India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి ADB జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు, కుప్టీ, తుమ్మిడిహెట్టిలో ప్రాజెక్ట్ నిర్మాణం, కడెం ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు, సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపై మీ కామెంట్?
బాలశక్తి కార్యక్రమాన్ని నిరంతరం పకడ్బందీగా కొనసాగించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బాలశక్తి కార్యక్రమంపై సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, అన్ని రకాల పరీక్షలను నిర్వహించాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజల పాలన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. ఈనెల 7న ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్న విజయోత్సవ సంబరాల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, యువత పెద్దఎత్తున హాజరై కార్యక్రమాల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ప్రోగ్రాంకు ప్రతిఒక్కరు ఆహ్వానితులేనన్నారు.
మంచిర్యాల జిల్లాలోని పలు చోట్ల బుధవారం భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నస్పూర్, జైపూర్, చెన్నూర్ ప్రాంతాల్లో ఉదయం 7.25 గంటల సమయంలో రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. భూప్రకంపనలతో ఒక్కసారిగా ఆందోళనలు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదు.
కరీంనగర్ మండలం మొగ్దుంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల నుంచి బైకుపై ఇద్దరు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కి సమాచారమిచ్చి గాయపడిన వ్యక్తిని KNR GOVT ఆసుపత్రికి తరలించారు..
ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రామ్, టీబీ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల 100 గజాల పరిధిలో ఉన్న పొగాకు ఉత్పత్తుల దుకాణాల తొలగించాలని సూచించారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. అనంతరం టీబీ పై సమీక్షించి జిల్లా కేంద్రంలోని ఇద్దరు బాధితులకు నిత్యవసర సరుకులు అందజేశారు.
పెళ్లైన 4నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఏసీసీలోని కృష్ణ కాలనీకి చెందిన అయిండ్ల రోషిణి కడుపు నొప్పి భరించలేక సోమవారం ఉదయం తల్లిగారింటి వద్ద మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి గత ఆగస్టులో బెల్లంపల్లికి చెందిన ప్రేమ్ కుమార్తో వివాహం జరిగింది. కాగా ఈ ఘటనపై ఎస్ఐ రాములు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్ళైన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదాన్ని నింపింది. స్థానిక ఏసీసీలోని కృష్ణ కాలనీకి చెందిన అయిండ్ల రోషిణి కడుపు నొప్పి భరించలేక ఇవాళ ఉదయం తల్లిగారింటి వద్ద మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి గత ఆగస్టులో వివాహం జరిగింది. తండ్రి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఎస్సై రాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా ఐదు 108 అంబులెన్స్ లను ప్రభుత్వం కేటాయించింది. ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన అంబులెన్స్ లను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులతో కలిసి హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ఐదు అంబులెన్స్లను ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, ఇచ్చోడ, తాంసి మండలాలకు అధికారులు కేటాయించారు.
నిర్మల్ జిల్లా శ్రీ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నిర్మల్కు చెందిన చిన్నారులు ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రాలను పొందారు. ఈ సందర్భంగా చిన్నారులను పలువురు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.
Sorry, no posts matched your criteria.