India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ASF జిల్లాకు చెందిన ఏడుగురిపై ACB కేసులు నమోదు చేసింది. జిల్లాలో ఫోర్ వే విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి అందించే పరిహారం చెల్లింపుల్లో రూ.కోట్లల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు RDO దత్తు, డిప్యూటీ తహశీల్దార్ నాగోరావు, మండల సర్వేయర్ భరత్, స్తిరాస్థి వ్యాపారస్తులైన శంభుదాస్, లక్ష్మీనారాయణ గౌడ్, తిరుపతితో పాటు పరిహారం పొంది తారాబాయిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
20 కోట్ల ఏళ్ల నాటి అరుదైన వృక్ష శిలాజాన్ని రవీంద్రభారతిలో పొందుపరిచారు. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీన్ని కనుగొన్నారు. జురాసిక్, క్రిటిసియస్ కాలానికి చెందిన ఈ శిలాజం నాటి జీవ పరిణామ క్రమంలోని అనేక అంశాలకు సాక్ష్యాలుగా నిలుస్తుందని తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి ఇరువైపులా ఈ శిలాజాలను ఏర్పాటు చేశారు.
TS స్థానంలో TGగా మార్చాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టీజీతో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని సూచించారు.
కేవలం సన్నం వడ్లకే రూ. 500 బోనస్ ఇస్తామనడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వంపై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎక్కువగా పండేది దొడ్డుబియ్యమేనని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మాత్రమే సన్నబియ్యం పండిస్తారన్న ఆయన 30 జిల్లాలోని రైతులు దొడ్డు బియ్యం పండిస్తారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు చావుకబురు చల్లగా చెబుతున్నారని సెటైర్ వేశారు.
ఉట్నూర్ మండలంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. తన వినూత్న ఆలోచనలతో పేద, బడుగు బలహీన వర్గాలను ఆదుకునేలా అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయనను కొనియాడారు.
మంచిర్యాల జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కింద పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రతి ఏడాది వందల సంఖ్యలో నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 377 మంది రైలు పట్టాలపై ప్రాణాలు తీసుకున్నారు. కాగజ్నగర్, తాండూద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కాగజ్నగర్లోని గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో వారు గొడవ పడ్డారు. దీంతో నలుగురు యువకులు చంద్రశేఖర్(28)ను తలపై రాయితో కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఈజ్గాం SI రామన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మేరకు జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మద్దతు ధరతో చేపడుతున్న జొన్నల కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు మార్క్ఫెడ్ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు కొనుగోళ్లు నిలివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 26 నుంచి కొనుగోళ్లు చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని సూచించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 8,45,213 మంది ఉన్నారు. ఇందులో పార్లమెంట్ ఎన్నికల్లో 6,22,420 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి పోలింగ్ 73.64 శాతంగా నమోదైంది. అలాగే పురుష ఓటర్లు 8,04,875 మంది ఓటర్లున్నారు. వీరిలో 5,99,108 మంది ఓటు వేశారు. వీరి పోలింగ్ శాతం 74.43గా నమోదైంది. 2,05,767 మంది పురుష ఓటర్లు ఓటు వేయలేదు. మహిళలే తక్కువ ఓటేశారు.
డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడవ సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ టి. ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులు పరీక్షలు రాయగా సోమవారం ఫలితాలు విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.