Adilabad

News May 19, 2024

ADB: మరో 15 రోజులే.. మీ MP ఎవరు..?

image

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. ఎక్కడ ఎవరు MP అనేది తేలనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపోటములు, మెజారిటీలపై గ్రామగ్రామాన చర్చ నడుస్తోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారట. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

News May 19, 2024

KZR: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతునికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని సిర్పూర్ టి మార్చురీకి తరలించారు.

News May 19, 2024

మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

image

మందమర్రి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కుర్మ రాధమ్మ అల్లుడి దశదిన కర్మ కోసం శనివారం మందమర్రికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

News May 19, 2024

ఆదిలాబాద్: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2024 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 10వ/8వ తరగతులు ఉత్తీర్ణులై 14 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు జూన్ 10లోగా మొదటి దఫా ప్రవేశాల కోసం https:///iti. telangana. gov. in దరఖాస్తు  చేసుకోవాలని సూచించారు.

News May 19, 2024

మంచిర్యాల: ‘CBSE సిలబస్ ప్రవేశపెట్టాలి’

image

సింగరేణి పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ ప్రవేశపెట్టాలని BMSనాయకులు C&MDబలరాం నాయక్ కు విజ్ఞప్తి చేశారు. యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల వేతనాల నుండి కార్పోరేట్ పాఠశాలలు దోపిడీ చేస్తున్నాయన్నారు. క్రమశిక్షణ కలిగిన సెంటర్ సిలబస్ ద్వారా మంచి నైపుణ్యత సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.

News May 18, 2024

ADB: టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో..!

image

ADB:టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News May 18, 2024

ADB ఉమ్మడి జిల్లాలో ఒక్కరోజే 9 మంది మృతి

image

ఉమ్మడి ADB జిల్లాలో వివిధ కారణాలతో శుక్రవారం 9 మంది మృతిచెందారు.
ADBలో విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి. మావల, కుంటాలలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి. ఇంద్రవెల్లిలో కడుపు నొప్పి భరించలేక యువతి సూసైడ్. వాంకిడిలో ఇష్టంలేని పెళ్లి చేశారని నవవరుడు సూసైడ్. ఆసిఫాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఖానాపూర్‌లో బైక్‌తో చెట్టును ఢీకొని వ్యక్తి మృతి. కాసిపేటలో ఐచర్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.

News May 18, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్‌లో ఎవరు గెలిచిన చరిత్రే..!

image

ADB పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్రలో నిలిచిపోనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిస్తే ADB స్థానంలో MP అయినా మొదటి మహిళగా, పోటీచేసిన మొదటిసారే గెలిచిన నేతగా చరిత్ర సృష్టిస్తారు. 20 ఏళ్ల నుంచి అక్కడ ఏ పార్టీకి వరుసగా రెండోసారి గెలవలేదు. BJP అభ్యర్థి నగేశ్ గెలిస్తే ఆ రికార్డు బ్రేక్ అవుతుంది. BRS అభ్యర్థి గెలిస్తే 2 సార్లు MLAగా గెలిచి MP అయిన వ్యక్తిగా ఆత్రం సక్కు నిలుస్తారు.

News May 18, 2024

ఆసిఫాబాద్: ‘ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య’

image

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ ఘటన ASFలోని రహాపెల్లిలో జరిగింది. చునార్కర్ రవీందర్(38), కళావతి భార్యభర్తలు. కళావతి అదే గ్రామానికి చెందిన అక్కపెల్లి రవీందర్‌తో తరచూ ఫోన్ మాట్లాతుందన్న అనుమానంతో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండేది. గురువారం ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లో ఉరేసి చంపేసిందన్న అనుమానంతో రవీందర్ అన్న ఆనందరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై SI రాజేశ్వర్ కేసు నమోదు చేశారు.

News May 18, 2024

ASF: పీఎం రాష్ట్రీయ బాలపురస్కార్‌లకు దరఖాస్తుల ఆహ్వానం

image

మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ జాతీయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి ఇచ్చే పురస్కారాలకు 6-18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. పలు రంగాల్లో ప్రతిభ చూపిన బాలలు జులై 31లోపు http //awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.