India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆదిలాబాద్కు చెందిన ముస్కాన్ రిజ్వాన్ దంపతులకు రెండు నెలల క్రితం 560 గ్రాములతో పాప జన్మించింది. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో.. నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆసుపత్రి వైద్యులు పాపకు రెండు నెలల పాటు చికిత్సలు నిర్వహించి, బరువు కిలో 465 గ్రాముల వరకు పెరిగేలా చేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉండడంతో బేబీని డిశ్చార్జ్ చేశారు.
ఆదిలాబాద్ RTC బస్ స్టాండ్ నుంచి గురువారం బేల వెళ్ళటానికి సయ్యద్ అనే వ్యక్తి బస్సు ఎక్కుతుండగా ఒక మహిళ ఆయన పర్సును దొంగిలించింది. ఈ క్రమంలో ఆమె పారిపోతుండగా అక్కడున్న టూటౌన్ పోలీసులు ఆమెను పట్టుకొని పర్సును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం టౌన్లో కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు CI అశోక్ తెలిపారు. SI లాల్ సింగ్ నాయక్, సిబ్బంది గంగకుమారి, రజిత, నరేష్, రమేష్, క్రాంతి, నరేందర్ ఉన్నారు.
మనస్తాపంతో ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కథనం మేరకు మాటేగాంకి లక్ష్మణ్(3౦) కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 22న ఓ ఫ్లాట్ విషయంలో భార్యతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మనస్తాపం చెందిన లక్ష్మణ్ గురువారం మాటేగాం గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నెన్నెల మండలం గుడిపేటకు చెందిన మాలోతు తిరుపతి (28) ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో PHD పట్టా పొందారు. దీంతో బుధవారం ధర్డ్ వేవ్స్ సిస్టమ్ రీసెర్చ్ మేనేజర్గా ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగం లభించింది. తిరుపతి తల్లిదండ్రులు రాంచందర్, శకుంతల నిరక్షరాస్యులు. వ్యవసాయం చేస్తూ వారి ఇద్దరు కుమారులను చదివించారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను బలోపేతం చేయటంతో పాటు అభివృద్ధి చేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని జంబుగాలో ఉన్న ఐటీడీఏ ఉద్యాన నర్సరీ, శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. నర్సరీ ద్వారా మెరుగైన ఆదాయం పొందటంతో పాటు, దినసరి కూలీలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఓ సూచించారు.
జిల్లాలోని తలమడుగు మండలం కోసాయి వద్ద గాలివాన కారణంగా చెట్లు రైలు పట్టాలపై పడిపోయాయి. దీంతో రాత్రి 7 గంటల వరకు ఆదిలాబాద్కు చేరుకోవాల్సిన ఇంటర్సిటీ రైలును మహారాష్ట్రలోని కిన్వట్ వద్ద నిలిపివేశారు. ఇదే రైలు ఆదిలాబాద్కు వచ్చి కృష్ణ ఎక్స్ప్రెస్గా 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రైలు పట్టాలపై చెట్లు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు రైల్వేస్టేషన్లో పడిగాపులు కాస్తున్నారు.
సైబర్ క్రైం నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. సైబర్ క్రైంకు గురికాకుండా ఉండటానికి సూచనలతో ముద్రించిన గోడప్రతులను పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన కల్పించటానికి గోడప్రతులను ప్రధాన కూడళ్లలో ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వివరించాలన్నారు.
ఆదిలాబాద్ వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారిని అరికట్టడంలో భాగంగా వ్యవసాయశాఖ, టాస్క్ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులను వారంలోగా పరిశీలించి పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండ తీవ్రత తగ్గడంలేదు. దీంతో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా అర్లి(టి)లో అత్యధికంగా 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. కొండాపూర్(మంచిర్యాల) 43.4, ఆసిఫాబాద్ 43.2, చాప్రాల(ఆదిలాబాద్) 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.