Adilabad

News January 22, 2025

నిర్మల్: కాశీలో గుండెపోటుతో ఫార్మసిస్టు మృతి

image

నిర్మల్‌లోని ప్రధాన ఆస్పత్రిలో ఆయుర్వేద ఫార్మసిస్టుగా పనిచేస్తున్న ఫణిందర్ (50) గుండెపోటుతో మృతి చెందాడు. పట్టణంలోని బుధవార్ పేట్ కాలనీకి చెందిన ఫణిందర్ ఉత్తర్ ప్రదేశ్‌లోని కుంభమేళాకు వెళ్లారు. కాశీలో దైవ దర్శనం చేస్తున్న క్రమంలో గుండెపోటుతో మంగళవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. 

News January 22, 2025

నాగోబా జాతర విశేషాలు మీకు తెలుసా..!

image

తెలంగాణలోనే రెండో అతిపెద్దదైన నాగోబా జాతర జనవరి 28న ప్రారంభం కానుంది. మేస్రం వంశీయులు ఇప్పటికే గంగాజలం తీసుకొని రావడానికి జన్నారంలోని కలమడుగుకు బయలుదేరారు. అయితే వారు జలం తీసుకొచ్చే కుండులను ఓ ప్రత్యేక వంశీయులే చేస్తారని చాలా మందికి తెలియదు. ఈ కుండలను సిరికొండలోని గుగ్గిల్ల వంశీయులు తయారుచేస్తారు. మేస్రం వంశీయులు పూజకు వినియోగించే దీపంతలు, నీటికుండలు, వంట ఉపయోగించే పాత్రలను కూడా వారే అందిస్తారు.

News January 22, 2025

ADB: భారత జట్టులో ఆదిలాబాద్ ఉద్యోగి

image

దిల్లీలో నిర్వహించిన ఖోఖో అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొని ట్రోఫీ అందుకున్న టీంలో సభ్యుడిగా ఆదిలాబాద్ తపాలా ఉద్యోగి ఉన్నారు. తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆదిలాబాద్ పోస్టల్ అసిస్టెంట్ శివారెడ్డి భారత జట్టు తరఫున ఆడారు. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్ లోనే బెస్ట్ అటాకర్‌గా పేరు పొందారు. భారత ఖోఖో జట్టు విశ్వ విజేతగా నిలవడంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు తపాలా శాఖ ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

News January 22, 2025

ఏడాదిలో రూ.850 కోట్ల అభివృద్ధి: నిర్మల్ MLA

image

గడిచిన సంవత్సర కాలంలో నిర్మల్ నియోజకవర్గంలో రూ.850 కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నిర్మల్ మండలం వెంగ్వాపేట్, కౌట్ల, ముజ్గి తదితర గ్రామాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు.

News January 22, 2025

ఆదిలాబాద్: ట్యూషన్ ఫీజు చెల్లింపునకు అవకాశం

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 3వ సంవత్సరం, పీజీ 2వ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లింపునకు పొడిగించినట్లు ఆదిలాబాద్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సంగీత, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ మంగళవారం పేర్కొన్నారు. ఈనెల 25 వరకు అవకాశం ఉందన్నారు. ట్యూషన్ ఫీజు చెల్లించనివారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News January 22, 2025

అర్హుల ఎంపిక కోసమే గ్రామసభ: ADB కలెక్టర్

image

అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసమే గ్రామ సభలను ఏర్పాటు చేశామని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఉట్నూరు మండలంలోని ఉమ్రి గ్రామసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర పథకాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడానికి నూతన దరఖాస్తులు స్వీకరిస్తున్నానని తెలిపారు అర్హులైన వారు గ్రామసభలో సమర్పిస్తే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.

News January 21, 2025

కడెం: కొడుకును చూడటానికి వెళ్తుండగా ACCIDENT

image

కడెం మండలం పాండ్వాపూర్ గ్రామానికి చెందిన మల్లపల్లి భూమన్న ఈనెల 19న ఉట్నూరు మండలం సాలెవాడకు తన పని ముగించుకొని కుమారుడిని చూడడానికి వెళ్తూ బైక్ అదుపుతప్పి కింద పడ్డాడు. గమనించిన స్థానికులు నిర్మల్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడి తల్లి రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణ సాగర్ రెడ్డి పేర్కొన్నారు.

News January 21, 2025

నూతన వధువులను నాగోబాకు పరిచయం చేస్తారు

image

మెస్రం వంశస్థుల్లో నూతన వధువులను నాగోబా దేవునికి పరిచయం చేయడం ఆనవాయితీగా వస్తుంది. జాతరలో భాగంగా కుల పెద్దలు నూతన వధువులను నాగోబా దేవుని దగ్గరకు తీసుకువెళ్లి వారితో పూజ చేయించి నాగోబాకు పరిచయం చేస్తారు. దీన్నే ‘భేటింగ్ కియావాల్’ అంటారు. అక్కడి నుంచి శ్యాంపూర్‌లోని బోడుందేవ్ జాతర పూర్తయ్యాక ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోతారు.

News January 21, 2025

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే నార్నూర్ రోడ్డు ప్రమాదం: ASP

image

నార్నూర్ మండలంలో ఐచర్ బోల్తా ఘటన ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిందని ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవర్ కనక శ్రీరామ్ ఐచర్ వాహనం నడిపినట్లు పేర్కొన్నారు. డ్రైవర్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 2 మృతి చెందగా.. 35 మందికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News January 21, 2025

అభయారణ్యంలో ప్రజలను ఇబ్బందులు పెట్టొద్దు: ఖానాపూర్ MLA

image

ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియాల్‌ను సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో కలిశారు. కవ్వాల్ అభయారణ్యంలో ప్రజలను, రైతులను ఇబ్బంది పెట్టవద్దని, వాహనాలను ఆపవద్దని కోరారు. అలాగే ఆర్ఓఆర్‌లో రైతులను కూడా ఇబ్బంది పెట్టవద్దని విన్నవించారు. అటవీ ప్రాంతాల్లో రోడ్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ రాజురా సత్యం ఉన్నారు.