జైనథ్ మార్కెట్లో ఈ దఫా జనరల్, ఇంద్రవెల్లి మార్కెట్ ఎస్టీకి, ఇచ్చోడ మార్కెట్ ఎస్టీ మహిళకు కేటాయించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 20 రోజుల్లో పిడుగుపాటుకు గురై 14 మంది మృతి చెందారు. గడిచిన రెండు రోజుల వ్యవధిలోనే ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇంద్రవెల్లి మండలం డోంగర్గాంలో ఆనక సంతోష్ (28), స్వప్న (26) యువ దంపతులు, చెన్నూర్, కౌటాల, దస్తురాబాద్, తలమడుగు, పెంబి మండలాల్లో పిడుగుపాటుకు పశువులు, వందలాది మేకలు మృత్యువాత పడ్డాయి.
JEE అడ్వాన్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని సత్తా చాటింది. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాస్ నగర్కు చెందిన నర్ర నవీన్ యాదవ్-
రమాదేవి దంపతుల కూతురు నర్ర సిరి జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో 2236 ర్యాంకు సాధించింది. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం పట్ల కుటుంబీకులు, బంధువులు విద్యార్థినిని అభినందించారు.
Sorry, no posts matched your criteria.