Adilabad

News January 20, 2025

నిర్మల్ కవులకు జాతీయ పురస్కారాలు

image

నిర్మల్ జిల్లాకు చెందిన కవులు జాతీయ పురస్కారాలను ఆదివారం అందుకున్నారు. కరీంనగర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా గౌతమేశ్వర సాహితి కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానంలో అంబటి నారాయణ సాహితీ రత్న, నేరెళ్ల హనుమంతుకు సాహితి కిరణం పురస్కారాలను అందుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు నిరంతరాయంగా కవిత్వాలను రాయడంతో అవార్డుకు ఎంపిక చేశామని వ్యవస్థాపకులు గౌతమేశ్వర తెలిపారు.

News January 20, 2025

నిర్మల్: పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

image

అంబేడ్కర్ యూనివర్సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్, కో ఆర్డినేటర్ గంగాధర్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. డిగ్రీ సెకండ్, థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీజు గడువు జనవరి 25 వరకు చెల్లించవచ్చన్నారు. డిగ్రీ 1,3,5 సెమిస్టర్ ఫీజు గడువు జనవరి 30 వరకు పొడిగించినట్లు చెప్పారు..

News January 20, 2025

రేషన్‌కార్డుల జారీ నిరంతర ప్రక్రియ:  ADB కలెక్టర్

image

రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామ సభలపై ఆదివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ రాజర్షిషా గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల మాదిరిగానే 21 నుంచి చేపట్టే గ్రామ సభలను నిర్వహించాలని అన్నారు.  రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అన్నారు.

News January 19, 2025

బాలుడిని రేప్ చేసి చంపేశాడు : నిర్మల్ ASP

image

నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామంలో ఇటీవల జరిగిన <<15184983>>బాలుడి హత్య<<>> కేసును పోలీసులు ఛేధించారు. ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన తోకల రాజేశ్వర్‌కు హోమో సెక్స్ అలవాటు ఉంది. కామవాంఛ తీర్చుకోవడం కోసం శుక్రవారం అర్ధరాత్రి బాలుడిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా తెలుస్తుందేమోనని భయపడి మత్తులో బాలుడిని హత్య చేశాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News January 19, 2025

నిర్మల్: ఎడ్ల బండిని ఢీకొట్టిన బైక్.. బాలుడి మృతి

image

నిర్మల్ జిల్లాలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టడంతో కొడుకు మృతిచెందగా తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. పెంబి మండలం సెట్‌పల్లి గ్రామానికి చెందిన పవర్ రాజు తన కొడుకు అఖిల్‌తో కలిసి బైక్‌పై రాత్రి పెంబి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో ఎడ్ల బండిని బైక్ ఢీకొట్టింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా.. రాజు, అఖిల్ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా అఖిల్ మృతి చెందాడు.

News January 19, 2025

నిర్మల్: దైవ దర్శనానికి వెళ్తుండగా యాక్సిడెంట్

image

నిర్మల్ జిల్లాలో<<15191861>> రోడ్డు ప్రమాదం<<>> రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. MHలోని జబల్పూర్‌కు చెందిన సమిత(53), విజయ్(57), నితిన్, అనిత, సుదీర్ శ్రీశైలం దర్శనానికి కారులో వెళ్తున్నారు. మామడ మండలం బూర్గుపల్లి సమీపంలో హైవేపై అడ్డొచ్చిన కోతులను తప్పించబోయి కారు బోల్తా పడింది. ఈ ఘటనలో సమిత, విజయ్ స్పాట్‌లోనే చనిపోగా మిగతా ముగ్గురు గాయపడ్డారు. దర్శనానికి వెళ్తుండగా 2 కుటుంబాల్లో ఒక్కొక్కరు చనిపోవడం విషాదకరం.

News January 19, 2025

ADB: విద్యుదాఘాతంతో బాలికకు తీవ్ర గాయాలు

image

విద్యుదాఘాతంతో బాలిక తీవ్ర గాయాలపాలైన ఘటన శనివారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన షేక్ తహ్రీం ఇంటి స్లాబ్ పై వెళ్లగా పైనుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో షాక్ కొట్టింది. దీంతో ఆమె చేయి, కాలుతో పాటు శరీరం ఒక పక్క దాదాపు 40 శాతం కాలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు స్ధానిక రిమ్స్‌కు తరలించారు. అనంతరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News January 18, 2025

‘రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాలి’

image

 రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్యాంసుందర్ రావు, ప్రధాన కార్యదర్శి రమేష్ సూచించారు. కరీంనగర్ జిల్లాలో రేపటి నుంచి జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే ఉమ్మడి జిల్లా జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ జట్టుకు శనివారం  క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. 

News January 18, 2025

ఈ యాప్‌తో నిరుద్యోగులకు ఎంతో మేలు: కలెక్టర్

image

నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పనకై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్‌లో కళాశాలల విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునే విధంగా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అధికారులు ఈ యాప్ పై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. డైట్ యాప్‌లో తమ విద్యార్హతలతో పేరును నమోదు చేసుకోవడం ద్వారా వివిధ ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమలు వారికి అవసరమయ్యే ఉద్యోగులను నియమించుకుంటుందని చెప్పారు.

News January 18, 2025

నిర్మల్ జిల్లాలో 12 ఏళ్ల బాలుడి దారుణహత్య

image

నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. చిట్యాలలో 12 ఏళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి (12) కల్లు బట్టిలో పనిచేస్తున్నాడు. కాగా గ్రామ శివారులోని చింతలచెరువు సమీపంలో రిషి మర్మంగాలపై బండరాయితో దాడి చేసి హత్య చేశారు. ఇవాళ బహిర్భూమికి వెళ్లిన గ్రామస్థులు రిషి మృతదేహన్ని గుర్తించి నిర్మల్ పోలీసులకు సమాచారం అందించారు.