Adilabad

News December 17, 2024

ASF: పోలీస్ లాంచనాలతో తిరుపతయ్య అంత్యక్రియలు

image

హెడ్ కానిస్టేబుల్ తిరుపతయ్య అంత్యక్రియలు పోలీస్ లాంచనాలతో ఆయన స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా జమ్మికుంటలో నిర్వహించారు. జిల్లాలోని CCSలో విధులు నిర్వహిస్తున్న తిరుపతయ్య గుండెపోటుతో నిన్న మరణించిన విషయం తెలిసిందే. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షోక్ శక్స్త్ పరేడ్ నిర్వహించి పోలీస్ లాంచనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

News December 17, 2024

కవ్వాల్‌లో అరుదైన పక్షులు

image

జన్నారం మండలంలోని కవ్వాల్ అటవీ ప్రాంతంలో ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల బర్డ్, బటర్ ఫ్లై వాక్ నిర్వహించారు. కాగా అడవిలో పలు అరుదైన పక్షులు పర్యటకులకు కనువిందు చేశారు. రెడ్ రీసెల్డ్ ల్యాప్ విగ్, వైట్ ఐ బెజార్డ్, ఫైడ్ కింగ్ ఫిషర్, వైట్ త్రోటెడ్ కింగ్ ఫిషర్ వంటి పక్షులు కనిపించాయి. కవ్వాల్ పర్యాటకులను ఆకర్షిస్తోందని అధికారులు తెలిపారు. 

News December 17, 2024

మంచిర్యాల: అవినీతికి పాల్పడిన HMకి జైలు శిక్ష

image

అవినీతికి పాల్పడిన HMకి జైలు శిక్ష, జరిమానాను బెల్లంపల్లి JFCM మెజిస్ట్రేట్ ముఖేష్ విధించారు. దేవాపూర్ SHO ఆంజనేయులు వివరాల ప్రకారం.. కాసిపేట మండలం రేగులగూడ ఆశ్రమ పాఠశాల HM రొడ్డ గోపాల్ 46మంది విద్యార్థులకు బదులు 136మంది హాజరు ఉన్నట్లు తప్పుగా రాసి ప్రభుత్వ డబ్బులను కాజేశారని 2013లో కేసు నమోదైంది. కోర్టులో సాక్షులను విచారించగా నేరం రుజువు కావడంతో మెజిస్ట్రేట్ నిందితుడికి పైవిధంగా శిక్ష విధించారు.

News December 17, 2024

సిరికొండ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రైతు బిడ్డ

image

సిరికొండ మండల కేంద్రానికి చెందిన కస్బె రామారావు కుమారుడు కస్బె సాయికుమార్ ఇటీవల విడుదలైన సీఆర్పీఎఫ్ ఫలితాల్లో ఉద్యోగం సాధించాడు. తల్లి తండ్రులు వృత్తి రీత్యా వ్యవసాయం చేస్తారు. సిరికొండ మండల కేంద్రంలోనే ఎస్సీ సామాజిక వర్గంలో మొట్ట మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అరుదైన ఘనత రామారావు తెలిపారు. ఈ సందర్భంగా కస్బె సాయికుమార్ ను స్నేహితులు, కుటుంబీకులు, గ్రామస్తులు అభినందించారు.

News December 17, 2024

నిర్మల్ జిల్లా వాసులకు కలం స్నేహం అవార్డులు

image

కలం స్నేహం ఆధ్వర్యంలో చేపట్టిన బెస్ట్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డులు నిర్మల్ జిల్లా వాసులను వరించింది. హైదరాబాదులోని కూకట్పల్లి జరిగిన కార్యక్రమంలో స్వర స్నేహం బెస్ట్ ఆఫ్ ది ఇయర్ గా నాగరాజు, శ్రీకాంత్, గంగాధర్, రాధికలు అవార్డులు పొందారు. నాట్య స్నేహంలో శ్రీ బెస్ట్ ఆఫ్ ది ఇయర్ గా చిన్నారి ప్రణవలకు అవార్డు లభించింది. వారితోపాటు జిల్లా అధ్యక్షురాలు దేవి ప్రియ కూడా ఉన్నారు.

News December 16, 2024

‘ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 ఇవ్వాలి’

image

ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 ఇవ్వాలని సీఐటీయూ మంచిర్యాల జిల్లా కార్యదర్శి, దుంపల రంజిత్ కుమార్ అన్నారు. డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా కార్యకర్తల బస్సు యాత్ర సోమవారం మధ్యాహ్నానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఆశలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని, ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలతో పాటు ఈఎస్ఐ పీఎఫ్ ఇవ్వాలన్నారు.

News December 16, 2024

తాండూర్: రైలు కిందపడి యువకుడి సూసైడ్

image

రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాండూర్ మండలం రేచినిలో సోమవారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. మేడి సాయి కుమార్(22) తల్లిదండ్రులు కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. దీంతో తనకు ఎవరు లేరని మనోవేదనకు గురై సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

News December 15, 2024

MNCL: గ్రూప్- 2 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన సీపీ

image

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్- 2 పరీక్షల నేపథ్యంలో మంచిర్యాలలోని పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపుపై పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

News December 15, 2024

ADB: గ్రూప్-2అభ్యర్థులకు కీలక సూచన

image

ఉమ్మడి జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదిలాబాద్‌లో 63 కేంద్రాల్లో 10,428, ఆసిఫాబాద్‌లో 18 కేంద్రాల్లో 4,389, నిర్మల్‌లో 24 కేంద్రాల్లో 8,080, మంచిర్యాలలో 48 కేంద్రాల్లో14,951 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిమిషం నిబంధన అమలులో ఉంది. అభ్యర్థులు సమయానికి కేంద్రాల వద్దకు చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తారని అధికారులు స్పష్టం చేశారు.

News December 15, 2024

ఇచ్చోడ : రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

image

ఇచ్చోడ రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు రుణమాఫీ, రైతుకు గిట్టుబాటు ధర, సన్నవడ్లకు బోనస్, ప్రతి గింజ ప్రభుత్వమే కొనే విధంగా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు.

error: Content is protected !!