Adilabad

News May 17, 2024

ADB: సీఎం కలిసిన సోషల్ మీడియా కో ఆర్డీనేటర్స్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బెల్లంపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్‌కి చెందిన సోషల్ మీడియా కోఆర్డీనేటర్‌లు హైదరాబాద్‌లో గురువారం సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున వారు చేసిన కృషిని ఆయన అభినందించారు.

News May 16, 2024

ఆదిలాబాద్: భార్యను వేదించిన భర్తకు జైలు శిక్ష

image

భార్యను వేధించిన కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్ష, రూ 2500 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు తీర్పునిచ్చారు. జైనథ్ మండలంలోని నీరాల గ్రామానికి చెందిన మహిళ తన భర్త దీక్షిత్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. నేడు పీసీఆర్ కోర్టులో పోలీసులు అతడిని హాజరుపర్చగా విచారణ అనంతరం అతడికి కోర్టు శిక్ష విధించినట్లు లైజన్ అధికారి గంగా సింగ్ తెలిపారు.

News May 16, 2024

మంచిర్యాల: 2,21,397 మంది ఓటేయ్యలేదు

image

ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు మంచిర్యాల జిల్లా అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది ఓటు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారు. 3 నియోజకవర్గాల్లో 6,49,030 మంది ఓటర్లు నమోదై ఉండగా ఏకంగా 2,21,397 మంది ఓటర్లు ఓటు వేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 1,54,882 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేదు.

News May 16, 2024

ఆదిలాబాద్: సింగరేణి ఉద్యోగాలకు అప్లికేషన్స్ స్వీకరణ

image

సింగరేణిలో 327 పోస్టులను భర్తీ చేసేందుకు యాజమాన్యం మార్చి 14న నోటిఫికేషన్‌ను జారీచేసింది. వీటికి సంబంధించి దరఖాస్తు గడువును జూన్‌ 4వ తేదీ వరకు పొడిగించింది. ముందుగా మే 4వ తేదీ వరకే ఆఖరి గడువుగా నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేశారు. పోలింగ్‌ ముగియడంతో దరఖాస్తు గడువును పెంచినట్లు యాజమాన్యం పేర్కొంది.

News May 16, 2024

ఆదిలాబాద్: గెలుపుపై ఎవరి ధీమా వారిదే..!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలైన CONG, BJP, BRS నాయకులు ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే జిల్లాలో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరిగా సాగింది. దీంతో ఏ పార్టీకి జిల్లాలో మెజార్టీ ఎంత వస్తుందో అనే దానిపై ఖచ్చితంగా ఒక అంచనాకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. కాగా అభ్యర్థుల గెలుపు ఓటములపై జోరుగా చర్చ సాగుతోంది.

News May 16, 2024

REWIND-2019: పెద్దపల్లిలో BRSకి 95,180 ఓట్ల మెజార్టీ!

image

పెద్దపల్లిలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. చంద్రశేఖర్(కాంగ్రెస్)పై వెంకటేశ్ నేతగాని(BRS) 95,180 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. S.కుమార్ (BJP) 3వ స్థానంలో నిలిచారు. అయితే 2024లో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (BJP), కొప్పుల ఈశ్వర్ (BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?

News May 16, 2024

మంచిర్యాల: రోజుకు రూ. 2 కోట్ల మద్యం విక్రయం

image

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మందుబాబులు ఈ వేసవిలో ఎక్కువగా తాగేస్తున్నారు. నిత్యం రూ. 2 కోట్లకు పైగా వెచ్చిస్తున్నారు. జిల్లాలో 73 మద్యం దుకాణాలు, 16 బార్లు ఉన్నాయి. ప్రతిరోజు సగటున రూ. 2 కోట్లకుపైగా జిల్లాలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. ఈ ఏడాది కేవలం ఫిబ్రవరి మార్చి, ఏప్రిల్, మే 15 వరకు రూ. 208.77 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అంటే సుమారు నెలకు రూ. 60కోట్ల మద్యం విక్రయాలు జరగుతున్నాయి.

News May 16, 2024

కన్నెపల్లి: ఆత్మహత్యకు కారకులైన వారికి జైలు శిక్ష

image

వ్యక్తి ఆత్మహత్యకు కారకులైన ఇద్దరు నింధితులకు MNCL జిల్లా జడ్జి జైలు శిక్ష విధించినట్లు SI గంగారాం తెలిపారు. కన్నెపల్లికి చెందిన వెంకన్న 2019లో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారకులైన లక్ష్మికి 5 ఏళ్లు, రాజుకు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10వేల చొప్పున జరిమానా విధించారు. వెంకన్న భార్య లక్ష్మి.. రాజుతో అక్రమ సంబంధం పెట్టుకొని అతడితో వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చేందిన వెంకన్న సూసైడ్ చేసుకున్నాడు.

News May 16, 2024

ASF: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు 

image

ఆసిఫాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్ష రాసే విద్యార్థులకు రూ.1000 అపరాధ రుసుముతో 16వ తారీకు వరకు గడువు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శంకర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు.

News May 15, 2024

హాజీపూర్: హత్యకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

image

హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి మల్యాల నరేశ్‌ను హత్య చేసిన చైతన్యను అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మృతుడు నరేశ్, నిందితుడు చైతన్య చెల్లెలిని లైంగికంగా వేధిస్తుండటంతో కక్ష పెంచుకొని బండరాయితో తలపై కొట్టి హత్య చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.