India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సాయం చేస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఓ మహిళ NZB 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. SHO రఘుపతి వివరాల ప్రకారం.. భర్తతో గొడవ పడి నిర్మల్కు వెళ్లిన మహిళను గౌతమ్ ఈ నెల 17న NZBకి తీసుకొచ్చాడు. అనంతరం ఆమెను ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు SHO వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కను ఆదివారం హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు కలిశారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడ్డ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధి కేటాయించాలన్నారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
హన్మకొండలో జరుగుతున్న రాష్ట్రస్థాయి CMకప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికలజట్టు ఫైనల్స్ లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో వరంగల్ జట్టుతో తలపడి 12గోల్స్ ఆధిక్యంలో జిల్లా జట్టు విజయం సాధించింది. జిల్లా క్రీడాకారులు,కోచ్ అరవింద్ ను ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ సంఘం అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు,కనపర్తి రమేష్,పలువురు అభినందించారు.
నిర్మల్ ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. డిసెంబర్ 31న జిల్లావ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తారని గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగవద్దని, మైనర్లు వాహనాలు నడపవద్దని, గుంపులు గుంపులుగా రోడ్లపై తిరగవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.
హన్మకొండలోని జెఎన్ఎస్ మైదానంలో 2 రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ సీఎం కప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రతిభ కనబర్చి ఫైనల్స్కు చేరుకుంది. ఆదివారం ఉదయం రంగారెడ్డి జిల్లా జట్టుతో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్లో 17గోల్స్ తేడాతో గెలుపొంది ఫైనల్స్కు చేరుకుంది. జిల్లా జట్టు క్రీడాకారులను, కోచ్ సునార్కర్ అరవింద్ను పలువురు అభినందించారు.
కర్ణాటకలోని మైసూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల యువకుడు మృతి చెందాడు. దొరగారిపల్లెకు చెందిన బల్జిపెల్లి సందీప్ హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కాగా సందీప్ స్నేహితులతో కలిసి శుక్రవారం కారులో మైసూర్ వెళ్లగా శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సందీప్తో పాటు మరొకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సందీప్ మృతితో దొరగారిపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
నిర్మల్లో మహిళపై అత్యాచారం జరిగిన ఘటన వివరాలను టౌన్ సీఐ శనివారం వెల్లడించారు. శుక్రవారం బస్టాండ్లో కానిస్టేబుల్ అనిల్ విధులు నిర్వహిస్తుండగా ఆటో డ్రైవర్ స్పృహ కోల్పోయి ఉన్న మహిళ వివరాలు తెలపారు. వారు బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనను యోగేష్ అనే వ్యక్తి లాడ్జికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని తెలుపగా కేసు నమోదు చేశామన్నారు.
తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో 85, పట్టణ ప్రాంతాల్లో 25 విజయ పాల విక్రయ కేంద్రాలు మహిళా సంఘాల ద్వారా ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కేంద్రాలకు విజయ సఖి పేరుతోనడుపుతున్నామన్నారు. శనివారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విజయ సఖి నమూనా ఫ్రిడ్జ్ను ఆయన ఆవిష్కరించారు. డెయిరీ డిడి మధుసూదన్ తదితరులు ఉన్నారు.
సిర్పూర్ మండలం ఇటిక్యాల పహాడ్లోని ప్లాంటేషన్లో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. పెద్దపులి అడుగులను గుర్తించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి అడుగులను గుర్తించి గ్రామస్థులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని, ఉదయం 10 దాటాక వెళ్లి సాయంత్రం 4 లోపే ఇంటికి చేరుకోవాలన్నారు.
డా. BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3 ,5 సెమిస్టర్ విద్యార్థులకు కాంటాక్ట్ కం కౌన్సిలింగ్ తరగతులను ఈనెల 29న ఆదిలాబాద్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ శనివారం పేర్కొన్నారు. పీజీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.