India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్ పట్టణంలోని ఓ కంప్యూటర్ సెంటర్ను షీ టీం బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా అక్కడ కంప్యూటర్ టైప్ నేర్చుకునేందుకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు షీటీం విధులు, సైబర్ క్రైమ్ పైన అవగాహన కల్పించారు. ఎవరైనా పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, మాట్లాడిన, ఫొటోలు తీయడం లాంటి దుశ్చర్యలకు పాల్పడినా సమాచారం అందించాలన్నారు. తమ వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
పెంపుడు శునకానికి పురుడు చేసిన ఘటన నిర్మల్ జిల్లాలోని కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. మండలానికి చెందిన చంటి గత కొన్ని నెలలుగా ఓ శునకాన్ని పెంచుకుంటున్నాడు. అయితే 3 రోజుల క్రితం అది 3 పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో మంగళవారం రకరకాల వంటకాలు చేసి శునకానికి పురుడు వేడుక నిర్వహించారు.
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ సందర్శించారు. పలు వార్డుల్లో తిరుగుతూ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. మెటర్నిటీ వార్డ్ను సందర్శించి గర్భిణులతో మాట్లాడారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఆదివాసీ, గిరిజనుల ఆరోగ్య సేవల కోసం ఏర్పాటు చేసిన వార్డును సందర్శించి గిరిజనులకు అందిస్తున్న సేవలపై వైద్యులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.
ఆదిలాబాద్లోని మహాలక్ష్మివాడకు చెందిన మహమూద్-అఫ్సాన దంపతుల మధ్య గతేడాది నుంచి గొడవలు జరుగుతున్నాయి. అయితే గతేడాది అఫ్సాన పోలీసు స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసి పుట్టింట్లోనే ఉంటోంది. సోమవారం మహమూద్ అత్తారింటికి వెళ్లి కాపురానికి రావాలని భార్యను కోరాడు. ఆమె నిరాకరించడంతో కోపోద్రిక్తుడై బండరాయితో కడుపులో కొట్టాడు. దీంతో బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు నమోదు చేశారు.
బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్ మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఆయనకు జిల్లా బీసీ సంఘం నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు హన్మండ్లు యాదవ్,
నారాయణ, దేవేందర్, రవికాంత్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామానికి చెందిన అంజన్న(29)అనే వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మృతుడు కూలి పని చేసుకునేవాడన్నారు. సంవత్సర కాలంగా కడుపునొప్పి, సైనస్ వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఉండేవాడు. ఆసుపత్రులలో చూపించి మందులు వాడినా వ్యాధి నయం కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తెలిపారు.
మరో వారంరోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లో ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థుల భవిష్యత్తు ఏంటో తేలిపోనుంది. బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందుతారని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు సైతం తమ అభ్యర్థి గెలుస్తాడనే ధీమాతో ఉన్నారు. కాగా ప్రధాన పార్టీల నుంచి గోడం నగేష్, ఆత్రం సుగుణ, ఆత్రం సక్కు ఎన్నికల బరిలో నిలిచారు.
జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఏంల ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పోస్టల్, ఈవీఎం ఓట్ల లెక్కింపుకు వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా మొత్తం పూర్తి స్థాయి ఫలితాల వెల్లడికి మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం పడుతుందని పేర్కొన్నారు..
ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కర్బలా గ్రామానికి చెందిన సాయినాథ్ (35) వ్యవసాయ భూమిలో భూమిని చదను చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి డ్రైవర్ పై పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికుల తెలిపారు. భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ తెలిపారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకంలో జనరల్ వర్క్, సూపర్ వైజర్, వెల్డింగ్, ఎలక్ట్రిషియన్, పైపు ఫిట్టర్, ప్లంబింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్ కోర్సుల్లో 3 నెలలపాటు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.