India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి ఈనెల 18న కోర్టులో హాజరు పర్చగా 2వ అదనపు మెజిస్ట్రేట్ మంచిర్యాల బస్టాండను 5 రోజుల (ఈనెల 20 నుంచి 24) వరకు శుభ్రం చేయాలని శిక్ష విధించారు. ఇది ఇలా ఉండగా మరో 22మందిని ఇవాళ కోర్టులో హాజరు పరచగా 14మందిని 5రోజులు ట్రాఫిక్ అసిస్టెంట్ విధులు నిర్వర్తించాలని, మిగతా వారికి రూ.17500/-జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ B.సత్యనారాయణ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమ కేసుల దుశ్చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ తెలంగాణ ఇమేజ్ను ప్రపంచవ్యాప్తంగా పెంచడమే లక్ష్యంగా ఫార్ములా ఈ కారు రేసింగ్ను చేపట్టగా అవకతవకలకు పాల్పడ్డారని కేసులు నమోదు చేయడమేమిటని ప్రశ్నించారు.
అత్యాచారయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ నిర్మల్ కోర్టు తీర్పునిచ్చింది. కోర్టు సమన్వయ అధికారి ప్రకారం.. కుభీర్ మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక 2021 జులై 18న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నరేశ్ బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తండ్రి కుభీర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నేరం రుజువు కావడంతో శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
లోకేశ్వరం మండలం లక్ష్మీ నగర్ తండాకుఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు కాపాడారు. వారి వివరాల ప్రకారం.. రాందాస్ అనే వ్యక్తి మద్యానికి బానిసై తరచు భార్యతో గొడవ పడేవాడు. భార్య మందలించగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య డయల్ 100కు కాల్ చేయగా బ్లూ కోల్డ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ఆయనను రక్షించారు. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అటవీ శాఖ పాత మంచిర్యాల, ముల్కల్ల బీట్ అడవిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. సఫారీ రోడ్ మీదుగా అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాపింగ్ కెమెరాకి పులి చిక్కింది. దీంతో పులి సంచరించిన ప్రదేశాల్లో పాదముద్రలు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అడవిలోకి వెళ్లవద్దని, పత్తి చేనులోకి రైతులు గుంపులుగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన 8 మందికి నెల రోజుల జైలు శిక్ష, రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ స్పెషల్ PDR కోర్టు ADB జడ్జి దుర్గారాణి బుధవారం తీర్పునిచ్చారు. వాంకిడిలోని రాంనగర్కు చెందిన ఆత్మారాం అతడి కుమారుడికి మధ్య భూ తగాదాలు జరగడంతో వారిని కుల పెద్దలు 4ఏళ్ల పాటు కులం నుంచి బహిష్కరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 2020మే20న వారిపై SHO రమేశ్ కేసు నమోదు చేయగా వారికి బుధవారం జడ్జి శిక్ష విధించారు.
నిర్మల్లోని కొండాపూర్ బైపాస్ వద్ద అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ఇద్దరిని తనిఖీ చేయగా మూడు చనిపోయిన ముళ్ల పందులు లభించినట్లు నిర్మల్ ఎఫ్ఆర్వో రామకృష్ణారావు తెలిపారు. ముళ్లపందులను దిలావర్పూర్ అటవీ ప్రాంతంలో చంపి నిర్మల్కు చెందిన విజయ్, నాగరాజు విక్రయించడానికి తీసుకువెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బైకును జప్తు చేసి నిందితులను కోర్టులో హాజరు పరిచమన్నారు.
తాండూరు మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధి అండర్ బ్రిడ్జి ఐబీ చౌరస్తా వద్ద సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్ కుమార్, మాదారం ఎస్సై సౌజన్య వాహన తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. సీఐ మాట్లాడుతూ..ప్రతి వాహనా దారులు వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇవాళ క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియాని కలిశారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో క్రీడా అభివృద్ధికి తోడ్పడాలని ఎంపీ కోరారు. అలాగే హాకీ కోర్టుకు సింథటిక్ టార్ప్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్రమంత్రికి నగేష్ వినతి పత్రం అందజేశారు.
బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ADB వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. స్థానిక శాంతినగర్కు చెందిన ఆసిఫ్ (23) పాఠశాలకు వెళ్తున్న 9వ తరగతి చదువుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వేధింపులకు గురి చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు వన్ టౌన్లో ఫిర్యాదు చేశారు. యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.