India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ముంబాయిలో భారీ వర్షాల కారణంగా గురువారం రెండు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు పీఆర్వో రాజేశ్ షిండే ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం నాటి జాల్నా-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు(నంబరు 20705), బల్లార్ష-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నందిగ్రాం ఎక్స్ప్రెస్ రైలు(నెంబరు 11002) రద్దు చేశామన్నారు. ఆదిలాబాద్ ప్రయాణికులు గమనించాలని సూచించారు.

ఆదిలాబాద్ పట్టణం తిర్పల్లిలోని శ్రీనివాస వైన్స్లో గోడకు రంధ్రం చేసి చోరీకి యత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. వడ్డెర కాలనీకి చెందిన బిలాల్, చిలుకూరి లక్ష్మీనగర్కు చెందిన షారుక్తోపాటు మరో ముగ్గురు చోరీకి యత్నించారన్నారు. బుధవారం పంజాబ్ చౌక్లో అనుమానస్పదంగా తిరుగుతున్న బిలాల్, షారుక్లను అరెస్టు చేశామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని చెప్పారు.

గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ టూటౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఎస్ఐ విష్ణుప్రకాష్ బుధవారం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంగా మహాలక్ష్మీవాడకు చెందిన మసూద్, మహారాష్ట్రకు చెందిన సల్మాన్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని తనిఖీ చేయగా రూ.6,075 విలువైన 243 గ్రాముల ఎండు గంజాయి లభించిందన్నారు.

బీఎస్పీ ద్వారానే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమని బీఎస్పీ సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ అడ్వకేట్ నిషాని రామచంద్రం పేర్కొన్నారు. ఇచ్చోడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీసీలకు 43% రిజర్వేషన్ అమలు చేయడంలో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. బీజేపీ రాజ్యాంగ రద్దు కోసం కుట్ర చేస్తుందన్నారు. నాయకులు జంగుబాపు, సతీష్ తదితరులున్నారు.

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడెం నగేష్ ఢిల్లీలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సీసీఐని పునరుద్ధరించాలని విన్నవించారు. ఈ మేరకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు MP నగేష్ పేర్కొన్నారు. అనంతరం తెలంగాణలోని తాజా రాజకీయ అంశాలను కేంద్ర మంత్రితో చర్చించినట్లు వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లాలో వరద బీభత్సానికి డ్యామేజ్ అయినా వివరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మెడికల్ క్యాంప్, శానిటేషన్ తదితర వాటిపై కలెక్టర్ రాజర్షిషా అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సర్వే నిర్వహించాలన్నారు. జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న పంటలను, రోడ్లు, తదితర వాటి అంచనాలను వేగవంతంగా పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని సూచించారు.

ADB నుంచి గోమూత్రి, కరంజి గ్రామాలకు వెళ్లే బస్సును అంతర్గామ్ వద్ద వాగు ఉప్పొంగడంతో రాత్రి మార్గమధ్యంలోనే నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై పీర్ సింగ్ నాయక్ ఘటనాస్థలానికి చేరుకొని స్థానిక యువకులతో కలిసి తాడు సహాయంతో ప్రయాణికులను వాగు దాటించారు. నీటిప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు వాగులు, వంకలను దాటవద్దని ఎస్సై సూచించారు. తమకు సహకరించిన పోలీసులు, యువకులకు ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు.

ADB పర్యటనకు వచ్చిన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుని బీఆర్ఎస్ నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో కేసీఆర్కు పీసీసీ అధ్యక్షుడి హోదాలో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు రైతులకు ఇవ్వాలని రేవంత్రెడ్డి లేఖలో డిమాండ్ చేశారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా రూ.25 వేల పరిహారం చెల్లించాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో అజయ్, సాజిత్, గోవర్ధన్, దేవిదాస్, వేణుగోపాల్, సలీమ్ ఉన్నారు.

మే నెలలో తరోడా వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన దత్తు కుటుంబ సభ్యులకు మంత్రి జూపల్లి కృష్ణారావు రూ.5 లక్షల చెక్కును మంగళవారం ఆదిలాబాద్లో అందజేశారు. ఈ విషాధ సంఘటన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం సహాయనిధి కింద కుటుంబానికి ఆర్థికభరోసా కల్పించినట్లు తెలిపారు. MLAలు పాయల్ శంకర్, బొజ్జు పటేల్ తదితరులున్నారు.

జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేశ్ తెలిపారు. చాంద(టి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్-14, 16, 18, 20 విభాగాలలో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత ఆసక్తి గల క్రీడాకారులు 9492136510 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.