India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తనను ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు గురిచేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ADB 1 టౌన్ CI సునీల్ కుమార్ వివరాలు.. తల్లిగారింటి వద్ద ఉంటున్న ఓ వివాహిత(24), శాంతినగర్కి చెందిన షేక్ ఆసిఫ్ 8నెలల పాటు సహజీవనం చేశారు. కాగా తనను ఆసిఫ్ మోసం చేశాడని, లైంగికంగా వేధించి తన వీడియోలు తీశాడని బాధిత మహిళ ఆరోపించింది. ఆసిఫ్ తనను కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం కేసు నమోదైంది.
ఏడాది క్రితం ప్రేమ పేరుతో <<12630813>>యువతిని హత్య<<>> చేసిన వ్యక్తికి నిర్మల్ జిల్లా కోర్టు జీవితకాల శిక్ష, విధించింది. పోలీసులు వివరాలు.. ఖానాపూర్ అంబేడ్కర్ కాలనీకి చెందిన శ్రీకాంత్ అదే కాలనీకి చెందిన అలేఖ్యను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె నిరాకరించడంతో ద్వేషం పెంచుకున్నాడు. ఆమెకు వివాహం నిశ్చయం కావడంతో విషయం తెలుసుకున్న శ్రీకాంత్ 2024 ఫిబ్రవరి 8న ఆమెను కత్తితో నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు.
శాంతినగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఆసిఫ్పై 1 TOWN PSలో అట్రాసిటీ, రేప్ కేసు నమోదైంది. CI సునీల్ వివరాల ప్రకారం.. ఆసిఫ్ ప్రేమపేరుతో వెంబడిస్తూ ఓ యువతిని బెదిరించగా ఆమె నిరాకరించింది. ఆమెను బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లి గదిలో బంధించాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకొని వీడియోలు తీశాడు. పెళ్లి చేసుకోకుంటే వీడియోలు లీక్ చేస్తానని కులంపేరుతో దూషించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.
కరెంట్ షాక్తో ADBకు చెందిన బాలిక మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంబేడ్కర్నగర్కు చెందిన 9వ తరగతి చదువుతున్న తహ్రీం గత నెల 18న తన ఇంటి డాబా పైకి వెళ్లింది. ఈ క్రమంలో డాబాపై నుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబీకులు రిమ్స్కు, అక్కడి నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం బాలిక మృతి చెందింది.
పైలెట్ ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాజస్థాన్ నుంచి వచ్చిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ నిఖిల్ డేతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందనడంతో కలెక్టర్ను వారు అభినందించారు.
ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
మంచిర్యాలలోని వడ్డెర కాలనీలో మనుబోతుల భాగ్యరేఖ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వినీత కథనం ప్రకారం.. జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భాగ్యరేఖకు వడ్డెర కాలనీకి చెందిన మనుబోతుల సురేష్తో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తీసుకున్న అప్పు రూ.1.50లక్షల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భాగ్యరేఖ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వినీత తెలిపారు.
ఆదిలాబాద్ డివిజన్లో 37 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడిపగలగాలి. టెన్త్లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ADB జిల్లాలో ఇంటర్ ఆపైన చదువుతున్న పోస్ట్ మెట్రిక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనాలకు ఈపాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని DSCDO సునీత కుమారి తెలిపారు. రినివల్, ఫ్రెష్ పోస్ట్మెట్రిక్ విద్యార్థులు 31 మార్చి వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉపకారవేతనములు పొందేందుకు SSC మెమో, ఆధార్ కార్డులలోని పేరు ఒకేలా ఉండాలన్నారు.
వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనలకు గురవుతున్నారు. మూడు రోజుల కిందట నార్నూర్ మండలంలోని వ్యాపారి ఇంట్లో రూ.2 లక్షలు చోరీ కాగా ఇంద్రవెల్లిలోని వెంకటి ఇంట్లో రూ.8లక్షలు చోరీ ఆయ్యాయి. కూతురు పెళ్లి కోసం రూ.8 లక్షలు జమ చేసి ఇంట్లో ఇనుప పెట్టెలు దాచానని శనివారం గుర్తు తెలియని దొంగలు దొంగతనానికి పాల్పడ్డారని వెంకటి ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న చోరీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.