India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జనకాపూర్ జెడ్పి ఉన్నత పాఠశాలను ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన వంటకాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనాన్ని తయారు చేశారా? అని వంటవారిని అడిగి తెలుసుకున్నారు. నిత్యం మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టాలని ఆదేశించారు. మెనూ ప్రకారం, నాణ్యమైన భోజనం వడ్డించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజా ప్రభుత్వంపై రాళ్లు రువ్వించాలని సైకో రామ్ గ్యాంగ్ కుట్రలు చేస్తోందని TPCC మీడియా& కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. దిలావర్పూర్లో అప్పటి దగాకోరు BRS ప్రభుత్వమే ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతించిందని, ప్రజలు వద్దని తెలపడంతో తమ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. దీంతో అక్కడి ప్రజలు CM రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసి, హర్షం వ్యక్తం చేస్తూ BRSకు సమాధానం ఇచ్చారన్నారు.
మహదేవ్పూర్ మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు చెన్నూర్కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిని <<14728225>>హత్య<<>> చేసిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ వరి కోత పనుల నిమిత్తం చండ్రుపల్లికి 3 రోజుల కిందట వచ్చాడు. బుధవారం సాయంత్రం హార్వెస్టర్ డ్రైవర్ ప్రదీప్ను తన కారులో దింపేందుకు శ్రీకాంత్ కూర్చోగా.. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి బయటకు లాగారు. ‘మీకు దండం పెడతాను.. నన్నేమీ చేయకండి’ అని బతిమాలినా హత్య చేసి పరారయ్యారు.
జిల్లా స్థాయి ఆహార భద్రతా కమిటీతో ఆదిలాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ రాజర్షిషా సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాల, కళాశాల, హాస్టల్, రెసిడెన్షియల్, ఆసుపత్రిని సందర్శించాలన్నారు. ప్రతి వారం తప్పకుండా తనిఖీ నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వివిధ శాఖల అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఇథనాల్ పరిశ్రమ తరలింపుపై పలుమార్లు ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమస్యపై గుండంపల్లి రైతులందరితో చర్చించి న్యాయపోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. దిలావర్పూర్ ప్రజలకు అండగా నిలబడతానని, ఫ్యాక్టరీ నిర్మాణం ఆగిపోయేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పోలీస్ అధికారులు రైతులపై ఎలాంటి కేసులు పెట్టవద్దని కోరారు.
వాంకిడి మండలం మహారాష్ట్ర సరిహద్దులో పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం సాయంత్రం ఏకో వంతెన వద్ద పులి సంచరిస్తుండగా వాహనదారులు వీడియోలు తీశారు. రెండు రోజుల క్రితం పశువుల మందపై దాడి చేసి నాలుగు పశువులను గాయపరిచిన పులి మహారాష్ట్ర వెళ్ళిపోయిందని అధికారులు భావించారు. కానీ వాంకిడి- మహారాష్ట్ర సరిహద్దులో తిరుగుతూ సరిహద్దు గ్రామాల ప్రజలను కలవరపెడుతోంది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ డ్రగ్ స్టోర్ ను వైద్య ఆరోగ్యశాఖ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారి మంజునాథ్ మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంలో డ్రగ్ స్టోర్ లో మందుల నిల్వలపై తో పాటు రిజిస్టర్లు పరిశీలించారు. మందుల కొరత నివారించడానికి జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిఎంహెచ్ఓ డాక్టర్. నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, తదితరులు ఉన్నారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు ఇవే.
కాగజ్నగర్: భర్తను హత్యా చేసిన భార్య
వాంకిడి: రేపటి విద్యాసంస్థల బందుకు మద్దతు
మంచిర్యాల: పట్టుబడిన గంజాయి దహనం
కుబీర్: భార్యను హత్యా చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు
ADB: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
ADB: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
వాంకిడి: శైలజ మృతిపై ధర్నా, రాస్తారోకోలు
తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి యాది చేసుకుంటూ జిల్లా కేంద్రంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని BRS అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అనుబంధ సంఘాలతో జిల్లా స్థాయి సన్నాక సమావేశం నిర్వహించారు. 29న దీక్ష దివస్ కార్యక్రమ విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు.
బెల్లంపల్లి ఏరియా గోలేటి GM కార్యాలయం ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. GM శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత విలువలు గల ప్రజా జీవన విధానం ప్రజాస్వామ్య దేశంగా మంచి పేరు రావడానికి కారణం మన రాజ్యాంగమే అన్నారు. ప్రతి వ్యక్తి దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. గొప్ప రాజ్యాంగాన్ని కలిగి ఉన్న దేశ పౌరులుగా గర్వపడాలన్నారు.
Sorry, no posts matched your criteria.