Adilabad

News June 1, 2024

AARA SURVEY: ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవనుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

News June 1, 2024

ADB: రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత లేదు: వ్యవసాయశాఖ డైరెక్టర్

image

రాష్ట్రంలో పత్తివిత్తనాల కొరత లేదని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి అన్నారు. ఆదిలాబాద్‌లో రాశి కాటన్ సీడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం, సరిపడా విత్తనాలు లేకపోవడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తమిళనాడు నుంచి 30 వేల ప్యాకెట్లను తెప్పించి ఆదిలాబాద్ పంపించినట్టు ఆయన తెలిపారు. మరో 4, 5 రోజుల్లో 40 వేల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

News June 1, 2024

ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లా భీమారంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా దాహెగాం 45.9, ఆదిలాబాద్ జిల్లా అర్లి(టీ)లో 45.7, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ మధ్యాహ్నం వేళల్లో బయటకు రాకూడదని సూచించారు.

News June 1, 2024

నేటి నుంచి బాసర ట్రిపుల్ఐటీలో దరఖాస్తుల స్వీకరణ

image

బాసర ట్రిపుల్ఐటీలో 2024-25 విద్యాసంవత్సరానికి శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు VC వెంకట రమణ తెలిపారు. ఈ ఏడాది ఆన్‌లైన్ దరఖాస్తు విధానాన్ని ఎస్సెస్సీ బోర్డు సర్వర్‌తో అనుసంధానం చేసినట్లు వెల్లడించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, పేరు తదితర వివరాలు ఆటోమేటిక్‌గా కనిపిస్తాయన్నారు. జూన్ 1నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

News June 1, 2024

ఆదిలాబాద్: PG విద్యార్థులకు ONLINEలో అసైన్‌మెంట్

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్‌మెంట్‌లు www.braou.online.in వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి అసైన్‌మెంట్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం ఆన్‌లైన్‌లోనే ఈనెల20వ తేదీ లోపు సబ్మిట్ చేయాలన్నారు.

News June 1, 2024

ADB: ఎగ్జిట్‌ పోల్స్‌ ఎటువైపు?

image

లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ నేడు సాయంత్రం ముగియనుండటంతో‌ అందరి చూపు ఎగ్జిట్‌ పోల్స్‌పై పడింది. ADB, PDPL పరిధిలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. కాగా ఎవరికి వారే తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ ద్వారా గెలుపు ఓటములపై ఓ అంచనాకు రానున్నారు. దీని ద్వారా తీవ్ర ఉత్కంఠకు కొంత తెరపడనుంది. ఓటరు నాడీ తెలియాలంటే ఈనెల 4 వరకు వేచిచూడాల్సిందే.!

News June 1, 2024

ADB: ఏవో బదిలీ, ఏఈవో సస్పెండ్.. ఎందుకంటే!

image

ADBలో రైతులు డిమాండ్ చేసే పత్తివిత్తనాల విషయంలో పర్యవేక్షణను ప్రామాణికంగా తీసుకొని పట్టణ వ్యవసాయ అధికారి రమేశ్‌ను బాధ్యతల నుంచి తప్పించి బోథ్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో బోథ్ వ్యవసాయ అధికారి విశ్వామిత్రను నియమించారు. పట్టణంలోని ఫర్టిలైజర్ షాప్‌లో పూర్తి స్థాయి విత్తనాలు పంపిణీ చేయించడంలో నిర్లక్ష్యం వహించిన యాపల్‌గూడ ఏఈవో శివచరణ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు.

News May 31, 2024

నస్పూర్: చోరీ కేసులో మనవరాలే సూత్రధారి

image

నస్పూర్ నాగార్జున కాలనీలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. హైదరాబాద్ లో చదువుకునే యువతి వేసవి సెలవుల్లో భాగంగా తన తాత ఇంటికి వచ్చింది. తాను ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఎవరూ లేని సమయంలో యువకుడితో కలిసి ఇంట్లో బీరువా పగులగొట్టి రూ.4.5 లక్షల నగదు, సుమారు 15 తులాల బంగారం, 30 తులాల వెండి దొంగలించారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు.

News May 31, 2024

మంచిర్యాల: ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య

image

మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మందమర్రిలో చోటుచేసుకుంది. 2020లో పట్టణానికి చెందిన గౌతంకు హనుమకొండకు చెందిన విజయలక్ష్మితో వివాహం అయింది. కాగా కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌తో పాటు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. సమాచారం అందుకున్న SI రాజశేఖర్ చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 31, 2024

ఆసిఫాబాద్‌లో ఉద్రిక్తత

image

ఆసిఫాబాద్ మండలం దానాపూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిని అటవీ అధికారులు అక్రమించుకుంటున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూమిని ఆక్రమించేందుకు గ్రామంలోకి వచ్చిన అటవీ అధికారులను గ్రామస్థులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షన జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ రైతులు రహదారిపై నిరసన వ్యక్తం చేశారు.