Adilabad

News May 14, 2024

ADB: MP ELECTIONS.. అప్పుడు 40 రోజులు.. ఇప్పుడు 22 రోజులు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల పని పూర్తైనప్పటికీ నాయకులు, అనుచరులకు మాత్రం ఫలితాలు రావాలంటే 22 రోజుల నిరీక్షణ తప్పదు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఒక ఎత్తయితే.. ఫలితాల కోసం నిరీక్షించడం మరో ఎత్తు కానుంది. 2019లో నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన తర్వాత 40 రోజులకు ఫలితాలు వెలువడగా.. ఇప్పుడు 22 రోజుల పాటు వేచి చూడాల్సిందే.

News May 14, 2024

ఆసిఫాబాద్: వాగు దాటి.. 3 కి.మీ నడిచి ఓటేశారు

image

కొమురంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ పరిధిలోని భీమిని మండలం తుంగళ్లపల్లి గ్రామ ఓటర్లు ఓటు వేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామంలో 303 మంది ఓటర్లు ఉన్నారు. వీరు వాగు దాటి 3 కి.మీ దూరం కాలినడకన వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులు సాలిగామ నుంచి 15 కి.మీ ప్రయాణించి ఓటు వినియోగించుకున్నారు.

News May 14, 2024

ADB: ఓటు వేసి విదేశాలకు వెళ్లిన వైద్యులు

image

ఓటుహక్కు తెలిసినవారు పోలింగ్ సమయంలో ఎక్కడున్నా తమ గ్రామానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్‌కు చెందిన వైద్యులు ప్రవీణ్ అగర్వాల్ దంపతులు యూరప్‌లో ఉంటున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ కు వచ్చిన ఆయన ఓటువేయాలని సంకల్పంతో ఈనెల 13న ఓటు వేసిన తర్వాత యూరప్ కు వెళ్లాలని నిర్ధారించుకున్నాడు. దీంతో సోమవారం ప్రవీణ్ దంపతులు ఓటువేసి యూరప్‌కు బయలుదేరారు.

News May 13, 2024

ADB: ప్రశాంతంగా పోలింగ్.. అక్కడక్కడా ఆగమాగం

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముగిసింది. ఉమ్మడి వ్యాప్తంగా అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు, వాగ్వివాదాలు తప్పితే పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. కండువాల వివాదం, పలుచోట్ల ఎన్నికల బహిష్కరణ, అధికారులతో వాగ్వివాదం, కాసేపు ఈవీఎం మొరయింపు, తదితర చిన్నపాటి సంఘటనలు జరిగాయి. ఇక పోలింగ్ ముగిశాక ఎవరికి వారే తామే గెలుస్తున్నామన్న ధీమాతో ప్రధానపార్టీల అభ్యర్థులు ఉన్నారు.

News May 13, 2024

చెన్నూర్‌లో ఓటు వేసిన వందేళ్ల వృద్దుడు

image

చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని 190 పోలింగ్ బూత్‌లో వంద సంవత్సరాల వయస్సు పైబడిన పోచం సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు వేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా తను ఓటు వేయకుండా ఉండలేదన్నారు. ప్రజలందరూ తప్పకుండా తమ ఓటును వినియోగించుకోవాలని కోరారు.

News May 13, 2024

కడెం: ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు

image

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అల్లంపల్లి, బాబా నాయక్ తండ గ్రామాస్థులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదని.. పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. గ్రామాలకు రోడ్డు ఏర్పాటు చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రెండు గ్రామాల్లో కలిపి ఒకటే ఓటు నమోదైంది.

News May 13, 2024

ADB: పోలింగ్ ప్రారంభం.. ఇవి తప్పనిసరి..!

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు వెయ్యడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే వారు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఓటరు ఐడీ, ఆధార్ కార్డు, జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఫొటోతో ఉన్న పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు, లేబర్ గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్, దివ్యాంగుల కార్డు వంటి వాటిలో ఏదైనా ఒకటి తప్పనిసరి.

News May 13, 2024

భీంపూర్: ఎన్నికల సిబ్బందికి పాము కాటు

image

భీంపూర్ మండలం అందర్ బంద్ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ప్రఫుల్ రెడ్డికి పాము కాటేసింది. టాయిలెట్‌కు వెళ్ళినపుడు పాము కాటేయడంతో వెంటనే అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. జైనథ్ మండలం ముక్తాపూర్‌లో ఉపాధ్యాయుడిగా ప్రఫుల్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.

News May 13, 2024

ADB: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో 2019లో 71.42 శాతం పోలింగ్ నమోదవగా పెద్దపల్లి ఎంపీ స్థానంలో 65.59 శాతం నమోదైంది. ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 12, 2024

ఆసిఫాబాద్: పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న పోలీస్ వాహనం బోల్తా

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెళ్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం దడ్పూర్ గ్రామం పోలింగ్ కేంద్రానికి వెళుతున్న పోలీస్ వాహనం ఈదురు గాలులకు అదుపుతప్పి బోల్తా పడింది. పలువురు పోలీస్ సిబ్బందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.