Adilabad

News January 8, 2025

చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు: నిర్మల్ SP

image

నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకీషర్మిల ప్రకటనలో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా వాడితే ప్రజలు, జంతువులకు ప్రాణాపాయం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైనా మాంజా కట్టడికి పోలీసు శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

News January 7, 2025

ADB డీఈఓను పరామర్శించిన కలెక్టర్

image

ఆదిలాబాద్ విద్యాశాఖాధికారి ప్రణీతకు గుండెపోటు వచ్చిన నేపథ్యంలో ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా మంగళవారం ఆమెను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి డీఈఓ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, తదితరులున్నారు.

News January 7, 2025

మంచిర్యాల: సాఫ్ట్ వేర్ దంపతుల సూసైడ్

image

ఓ సాఫ్ట్ వేర్ దంపతులు సూసైడ్ చేసుకున్న ఘటన HYDలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలు.. మియాపూర్‌కు చెందిన సందీప్, మంచిర్యాలకు చెందిన కీర్తికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 3ఏళ్ల పాప, 14 నెలల బాబు ఉన్నారు. ఆదివారం పాప బర్త్ డే విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. అనంతరం సందీప్ బయటకు వెళ్లి తిరిగొచ్చే సరికి ఇంట్లో కీర్తి ఉరేసుకుని కనిపించింది. దీంతో మనస్తాపం చెందిన సందీప్ సూసైడ్ చేసుకున్నాడు.

News January 7, 2025

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి: MNCL కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 29 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.

News January 7, 2025

మందమర్రి ఏరియాలో పర్యటించిన డైరెక్టర్

image

సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి మందమర్రి ఏరియాలో సోమవారం పర్యటించారు.GM దేవేందర్‌తో కలిసి ఏరియాలోని KK-OCPసందర్శించి పని ప్రదేశాలను పరిశీలించారు. ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షించారు. రవాణాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు అంకితాభావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువుతుందన్నారు.

News January 7, 2025

ఖానాపూర్‌లో చైనా మాంజా కలకలం

image

ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చైనా మాంజా తగిలి ఒకరు గాయపడ్డారు. ఆ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ పనిలో భాగంగా చేపలు పట్టడం కోసం సోమవారం గోదావరికి వెళ్తున్న సమయంలో జూనియర్ కాలేజ్ రోడ్డుపై పడిన చైనా మాంజా అకస్మాత్తుగా ఆయన గొంతుకు తగిలి కట్టయ్యింది. స్థానికులు ఆయనను మొదట ఖానాపూర్ ఆస్పత్రికి, అటు నుంచి నిర్మల్ ఆసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు పడ్డాయి. ఈ సంఘటన ఖానాపూర్‌లో సంచలనం రేపింది.

News January 7, 2025

ఆదిలాబాద్ DSPగా విజయ్ కుమార్

image

అవినీతి నిరోధక శాఖ ఆదిలాబాద్ DSPగా పి.విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది బొకో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీకి సంప్రదించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064లో వివరాలు తెలియజేయాలన్నారు.

News January 7, 2025

జిల్లా తుది ఓటరు జాబితా విడుదల:  MNCL కలెక్టర్

image

మంచిర్యాల జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా నూతన ఓటరు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందిన తుది ఓటరు జాబితా ప్రచురించినట్లు పేర్కొన్నారు.

News January 7, 2025

MNCL: పరీక్షల షెడ్యూల్ విడుదల..!

image

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు- 2024.-25 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్, 11న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12 నుంచి 16 వరకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

News January 6, 2025

స్త్రీలను కోటీశ్వరులను చేసేందుకు కృషి: MNCL కలెక్టర్

image

ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్‌కుమార్ దీపక్ అన్నారు. ముల్కల్ల పంచాయతీ వీరాంజనేయులు SHG సభ్యురాలు విజయకు సంచార చేపలు విక్రయించేందుకు వాహనాన్ని సోమవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతతో వ్యాపారాన్ని నిర్వర్తించి కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

error: Content is protected !!