India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఆదివారం సోన్లో మిరుమిట్లు గొలిపే విధంగా స్థానిక పోలీస్ స్టేషన్ స్టేషన్ను అలంకరించారు. కాగా ఈ నెల 9 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
లక్షెటిపేటలోని రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే, కలెక్టర్ రైతు పండగ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసంగించారు. కాగా ఆ ప్రసంగాన్ని వర్చువల్గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్ మండల అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు.
ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ ఎంపీడీవో రామేశ్వర్ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున నాలుగు గంటల సమయంలో అదిలాబాదులోని నివాసంలో ఎంపీడీవో రామేశ్వర్కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలో జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ లింగాపూర్ మండలానికి ఎంపీడీవోగా సేవ చేసిన రామేశ్వర్ మృతి పట్ల మండల వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కాగజ్నగర్ డివిజన్లో అడవి జంతువుల దాడిలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 NOV 18న పెద్దపులి దాడిలో దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్ మృతి చెందాడు. అదే నెల 29న కొండపల్లిలో నిర్మల అనే మహిళపై పులి దాడి చేసి చంపేసింది. 2024 ఏప్రిల్లో ఏనుగు దాడిలో మరో ఇద్దరు మృతి చెందారు. కాగా నిన్న గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మిపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. నాలుగేళ్లలో ఐదుగురి మృతి కలవరపెడుతోంది.
ఒంటరి మహిళపై మారణాయుధాలతో దాడి చేసిన కేసులో 14మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి యువరాజు తీర్పు వెల్లడించినట్లు జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. 2021లో కౌటాల మండలం ముత్యంపేటకు చెందిన నాగమణిపై ఖాళీ స్థలం విషయంలో మారణాయుధాలతో దాడి చేసిన 14మంది నిందితులను కోర్టులో హాజరుపర్చగా విచారణ అనంతరం జడ్జీ వారికి శిక్ష విధించారు.
రైతులు తమ పండించిన పత్తిని అమ్ముకునే సమయంలో దళారుల మాటలను నమ్మి మోసపోకూడదని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టర్ చాంబర్లో అదనపు కలెక్టర్ శ్యామల దేవితో కలిసి శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. పత్తి పంటకు కనీస మద్దతు ధర రూ.7,521 చెల్లిస్తున్నామని, నాణ్యత ప్రమాణాలు పాటించి 8 శాతం నుంచి 12 శాతం వరకు తేమ తగ్గకుండా పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు.
కాగజ్నగర్ మండలంలోని గన్నారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మి ఇవాళ ఉదయం పులి దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. లక్ష్మి అదే గ్రామానికి చెందిన వాసుదేవ్ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కాగా పెళ్లయిన ఏడాదిలోపే పులి దాడిలో ఆమె మృతి చెందడంతో ఆమె కుటుంబీకుల రోదన అందరిని కంటతడి పెట్టించింది.
బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఓ గ్రామానికి చెందిన బాలిక(16) యువకుడు ప్రేమించుకున్నారు. ఈక్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. కాగా, ఈ విషయం బయటికి రావడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని ఆరెస్ట్ చేశారు.
గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన జన్నారం మండలంలోని రోటిగూడెంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన దిగుట్ల నాగరాజు-అనూష దంపతుల కుమార్తె దిగుట్ల సమన్వితకు గురువారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. చిన్న వయసులో సమన్విత గుండెపోటుతో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి చెందిన సంఘటన జన్నారం మండలంలోని రోటిగూడెం గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన దిగుట్ల నాగరాజు-అనూష దంపతుల కుమార్తె దిగుట్ల సమన్వితకు గురువారం హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. చిన్న వయసులో సమన్విత గుండెపోటుతో మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.
Sorry, no posts matched your criteria.