Adilabad

News February 12, 2025

ADB వాసికి అంతర్జాతీయ అవార్డు

image

అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో భాగంగా ఉత్తమ డిస్క్రిప్షన్ డైరెక్టర్‌గా ADBకు చెందిన ప్రముఖ సినీ డైరెక్టర్ ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు. మంగళవారం HYDలో జరిగిన చలనచిత్ర ఉత్సవంలో భాగంగా సినిమా, టీవీ రంగాల్లో పలు విభాగాలలో అందించిన అంతర్జాతీయ అవార్డుల పురస్కారంలో భాగంగా బెస్ట్ డిస్క్రిప్షన్ డైరెక్టర్ డైరెక్టర్‌గా ఫహీం సర్కార్ అవార్డు అందుకున్నారు.

News February 12, 2025

ADB: పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్.. APPLY NOW

image

2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ చదువుతున్న SC, ST, BC, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ADB జిల్లా SC అభివృద్ధి శాఖాధికారి బి.సునీత కుమారి మంగళవారం ప్రకటనలో తెలిపారు. రెన్యూవల్, కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు E-Pass ఆన్ లైన్‌లో మార్చి 31 లోపుగా సమర్పించాలన్నారు.

News February 12, 2025

ADB: క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి కృషి

image

క్షయ వ్యాధి (టీబీ) రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేయాలని ఆదిలాబాద్ జిల్లా క్షయ వ్యాధి నివారణాధికారి సుమలత అన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరుకు చెందిన ఆక్యు పంచర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిరణ్, మంజునాథ్, రఘు ఆయుర్వేద, ఆక్యు పంచర్ వైద్య విధానంలోని పలు అంశాలపై అవగాహన కల్పించారు.

News February 11, 2025

ADB: 7ఏళ్లయినా ఉద్యోగం ఇవ్వట్లేదని వాపోయిన యువతులు

image

స్టాఫ్ నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఈ విషయమై సోమవారం ఉట్నూర్, గాదిగుడా నుంచి బాధితులు శైలజ, విజయలక్ష్మి, నీల ప్రజావాణికి వచ్చారు. అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి విన్నవించారు. ట్రైనింగ్ పూర్తి చేసి 7 సంవత్సరాలు అవుతుందన్నారు. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పోస్ట్‌కి దరఖాస్తు చేసుకున్నా తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు.

News February 11, 2025

ADB: బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

image

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా చించ్ ఖేడ్‌కు చెందిన గోటి జితేందర్ బజర్హత్నూర్ మండలానికి చెందిన ఓ బాలికను ముంబైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

News February 11, 2025

ADB: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన జర్నలిస్ట్

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులగం దేవిదాస్ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

News February 11, 2025

ADB: FEB 18న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక

image

ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18న సబ్-జూనియర్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్ తెలిపారు. ఎంపికైన జిల్లా జట్టు వికారాబాద్ జిల్లాలోని 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు.

News February 11, 2025

ADB: ఆమెపైన చీటింగ్ కేసు నమోదు చేయండి: నవీన్

image

ఏక కాలంలో రెండు రెగ్యులర్ కోర్సులు కలిగి టీచర్ ఉద్యోగం పొందిన సౌజన్యపైన న్యాయ విచారణ జరిపించాలని ప్రజావాణికి తాంసి మండలానికి చెందిన అభ్యర్థి నవీన్ కుమార్ కోరారు. ఒక సాధారణ విద్యార్థిగా సుమారు 350 కి.మీ దూరంగా ఉన్న వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి రెండు కోర్సులు చేయడం సాధ్యం కాదన్నారు. ఆమె తప్పుడు సర్టిఫికెట్ పెట్టి అధికారులను తప్పుదోవ పట్టించిందన్నారు. చీటింగ్ కేసు నమోదు చేయలన్నారు.

News February 11, 2025

ADB: ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన ప్రజ్ఞ కుమార్

image

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రత్నజాడే ప్రజ్ఞ కుమార్ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్‌కు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

News February 11, 2025

ADB ఐటీ టవర్ పనులను పూర్తి చేయాలి : మాజీ మంత్రి

image

ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఐటీ టవర్ అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జయేశ్ రంజన్ ను హైదరాబాద్‌లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఐటీ పరిశ్రమలను పట్టణాలకు విస్తరించాలని గత ప్రభుత్వం జిల్లాకు 2022లో ఐటీ టవర్ మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటికి పనులు పూర్తి కాలేదన్నారు.