Adilabad

News December 28, 2024

ఆసిఫాబాద్: ఏడాదిలో 1207 కేసులు నమోదు

image

ఆసిఫాబాద్ జిల్లాలో గత సంవత్సరం కంటే హత్య కేసులు 45.45%, రోడ్డు ప్రమాదాలు 1.6% తగ్గాయని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SPవార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. 2024లో జిల్లాలో 12 హత్య కేసులు, 82ఆస్తి సంబంధిత నేరాలు, 3నేర పూరిత నరహత్యలు, 04దొమ్మి కేసులు,18 కిడ్నాప్‌లు, 24 రేప్‌లు, 34 SC,STనేరాలు, 27పోక్సో,39 గంజాయి కేసులు, 188మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులు నమోదయాయన్నారు.

News December 28, 2024

ఆదిలాబాద్: ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు స్పెషల్ అడ్మిషన్ల గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ డీఈఓ ప్రణీత పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 24తో గడువు ముగియగా ఈనెల 30 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కావున విద్యార్థులు www.Telanganaopenschool.orgలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. SHARE IT

News December 28, 2024

మంచిర్యాల: ఆన్‌లైన్ గేమ్‌లో మోసపోయిన ప్రభుత్వ ఉద్యోగి

image

ఆన్‌లైన్ గేమ్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగిని మోసగించిన కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో మంచిర్యాల బస్టాండ్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ PS SHO, DSP వెంకటరమణ తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి రూ.1,36,96,290మోసపోయానని తమకు ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తు చేయగా నిందితుడు ఎక్సైజ్ కానిస్టేబుల్ మహమ్మద్ అబ్దుల్ నయీం అని తెలిసి అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

News December 28, 2024

బెల్లంపల్లి: హత్యకు ప్రయత్నించిన ఐదుగురి రిమాండ్

image

పాత పగలు మనసులో ఉంచుకొని పథకం ప్రకారం ఒకరిని హత్యకు ప్రయత్నించిన 5గురు నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు రూరల్ CIఅబ్సలుద్దీన్ తెలిపారు.CIవివరాల ప్రకారం..ఈనెల 24న బాధితుడు పురుషోత్తం కాగజ్ నగర్ నుంచి మంచిర్యాలకు కారులో వెళుతుండగా ముగ్గురిలో ఒక వ్యక్తి బెల్లంపల్లి వద్ద కారు ఆపి పురుషోత్తంను బండరాళ్లతో తలమీద బాది పారిపోయారు. నేడు తాండూరులో నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించామన్నారు.

News December 28, 2024

MNCL: జిల్లాలో 61452.920 మె.టల ధాన్యం కొనుగోలు

image

మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు 61452.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. ఇందులో 18082.120 మె.టల సన్నలు ఉన్నట్లు పేర్కొన్నారు. నేటికీ రూ.76.23 కోట్లు 5,144 మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు పూర్తి చేసిన 69 కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరిగిందన్నారు. అకాల వర్షాలకు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News December 27, 2024

నార్నూర్: కేజీబీవీ తనిఖీ చేసిన ఎంఈఓ

image

నార్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను శుక్రవారం మండల విద్యాశాఖాధికారి పవార్ అనిత తనిఖీ చేశారు. అనంతరం బోధన సిబ్బంది రికార్డులను పరిశీలించి విద్యార్థులకు పాఠం నేర్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనాన్ని అందించాలన్నారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులపై దృష్టి పెట్టాలని, పరీక్షల్లో ఉన్నత స్థాయిలో నిలవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

News December 27, 2024

ఆదిలాబాద్‌: కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేడు ఉదయం జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష, మధ్యాహ్నం జరగాల్సిన 1వ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 31 మంగళవారం జరుగుతాయని స్పష్టం చేశారు. కావున ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News December 27, 2024

మంచిర్యాల: సిగ్నల్స్ రావాలంటే చెట్టెక్కాల్సిందే.!

image

ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్ లేని వారంటూ ఉండరు. సాంకేతికత చాలా విస్తరించినప్పటికీ కొన్ని గ్రామాల్లో సెల్‌ఫోన్లకు సిగ్నల్స్ రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జోగాపూర్ గ్రామంలో టెలిఫోన్ సిగ్నల్ లేక గ్రామస్థులు ఎవరికైనా ఫోన్ చేయాల్సి వస్తే చెట్లు, గోడలు, బిల్డింగులు ఎక్కుతున్నారు. బంధువులు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా నెట్వర్క్ ఏరియాలో లేదు అని వస్తుందని వాపోతున్నారు.

News December 27, 2024

సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’

image

అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్‌తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.

News December 26, 2024

నిర్మల్ : ‘కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి’

image

కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్మెన్‌లు , టీచింగ్ స్టాఫ్‌ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.

error: Content is protected !!