Adilabad

News January 15, 2025

నిర్మల్‌: జనవరి 22 వరకు అర్హులను ఎంపిక చేయాలి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఈనెల 22 వరకు పంచాయతీలలో గ్రామ సభలను, పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలన్నారు. ఈ నెల 26 నుంచి పథకాలను అమలు చేయాలని అధికారులకు వీసీలో ఆదేశించారు.

News January 14, 2025

BREAKING: అప్పుడే పుట్టిన శిశువును పడేసిన తల్లి

image

సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. ఏ తల్లి కన్నదో తెలియదు. భారం అనుకుందో.. బరువనుకుందో కానీ.. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి.. అప్పుడే పుట్టిన శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు శిశువును చూసి స్థానికులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 14, 2025

బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

సంక్రాంతి పండగపూట బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. కాగజ్‌నగర్‌కు చెందిన రాజేశ్ HYDలో మెకానిక్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. టూ టౌన్ SI మహేందర్ కథనం ప్రకారం.. రాజేశ్ తన భార్య, కుమారుడితో కారులో మంగళవారం కాగజ్‌నగర్ వెళ్తున్నారు. బెల్లంపల్లి గంగారంనగర్ హైవేపై లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడి భార్య రేణుక(30) అక్కడికక్కడే మరణించింది. తీవ్రగాయాలపాలైన రాజేశ్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.

News January 14, 2025

జాతరకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం

image

సారంగాపూర్ మండలం పొట్య గ్రామ పంచాయతీ పరిధిలోని బండ్రేవు తండాలో నాను మహరాజ్ జాతర ఉత్సవాలకు బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాను మహారాజ్ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, దావుజీ, ప్రకాష్,జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News January 14, 2025

భీమారం: రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక దుర్మరణం

image

ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భీమారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నాలుగేళ్ల అద్వైకరాజ్ దుర్మరణం చెందింది. మంతెన రాజ్ కుమార్ తన భార్య సురేఖ, కుమార్తె అద్వైకరాజ్, తల్లి లక్ష్మమ్మ, మేనకోడలు తేజశ్రీతో కలిసి తమిళనాడులోని ఒక చర్చికి వెళ్లి సోమవారం తిరిగి వస్తుండగా కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

News January 14, 2025

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

image

డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరం స్పెల్-II, ఓల్డ్ బ్యాచ్ 2016 అంతకుముందు బ్యాచ్‌ల వారు అలాగే రీ అడ్మిషన్ తీసుకున్న వారు సప్లిమెంటరీ ఫీజును ఈ నెల ఈనెల 14వరకు చెల్లించవచ్చన్నారు. ఇందుకు రూ. 500 అపరాధ రుసుం కట్టాలన్నారు.

News January 14, 2025

కెరమెరి అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచారం

image

కెరమెరి రేంజ్ పరిధిలోని నిశాని, ఇందాపూర్, కరంజీ వాడ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పులుల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే కెరమెరి మండలంలోని కారంజీ వాడ,నిషానీ, ఇందాపూర్ అటవీ ప్రాంతంలో సోమవారం అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాక్ కెమెరాకు చిక్కాయని కేరమేరీ రేంజ్ అధికారి మజారుద్దీన్ తెలిపారు.. దీంతో అటవీ సమీపంలోని గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

News January 14, 2025

44 నేషనల్ హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి

image

బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.

News January 14, 2025

రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్‌లో దస్తూరాబాద్ విద్యార్థి ప్రతిభ

image

కోదాడలో జరిగిన రాష్ట్ర స్థాయి ఓపెన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్-2025లో  నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ZHS విద్యార్థి కొట్టే అభిషేక్ ప్రతిభ చాటి మూడు పతకాలు గెలుచుకున్నాడు. ఇందులో 102 కేజీ కేటగిరి యూత్ విభాగంలో సిల్వర్, జూనియర్ విభాగంలో సిల్వర్, సీనియర్ విభాగంలో బ్రాంజ్ మెడల్‌లను సాధించాడు. అభిషేక్‌ను HM వామాన్ రావ్, PET నవీన్ అభినందించారు.

News January 14, 2025

ఆదిలాబాద్: పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పొడిగింపు

image

డా.బీఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. డిగ్రీ 1, 2, 3వ సంవత్సరం స్పెల్-II, ఓల్డ్ బ్యాచ్ 2016 అంతకుముందు బ్యాచ్‌ల వారు అలాగే రీ అడ్మిషన్ తీసుకున్న వారు సప్లిమెంటరీ ఫీజును ఈ నెల ఈనెల 14వరకు చెల్లించవచ్చన్నారు. ఇందుకు రూ. 500 అపరాధ రుసుం కట్టాలన్నారు.