India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికల్లో ‘కారు’ కనుమరుగైంది. ఏ నియోజకవర్గంలోనూ తన పట్టును నిలుపుకోలేకపోయింది. గతేడాది ఎమ్మెల్యే ఎన్నికల్లో నిర్మల్ నియోజకవర్గంలో BRS పార్టీకి 55,697 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 8,512 ఓట్లు మాత్రమే వచ్చాయి. ముథోల్లోనూ అప్పుడు 74,253 ఓట్లు రాగా ఈ ఎన్నికల్లో 12,505 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఖానాపూర్లో ఆ ఎన్నికల్లో దాదాపు 25 వేల ఓట్లు రాగా ఇప్పుడు 7,464 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఆదిలాబాద్ ఎంపీగా BJP అభ్యర్థి గోడెం నగేశ్ గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు 29 పోలింగ్ కేంద్రాల్లో సింగిల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. మెుత్తంగా బీఆర్ఎస్కు 161 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి నగేశ్ కు 3 కేంద్రాల్లో, కాంగ్రెస్ అభ్యర్థి సుగుణకు ఒక కేంద్రంలో మాత్రమే సింగిల్ డిజిట్ ఓట్లు వచ్చాయి. ఆమెకు మాన్కాపూర్ (202)లో 5 ఓట్లు వచ్చాయి.
ఆదిలాబాద్ లోక్సభ బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులంతా గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేశారు. దీంతో ఉద్యోగ వర్గం ఎటువైపు మొగ్గుచూపుతారనే ఉత్కంఠ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది. కాగా మంగళవార వెల్లడించిన ఫలితాల్లో 4,049 మంది ఉద్యోగులు బీజేపీకి ఓటు వేసి ఆధిక్యతను కట్టబెట్టారు. కాంగ్రెస్ కు రెండో స్థానం, బీఆర్ఎస్ కు మాడో స్థానానికి పరిమితం చేశారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున గోడం నగేశ్ భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో 6వ తేదీ నుంచి మూడు రోజులు నిర్వహించే సమావేశానికి ఆయన హాజరు కానున్నట్లు ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు బ్రహ్మానంద ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదిలాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆత్రంసక్కు డిపాజిట్ కోల్పోయారు. ఈయనకు ఈవీఎం ద్వారా 1,36,463 , పోస్టల్ బ్యాలెట్ 837, మెత్తంగా 1,37,300(11.11%) ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ధరావత్ కోల్పోయారు. కాగా ఇక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటి చేసిన గోడం నగేశ్ కు 5,68,168 ఓట్లు (45.98%)వచ్చాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆత్రం సుగుణకు 4,77,516 (38.65%) ఓట్లు వచ్చాయి.
ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన గోడం నగేశ్కు ఆది నుంచి విజయం, అదృష్టం వరిస్తూనే ఉన్నాయి. TDPలో సుదీర్ఘకాలం పని చేసిన ఆయన BRSలో చేరిన వెంటనే టికెట్ దక్కించుకొని ఎంపీగా విజయం సాధించగా అదే రీతిలో ఈసారి BJPలో చేరిన మూడు రోజుల్లోనే టికెట్ దక్కించుకొని గెలుపొందారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు నెలల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రిగా సేవలదించారు.
పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి BJP అభ్యర్థిగా పోటి చేసిన గోమాసె శ్రీనివాస్ 2 సార్లు ఒకే కుటుంబానికి చెందిన వారి చేతిలో ఓటమిపాలయ్యారు. 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై ఓడిపోయిన ఆయన తాజాగా ఆయన కుమారుడు వంశీకృష్ణపై ఓటమి పాలయ్యారు. 2009లో TRS తరఫున పోటీ చేసిన శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై 49,017 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా ఇప్పడు 1,31,364 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
అసెంబ్లీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ
సిర్పూర్ 19840 62956 71325
అసిఫాబాద్ 38597 73996 47056
ఖానాపూర్ 18520 61587 75106
ఆదిలాబాద్ 16265 77056 82394
బోథ్ 22472 65204 70118
నిర్మల్ 8264 64033 107603
ముధోల్ 12505 67501 105334
మొత్తం BRSకు 1,37,300 ఓట్లు, CONGకు 4,77,516, BJPకి 5,68,168 ఓట్లు రాగ 90,652 మెజార్టీ వచ్చింది.
20 ఏళ్ల నుంచి ఆదిలాబాద్ ఓటర్లు ఏ పార్టీకి రెండు సార్లు వరుసగా విజయాలు ఇవ్వలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ బీజేపీదే కావడం.. తాజా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి 20ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇదే కాకుండా 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత BJPలో చేరిన సోయం ఎంపీగా గెలిచారు. ఇప్పుడు గొడం నగేశ్ సైతం బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి MPగా పోటీలో నిలిచారు. అలాగే పార్టీలో చేరిన వెంటనే గెలిచిన అభ్యర్థిగా నగేశ్ నిలిచారు.
లోక్సభ ఓట్ల లెక్కింపుల్లో BRS అభ్యర్థి ఆత్రం సక్కు అన్ని రౌండ్లలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2019లోక్సభ ఎన్నికల్లో 3,18,665 సాధించి రెండోస్థానంలో నిలిచిన BRS మొన్నటి శాసనసభల్లో ఆసిఫాబాద్, బోథ్ ఎమ్మెల్యేలకే పరిమితమైనప్పటికీ ఏడు నియోజకవర్గాల్లో వచ్చిన 4,48,961 ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా కేవలం 1,37,217 ఓట్లతో 3వ స్థానానికి రావడం గమనార్హం
Sorry, no posts matched your criteria.