India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్లో పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని హమాలీవాడకు చెందిన రాజు ఇంట్లో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తు వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ అయి మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన రాజు వంట గ్యాస్ పై దుప్పటి కప్పేశాడు. దీంతో మంటలు దుప్పటికి సైతం అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
కొమురం భీం జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి శివారు ప్రాంతంలోని ఎర్రగుంట సమీపంలో మళ్లీ పెద్ద పులి కనిపించినట్లు రైతులు పేర్కొన్నారు. పాలఓర్రే, మంగలి కుంట, కుమ్మరి కుంట, కంట్లం దారి, నక్కచెలీమ, లోడపల్లి కెనాల్ ఏరియా, లోడపల్లి ఎర్ర వాగు చెరువు ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తుందని తెలిపారు. కావున గ్రామ ప్రజలు అటవీలోకి వెళ్లారాదని. అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల సేవలను సద్వినియోగం చేసుకోవాలనిఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలీసు సహాయం కావాలన్నా వెంటనే డయల్ 100కు గాని స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీ మండలం PACS ఛైర్మన్ చుంచు శ్రీనివాస్కు అరుదైన పురస్కారం లభించింది. అనునిత్యం వ్యవసాయంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న శ్రీనివాస్ దంపతులకు రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా గాంధీ ప్రతిష్ఠ సంస్థ ద్వారా అందిస్తున్న గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అవార్డును అందజేశారు. వారు మాట్లాడుతూ..అరుదైన పురస్కారం లభించడం వల్ల తనకెంతో సంతోషంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రభుత్వం కక్షపూరితంగానే కేసులు నమోదు చేస్తుందని బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేష్ అన్నారు. ఆదివారం అయన ఉట్నూర్లో మాట్లాడుతూ.. గురుకుల పాఠశాల విద్యార్థుల ఫుడ్ పాయిజన్ పై నిలదీయడం, హైడ్రా బాధితులకు అండగా నిలబడడంతోనే కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. కేటీఆర్ను టచ్ చేస్తే ఆందోళన తప్పదన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో గంజాయి అనే పదం వినపడకుండా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, అందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు తమ వంతు కృషి చేయాలని ఎస్పీ గౌస్ ఆలం సూచించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 75 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 987.425 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. సుమారు రూ.2 కోట్ల 31 లక్షల 31 వేల 750 విలువ గల గంజాయి కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో భాష ప్రాతిపాదికన నియామకాలు చేపట్టాలని ఖానాపూర్ MLA వెడ్మ భొజ్జు పటేల్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జీవో నెంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టి వేయడంతో గిరిజనుల బతుకులు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. కావున, ఏజెన్సీ ప్రాంతంలో భాష ప్రాతిపాదికన గిరిజనులకు ఉద్యోగాలు కల్పించి న్యాయం చేయాలన్నారు.
మంచిర్యాల జిల్లాలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు జనవరి 11 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హైయ్యర్ గ్రేడ్ పరీక్ష, 11వ తేదీన టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12, 16వ తేదీన హైయర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఆధునిక పద్ధతులలో సంప్రదాయ పంటలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత పథకం-2024, కింద జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యాచరణపై వ్యవసాయ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మహిళా శక్తి క్యాంటీన్లలో సేంద్రియ ఉత్పత్తుల ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
అక్రమ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా SPశ్రీనివాసరావు హెచ్చరించారు. SP మాట్లాడుతూ.. జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు అక్రమంగా గుట్కాలు అమ్ముతున్న వారిలో 44 కేసులలో 59మందిని అరెస్ట్ చేసి, రూ.38,38152/-విలువగల గుట్కా రికవరీ చేశామన్నారు. PDS బియ్యం, ఇసుక, గుట్కా, గంజాయి లాంటి వాటితో అక్రమ వ్యాపారాలు చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.