Adilabad

News June 9, 2024

ADB: నేడు గ్రూప్‌-1 EXAM.. ఇది మీ కోసమే!

image

నేటి గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ADB 18, నిర్మల్ 13, మంచిర్యాల 27, ఆసిఫాబాద్ జిల్లాలో 13 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 22,964 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులు కేంద్రాల వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది.
>ALL THE BEST

News June 8, 2024

MNCL: దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు

image

దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు మంచిర్యాల DCP అశోక్ కుమార్ తెలిపారు. గత కొద్ది నెలలుగా జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల్లో జల్సాలకు అలవాటుపడ్డ నిందితులు ఖమ్మంకు చెందిన యెసొబు @(సురేశ్ రెడ్డి), రాహుల్‌ను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి 21/4 తు.ల బంగారం, 15 తు.ల వెండి, రూ.2,44,660 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

News June 8, 2024

ADB: పారదర్శకంగా హోంగార్డుల బదిలీ ప్రక్రియ పూర్తి: ఎస్పీ

image

ఆదిలాబాద్ జిల్లాలో హోంగార్డుల బదిలీ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం హోంగార్డుల బదిలీ ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. హోంగార్డులను లక్కీ లాటరీ విధానం ద్వారా బదిలీ ప్రక్రియను నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

News June 8, 2024

వాంకిడిలో అనుమానాస్పదంగా యువకుడి మృతి

image

వాంకిడి మండలంలోని కనార్ గాం గ్రామానికి చెందిన కళ్యాణ్ (18) అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. కళ్యాణ్ పెరట్లో వెళ్లి అక్కడే కిందపడి ఆరిచాడు. చుట్టూ పక్కల వారు గమనించి వెంటనే ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

అసిఫాబాద్: ఉమ్మడి జిల్లాలో 23,504 గ్రూప్ -1 అభ్యర్థులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షకు 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 23,504 అభ్యర్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్‌లో 13 పరీక్ష కేంద్రాల్లో 4,608, అదిలాబాద్‌లో 18 పరీక్ష కేంద్రాల్లో 6,729, ఆసిఫాబాద్‌లో 13 పరీక్ష కేంద్రాల్లో 2,783, మంచిర్యాలలో 27 పరీక్ష కేంద్రాల్లో 9,384 పరీక్షకు హాజరవుతున్నారు.

News June 8, 2024

సిర్పూర్ (టి): యువతి ప్రాణాలు కాపాడిన ఎస్ఐ

image

సిర్పూర్(టి) మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఏరియా లోని న్యూ రైస్ మిల్ గోదాం దగ్గర ఓ యువతి సూపర్ వాస్మోల్ తాగింది.  గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిర్పూర్ (టి) ఎస్ఐ రమేశ్ ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 8, 2024

ADB: ‘గ్రూప్ 1 పరీక్షలో సందేహాలకు సంప్రదించండి’

image

ఆదిలాబాద్ జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు పరీక్ష జరుగుతుందని 6,729 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు వెల్లడించారు. పరీక్ష కేంద్రాలు, హాల్ టికెట్ డౌన్ లోడ్ గురించి, ఇతర సందేహాల నివృతి కోసం 9491053677 నంబర్‌ను సంప్రదింవచ్చిన అభ్యర్థులకు సూచించారు.

News June 7, 2024

సీఎంతో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారం విద్యార్థి

image

సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి కార్యక్రమానికి జన్నారం మండలంలోని కిష్టాపూర్ జడ్పీ పాఠశాలలోని పదో తరగతి విద్యార్థి రాథోడ్ ఈశ్వర్ ఎంపికయ్యారు. జూన్ 9న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో విద్యాశాఖ సహకారంతో పదో తరగతి టాపర్లతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ నెల 10న హైదరాబాద్‌లోని హరిహర కళాక్షేత్రంలో విద్యార్థులను, హెచ్ఎంలను, తల్లిదండ్రులను ఆయన సన్మానించనున్నారు.

News June 7, 2024

కరీంనగర్ ఎంపీని కలిసిన ఆదిలాబాద్ ఎంపీ

image

బీజేపీ జాతీయ కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని ఢిల్లీలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బండి సంజయ్ సైతం ఆదిలాబాద్ ఎంపీ నగేశ్‌ను శాలువతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు ముస్తాపురే అశోక్, తదితరులు పాల్గొన్నారు.

News June 7, 2024

ఆదిలాబాద్‌లో పోస్టుల వివరాలు ఇలా..!

image

ADB జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 3,028 ఉండగా ప్రస్తుతం 2,467 మంది పని చేస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 20 మంది పదవీవిరమణ పొందగా ఇందులో నలుగురు అనారోగ్య, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో 561 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 275 ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్లో చూపించారు. ఆయా కేటగిరిల్లో 286 ఖాళీలు ఉన్నాయన్నమాట. తాజా డీఎస్సీలో చేర్చితే పోస్టులు పెరిగి నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశముంది.