Adilabad

News February 4, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి షాక్.. బరిలో మరో అభ్యర్థి

image

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి తొలి నామినేషన్ దాఖలైంది. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ సోమవారం కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించక కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.

News February 4, 2025

ఆదిలాబాద్: MALE నిరుద్యోగులకు GOOD NEWS

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 5న TSKC ఆధ్వర్యంలో TASK సౌజన్యంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంగీత, TSKC కోఆర్డినేటర్ శ్రావణి పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో HETERO లాబొరేటరీస్‌లో ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ లో పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఐటిఐ, మెకానికల్ డిప్లమా పాసైన యువకులు మాత్రమే అర్హులన్నారు. SHARE IT.

News February 4, 2025

ADB జిల్లా వాసికి ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డ్

image

క్యాన్సర్ వ్యాధి నివారణకు 10 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా వాసి డాక్టర్ ఉమాకాంత్ గౌడ్ ది బెస్ట్ ఆంకాలజిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రొఫెసర్లు అవార్డుకు ఎంపిక కాగా.. అందులో ADBలోని శాంతి నగర్‌కు చెందిన ఉమాకాంత్ గౌడ్ ఉన్నారు. ఈనెల 4న కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ‌లో అవార్డు అందుకోనున్నారు.

News February 4, 2025

ADB: టీబీ నిర్మూలన అందరి బాధ్యత: కలెక్టర్

image

టీబీ నిర్మూలన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధ్యక్షతన ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్‌పై జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి వైద్య సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్ ఉన్నారు.

News February 3, 2025

నేరడిగొండలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని వాంకిడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోథ్ మండలం కౌట గ్రామానికి చెందిన నోముల వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 3, 2025

ADB: బీజేపీ బాధ్యతలు బ్రహ్మానంద్‌కే..!

image

భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పతాంగె బ్రహ్మానంద్ నియమితులయ్యారు. దీంతో ఆయన రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన గతంలో గుడిహత్నూర్ జడ్పీటీసీగా పనిచేశారు. ఆయన నియామకంపై పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News February 3, 2025

ఒమన్ దేశంలో జన్నారం వాసి మృతి

image

జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం మల్లేష్(48) ఓమన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మల్లేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మల్లేష్ ఏడాది క్రితం ఒమన్ దేశానికి బతుకుదెరువు కోసం వెళ్లాడు. వచ్చే శనివారం రెండవ కుమార్తె పెళ్లి జరగనుంది. ఇంతలోనే మల్లేష్ మృతితో కవ్వాల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 3, 2025

ఆదిలాబాద్: దివ్యాంగుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

వికలాంగుల ఉపాధి, పునరావాస పథకం కింద దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పించటానికి అర్హులైన దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవాలని ఆదిలాబాద్ DWO సబిత తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 12 తేదీ లోపు https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ పథకం క్రింద బ్యాంకు లింకేజ్ లేకుండా నేరుగా రూ.50 వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 21 యూనిట్లు జిల్లాకు కేటాయించడం జరిగిందన్నారు.

News February 2, 2025

ADB రిమ్స్ ఆసుపత్రిలో NCD క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్

image

అసాంక్రమిక వ్యాధులచే బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో NCD క్లినిక్ ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం రోగులను పరీక్షించే గది, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించే గదులను ఆయన సందర్శించారు. NCD క్లినిక్‌లో అసాంక్రమిక వ్యాధులతో (రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైనవి) వాటితో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

News February 2, 2025

ఇచ్చోడలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

image

మామడ (M) పులిమడుగుకు చెందిన తులసిరాం, రాజు శనివారం బైక్‌పై ఇంద్రవెల్లి (M) కేస్లాపూర్ నాగోబా జాతరకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో అధికవేగంతో ప్రయాణిస్తున్న వారి బైకు ఇచ్చోడ (M) దుబార్ పేట్ వద్ద లారీని తప్పించబోయి కిందపడింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాజు మృతి చెందాడని ఎస్సై తిరుపతి తెలిపారు.