India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థాన చలనం కల్పిస్తూ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ మల్టీ జోన్ 1 డిఐజి ఉత్తర్వులు జారీ చేశారు. కొంతమంది ఎస్ఐలు ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఆయా స్టేషన్లలోనే వారిని కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొన్నారు. మరి కొంతమందిని స్థానచలనం కల్పించారు. ఇదిలా ఉంటే ఏ. భీంరావు కు ఎస్సైగా పదోన్నతి కల్పించారు.
గ్రూప్ 2 పరీక్షలు వ్రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలం లో చేరుకోవాలని నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలకు అనుమతి లేదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల డిసెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్షల నిర్వహణ పై చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్లతో సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్లు తీసుకురావద్దన్నారు.
తాండూరు మండలం కాసిపేటకి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI కిరణ్ కుమార్ వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. శివప్రసాద్ అనే వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాడు. అందులో నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేక తన కుటుంబ సభ్యులు తండ్రి మొండయ్య, తల్లి శ్రీదేవి, అక్క చైతన్యతో కలిసి గడ్డి మందు తాగాడు. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ మరణించారని ఎస్సై వివరించారు.
కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటనలో చికిత్స పొందుతున్న ముగ్గురు బుధవారం ఉదయం మృతి చెందారు. తాండూరు మండలం కాసిపేటకు చెందిన మొండయ్య కుటుంబీకులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య, అతడి కుమార్తె చైతన్య(30) ఇవాళ ఉదయం మృతి చెందగా.. కొద్దిసేపటి క్రితమే అతడి భార్య శ్రీదేవి కూడా మృతి చెందింది. కుమారుడు శివప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉంది.
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాండూరు మండలం కాసిపేట గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం పురుగు మందు తాగి <<14839477>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకున్నారు. జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మొండయ్య(60), అతడి కుమార్తె చైతన్య(30) మృతి చెందారు. భార్య శ్రీదేవి(50), కుమారుడు శివ ప్రసాద్(26) పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లాలో గుర్తించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఏమైనా అభ్యంతరాలు ఉంటేలిఖితపూర్వకంగా తెలపాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల కలెక్టరేట్ కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలలో ఎన్నికల నిర్వహణకు 2, 2,730 కేంద్రాలను గుర్తించినట్లు పేర్కొన్నారు.
గ్రామ పంచాయితి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 వ తేదీ లోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రూపొందించామన్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కుటుంబసభ్యులంతా ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన తాండూరు మండలంలోని కాసిపేట గ్రామంలో జరిగింది. మొండయ్య(60), శ్రీదేవి(50) దంపతులు, వారి కుమార్తె చిట్టి(30), కుమారుడు శివప్రసాద్ (26) ఆర్థిక ఇబ్బందులు తాళలేక పురుగు మందు తాగారు. కాగా వారిని మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నిర్మల్కు చెందిన ఓ ఉద్యోగి భరత్ సోమవారం ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. కాగా చనిపోయే ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. ‘2018లో ఆరోగ్య శాఖలో RNTCP కాంట్రాక్ట్ ఉద్యోగం పొందాను. నాకంటే కింది స్థాయి వారికి ఎక్కువ జీతం రావడం.. నేను పర్మినెంట్ కాకుండా ఉంటానేమోనని మనస్తాపానికి గురై చనిపోతున్నా. నాభార్య పల్లవికి అన్యాయం చేస్తున్నా. కుమారుడు దేవాను వీడిపోతున్నా, అమ్మనాన్న సారీ’ అంటూ నోట్ రాశాడు.
Sorry, no posts matched your criteria.