Adilabad

News January 11, 2025

ASF: రోడ్డు ప్రమాదంలో ఆరుగురి మృతి.. నిందితుడికి జైలు శిక్ష 

image

మద్యం తాగి నిర్లక్ష్యంగా ఆటో డ్రైవింగ్ చేసి ఆరుగురి మరణానికి కారణమైన నిందితుడికి 6 నెలల జైలు శిక్ష, రూ1500/-జరిమానా విధిస్తూ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. వాంకిడి ఎస్సై ప్రశాంత్ వివరాల ప్రకారం.. 2017లో కెరిమెరికి చెందిన రామచందర్ ఆటో నడుపుతుండగా.. ఒకేసారి బ్రేక్ వేయడంతో పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు.

News January 11, 2025

నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.

News January 11, 2025

జైపూర్: సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బెస్ట్ అవార్డు

image

జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవార్డును అందుకుంది. శుక్రవారం న్యూదిల్లీలో జరిగిన 3వ జాతీయ పవర్ జనరేషన్ వాటర్ మేనేజ్మెంట్ అవార్డ్స్-2025 కార్యక్రమంలో బెస్ట్ వాటర్ ఎఫిషియెంట్ అవార్డు లభించింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యల్పంగా నీటిని వినియోగించినందుకు అవార్డును అందుకున్నట్లు అధికారి D.పంతుల తెలిపారు.

News January 11, 2025

నాగోబా జాతరకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

image

నాగోబా జాతరకు సీఎం రేవంత్ రెడ్డిని మెస్రం వంశీయులు శుక్రవారం ఆహ్వానించారు. రాష్ట్రంలోనే రెండవ గిరిజన జాతరగా పేరుగాంచిన ఆదివాసీల ఆరాధ్యదైవం, మెస్రం వంశీయులతో పూజింపబడే కేస్లాపూర్‌కు జాతరకు రావాలన్నారు. మెస్రం వెంకటరావు పటేల్, మెస్రం మనోహర్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎంను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.

News January 11, 2025

ADB: ఘనంగా ముగిసిన పోలీస్ స్పోర్ట్స్ మీట్

image

ఆదిలాబాద్ పట్టణంలోని ఏఆర్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీస్ స్పోర్ట్స్ మీట్ శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా క్రీడల్లో రాణించి విజేతలుగా నిలిచిన వారిని ఎస్పీ గౌస్ ఆలం అభినందించి, పతకాలను అందజేశారు. పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం అన్నారు. ఏఎస్పీ కాజల్, సురేందర్, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు తదితరులున్నారు.

News January 11, 2025

నిర్మల్: జనవరి 12న యువజన దినోత్సవం

image

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈనెల 12న నిర్మల్‌లో యువజన ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని వివేకానంద చౌక్‌లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఉదయం 9 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. యువజన సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

News January 11, 2025

ఉట్నూర్: ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలి: సీఎం

image

ఆదివాసుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, ఉద్యోగావకాశాలు, రోడ్లు, రవాణా, సాగు, తాగునీటి వంటి పలు అంశాలు, సమస్యలను ముఖ్యమంత్రికి వారు వివరించారు. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, ఆదివాసీ నాయకులు ఉన్నారు.

News January 11, 2025

సీఎంతో సమావేశంలో పాల్గొన్న నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈనెల 26న గణతంత్ర దినోత్సవం రోజు ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుపై చర్చించారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు.

News January 11, 2025

నిర్మల్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లా అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి మోహన్‌సింగ్ తెలిపారు. మైనారిటీ అభ్యర్థులకు 4నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి15లోపు ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయధ్రువపత్రాలతో జిల్లా మైనారిటీ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News January 10, 2025

నిర్మల్ : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలకు (కేజీబీవీ మినహా) ఈనెల 11 నుంచి సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని డీఈవో రామారావు తెలిపారు. అకడమిక్‌ క్యాలెండర్‌లో ఈనెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 11న రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయని తెలిపారు. ఈనెల 18న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు.ః

error: Content is protected !!