India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కూతురును ఆడించేందుకు కట్టిన ఊయల తల్లి మెడకు చుట్టుకొని మహిళ మృతి చెందిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 1టౌన్ SHO దేవయ్య వివరాల ప్రకారం.. బెల్లంపల్లిబస్తికి చెందిన నీరజ(42) తన కూతురు కోసం ఇంట్లో చీరతో ఊయల కట్టింది. గురువారం కూతురును ఒళ్లో కూర్చోపెట్టుకొని ఇద్దరు ఊయల ఊగుతూ ఆడించింది. కూతురును దించి కుమారుడికి ఊయల ఊగడం చూపిస్తుండగా ప్రమాదవశాత్తు చీర చుట్టుకుని ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ విద్యే లక్ష్యంగా బాసర ఐఐఐటీని తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆర్జీయూకేటీ బాసరను మంత్రి సందర్శించారు. క్యాంపస్కు చేరుకున్న మంత్రికి జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైస్ ఛాన్స్లర్, విద్యార్థులు పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.
ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించబోయే గ్రూప్-2 పరీక్షలకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రూప్-2 పరీక్షల్లో భద్రత ఏర్పాట్లపై పోలీసులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 18 పరీక్ష కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్- 163 సెక్షన్ విధించడంతో పాటు పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు బంద్ పాటించాలన్నారు.
ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం జిల్లా SP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. SP మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ సెంటర్లు, చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసివేయాలన్నారు. పరీక్ష సెంటర్స్ వద్ద నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దన్నారు.
డిసెంబర్ 14న నిర్మల్ జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, మాడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలో 40 శాతం డైట్ ఛార్జీల పెంపు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్మల్లో ఘనంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. డైట్ ఛార్జీల పెంపు ప్రారంభోత్సవ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని అన్నారు. ఉదయం 11 నుంచి మ.2 గంటల వరకు ఈ కార్యక్రమం జరగాలని అధికారులకు సూచించారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,960గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో మంచిర్యాలలో ఉమ్మడి జిల్లా అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. కోచ్ ప్రదీప్ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జట్టును ప్రకటించారు. మంచిర్యాల నుంచి లక్ష్మణ్ సాయి, అర్జున్ రిషికేశ్ చందర్, జహీర్, సాత్విక్ ఎంపికయ్యారు. ఈనెల 16న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వారిని పలువురు అభినందించారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సంబంధిత అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను ఈ నెల డిసెంబర్ చివరి నాటికి ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగ చేయలన్నారు.
ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం పేర్కొన్నారు. ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా కోర్టులలో ఏళ్ల పాటుగా పరిష్కరించబడని కేసులు రాజీ పడటంతో తక్షణం పరిష్కరించబడి సమయం, డబ్బులు, వృధా కాకుండా ఉంటాయన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయాన్ని పొంది ఉపశమనం పొందవచ్చు అని అన్నారు.
Sorry, no posts matched your criteria.