India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

ఉమ్మడి KNR, ADB, NZB, MDK ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో భాగంగా 11వ రౌండ్తో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 11వ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 4,935 (75,675), కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 4,387 (70,565), బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 3,473(60,419) ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీజేపీ అభ్యర్థి 5,110 లీడింగ్లో కొనసాగుతున్నారు.

లోడుపల్లికి చెందిన గుర్లే లలిత పంట చేనులో <<15652867>>హత్య విషయం<<>> తెలిసిందే. CI శ్రీనివాసరావు, SI కొమురయ్య కథనం ప్రకారం.. భర్త గణేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను విచారించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన భార్య ఇతరులతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం రాత్రి ఆమెతో గొడవపడ్డాడు. పథకం ప్రకారం మామిడి తోటలోకి ఆమెను తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులకు ఎదుట అంగీకరించాడు.

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.

ఇద్దరు మహిళా దొంగలను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన మైనా, జ్యోతి, వీరి భర్త తేజ్ షిండే మహారాష్ట్ర నుంచి రైలులో ఆదిలాబాద్ వచ్చి చోరీలు చేస్తూ తిరిగి వెళ్లిపోతున్నారు. మంగళవారం బస్టాండ్లో అనుమానస్పదంగా తిరుగుతుండగా ఆ ఇద్దరు మహిళలను SIవిష్ణుప్రకాశ్ అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. పరారీలో ఉన్న తేజ్ షిండే కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇంటర్ పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వెలుపల ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది బందోబస్తులో ఉంటారని తెలియజేశారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. అదేవిధంగా పరీక్ష కేంద్రాలలోనికి సెల్ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదన్నారు.

కరెంట్ షాక్తో ఓ రైతు దుర్మరణం చెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పార్డి (కే) గ్రామానికి చెందిన ఉగ్గే హన్మంతు (50) తన చేనులో జొన్న పంటకు నీటిని పెట్టేందుకు మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో చేను వద్దకు వెళ్లి మోటర్ ఆన్ చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో మృతిని ఇంట్లో విషాదం నెలకొంది.

నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 31 పరీక్షా కేంద్రాల్లో 18,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు.

ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్-కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.10 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.