India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తీర్యాని మండలం స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం దగ్గర కాలువ సమీపంలో కూన చిన్న పోషయ్య అనే వ్యక్తి ఉరేసుకుని మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సంఘటన విషయాన్ని పోలీసులకు చేరవేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ను ఆదివారం ఢిల్లీలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పూల మొక్క అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రామారావ్ పటేల్, పాల్వాయి హరీశ్ బాబు, దన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు తదితరులున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కోర్డు ఆవరణలో ఇద్దరు చోరీకి యత్నించారు. టూ టౌన్ సీఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఇద్దరు వ్యక్తులు కోర్టు ఆవరణలోని నీటి విద్యుత్ మోటార్, 2 పైపులను చోరీ చేసి, రిక్షాలో తీసుకెళ్తుండగా గమనించిన కోర్టు అటెండర్ శ్రీనివాస్ వారిని మందలించడంతో వారిద్దరూ రిక్షాను వదిలి పారిపోయారు. అటెండర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
KU పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ కోర్సుల నాలుగో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఎస్.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి బీఎస్ఎల్ సౌజన్య తెలిపారు. ఈనెల 11 నుంచి ఈపరీక్షలు జరగాల్సి ఉండగా.. వివిధ పోటీ పరీక్షలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు సెమిస్టర్ పరీక్షల్ని వాయిదా వేసినట్లు తెలిపారు.
కూతురే పెద్దకొడుకై తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తలకొరివి పెట్టిన ఘటన తాండూర్లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. IBకి చెందిన రవికుమార్ కొన్ని నెలలుగా HYDలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, సోదరులు ఉన్నారు. తలకొరివి పెట్టడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో మృతుడి పెద్ద కుమార్తె కావ్య కుమారుడి బాధ్యతను తీసుకొని తలకొరివి పెట్టింది.
సింగరేణిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 29 వరకు పొడిగించినట్లు కార్పొరేట్ జీఎం పర్సనల్ దీక్షితులు తెలిపారు. సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవడంలో గత నెల 15న సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్ లైన్ ప్రక్రియ మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు.
విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ దుర్మరణం చెందిన ఘటన ఆదిలాబాద్ రూరల్ మండలంలో చోటుచేసుకుంది. యాపల్ గూడకు చెందిన మోతిరామ్ విద్యుత్ పనులు చేస్తుంటాడు. అయితే ఆదివారం విద్యుత్ స్తంభం ఎక్కి పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఆయన స్తంభం పైనే మృతి చెందాడు. కాగా ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.
ఆసిఫాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా కావల్కర్ లక్ష్మీ బాయి, కావల్కర్ సురేష్ కు చెందిన రెండు ఇళ్లల్లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో రెండు ఇల్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆదిలాబాద్లో మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ భాషలకు సంబంధించి 220 లాంగ్వేజ్ పండిట్ పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా ఉన్నతీకరణ చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి ప్రణీత తెలిపారు. ఈ మేరకు రీజినల్ జాయింట్ డైరెక్టర్ శనివారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
TGPSC నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్ష నేడు జరగనుంది.. కాగా ఉమ్మడి జిల్లా గ్రూప్1 అభ్యర్థుల కోసం సలహా సూచనలు
★ హల్ టికెట్ పై రీసెంట్ ఫొటో అతికించాలి
★ బ్లూ లేదా బ్లాక్ పెన్ మాత్రమే తీసుకెళ్లాలి
★ ఎలాంటి పరికరాలకు అనుమతి లేదు
★ నిమిషం నిబంధన.. 10 గంటలకు గేట్ క్లోజ్
★ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
★ ఏదైనా గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లాలి
★ ఉదయం 10.30 నుంచి 1 వరకు పరీక్ష
-ALL THE BEST
Sorry, no posts matched your criteria.