India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్వహించే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న నాగోబా జాతరపై గురువారం కేస్లాపూర్ గ్రామంలోని నాగోబా దర్బార్ హాల్లో జిల్లా అధికారులు, దేవాదాయ, దేవాలయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జాతరకు లక్షలాది మంది ఆదివాసీలు, గిరిజనులు వస్తారని, అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న పులిని అటవీ అధికారులు పట్టుకున్నారు. సిర్పూర్(టి) మాకిడి అటవీ ప్రాంతానికి 7కి.మీ దూరంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగుడా సమీపంలో అక్కడి ఫారెస్ట్ అధికారులు బుధవారం రాత్రి పట్టుకున్నారు. కాగా గతేడాది నవంబర్ 29న కాగజ్నగర్ గన్నారంలోని ఓ పొలంలో పనులు చేస్తున్న లక్ష్మిపై పులి దాడి చేసింది. కాగా ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు. బుధవారం టీఎస్యూటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సమాజ నిర్మాణం తరగతి గదిలోనే ప్రారంభమవుతుందన్నారు. సామాజిక స్పృహ కలిగిన సంఘంగా కొత్త ఏడాదిలో నవ ఉత్తేజంతో పనిచేయాలని సూచించారు.
కేజీబీవీ ఉపాధ్యాయుల సమ్మె కారణంగా విద్యార్థులు తమ చదువును నష్టపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని డీఈవో రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నామన్నారు. విద్యార్థులకు ఏ రకమైన సమస్యలు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
శాంతి భద్రతల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా జనవరి 1 నుంచి 31వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం SP మాట్లాడుతూ.. DSP, ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదన్నారు.
2024 చివరి రోజు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు యువకులు మృతి చెందారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మెుగవెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో బైక్ అదుపుతప్పి కడెం కెనాల్లో పడి ఇద్దరు యువకులు చనిపోయారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా భీమారంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. కొమ్ము ప్రభాకర్ స్వామి ఇంటి వద్ద అయ్యప్ప స్వామికి వైభవంగా పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అయ్యప్ప స్వాములు భజనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. డిసెంబర్ 31ని ఇలా భక్తిశ్రద్ధలతో ముగించి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
SC వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ప్రతినిధి, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ జనవరి 3న బహిరంగ విచారణ చేపడతారని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను బహిరంగ విచారణలో స్వీకరిస్తారని పేర్కొన్నారు.
నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కేజీబీవీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడిపోయింది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు కడెం మెయిన్ కెనాల్లో పడిపోయి మరణించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద విషయాల్ని పోలీసులకు చేరవేసినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున భైంసాలోని నాగదేవత ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పెకిలించే క్రమంలో సమీపంలోని టైల్స్ పగిలిపోయాయన్నారు. ఇంతకుమించి ఆలయంలో ఎటువంటి నష్టం జరగలేదన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న దానిని నమ్మవద్దని SP విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.