Adilabad

News November 18, 2024

ADB: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన అనిత (42) స్థానిక తాంసి రైల్వే గేట్ వద్ద వెళ్తుండగా గుర్తు తెలియని టిప్పర్ లారీ ఆమె కాళ్ల పై నుంచి వెళ్లింది. దీంతో ఆమె ఒక కాలు నుజ్జు నుజ్జు అయి తీవ్ర గాయాల పాలయింది. గమనించిన స్థానికులు అంబులెన్స్లో ఆమెను రిమ్స్‌కు తరలించారు.

News November 18, 2024

సింగరేణి సంస్థను కాపాడుకుందాం: సీపీఎం

image

బొగ్గు గనుల వేలం పాటను రద్దు చేసి సింగరేణి సంస్థకే బొగ్గు గనులు కేటాయించాలని, సంస్థ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సింగరేణి కార్మికునిపై ఉందని సీపీఎం పిలుపునిచ్చింది. సింగరేణి సంస్థకు కేటాయించాల్సిన బొగ్గుగలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకెరవి, జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ అన్నారు.

News November 18, 2024

ఉట్నూర్, నార్నూర్ మధ్యలో రోడ్డుపై కనిపించిన పెద్దపులి

image

ఉట్నూర్‌లో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం రాత్రి ఉట్నూర్, నార్నూర్ మధ్యలో పెద్దపులి రోడ్డు దాటుతూ వాహనదారులకు కనిపించింది. ఒక్కసారిగా రోడ్డుపై పెద్దపులి రావడంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కొంతమంది దాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. అయితే ఇప్పటికే పలు మండలాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు.

News November 18, 2024

బెల్లంపల్లి: ప్రభుత్వ కొలువులు సాధించి ఆదర్శంగా నిలుస్తున్న అన్నదమ్ములు

image

చిన్నతనంలోనే తండ్రి చనిపోగా తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని చదివించింది. తల్లి కష్టానికి ప్రతిఫలంగా ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచారు. బెల్లంపల్లి మండలం చిన్న బూదలోని రవీంద్రనగర్‌కు చెందిన మిట్టపల్లి రవికుమార్, శ్రీధర్ అన్నదమ్ములు. వీరిలో రవికుమార్ ఇప్పటికే రైల్వేలో ఉద్యోగం చేస్తుండగా, శ్రీధర్ ఇటీవల గ్రూప్- 4లో మంచిర్యాల కలెక్టరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా జాబ్ సాధించాడు.

News November 18, 2024

చెన్నూరు: ‘బొగ్గు వేలం రద్దుచేసి సింగరేణికే కేటాయించాలి’

image

బొగ్గు బ్లాక్‌ల వేలం పాట రద్దు చేసి సింగరేణి సంస్థకే బ్లాక్‌లను కేటాయించాలని చెన్నూరులో CPMఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఏరియా కార్యదర్శి చందు, జిల్లా నాయకురాలు రాజేశ్వరి మాట్లాడుతూ..మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన BJPప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు పరిశ్రమను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు ఇవ్వడం కోసం బొగ్గు బ్లాక్‌ల వేలం నిర్వహిస్తోందన్నారు.

News November 17, 2024

బీర్సాయిపేట్: ‘రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి’

image

ఉట్నూరు మండలంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో బీర్సాయిపేట్, పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీర్సాయిపేట్ అటవీశాఖ అధికారులు కోరారు. ఆదివారం వారు మాట్లాడుతూ మండలంలోని పలు గ్రామాలలో పెద్దపులి సంచార సమాచారం ఉందన్నారు. బీర్సాయిపేట్, పరిసర గ్రామాలతో పాటు నార్నూర్,జైనూరు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పులికి ఏ హాని తలపెట్టవద్దని, నష్టం జరిగితే అటవీశాఖ నష్టపరిహారం ఇస్తుందన్నారు.

News November 17, 2024

మందమర్రిలో కనిపించిన పెద్దపులి

image

మందమర్రిలోని శంకరపల్లి, KK 5 గని సమీపంలో శనివారం పెద్దపులి సంచారం కలకలం రేపింది. కొద్దిరోజులుగా జన్నారం, కాసిపేట, చెన్నూర్, వేమనపల్లి ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వలస కూలీలకు శంకరపల్లి వద్ద పులి కనిపించినట్లు తెలిపారు. శంకరంపల్లి సమీపంలో గుడారాల్లో ఉంటున్న తమ వైపు పెద్ద పులి వచ్చిందన్నారు. గుడారాల్లోని వారందరూ భారీగా కేకలు వేయడంతో అది శతలాపూర్ వైపు వెళ్లినట్లు పేర్కొన్నారు.

News November 17, 2024

ఉట్నూర్: ఆవుపై దాడి చేసిన పెద్దపులి

image

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పెద్దపులి కలకల రేపుతోంది. తాజాగా శనివారం సాయంత్రం ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామ పంచాయతీలోని వంక తుమ్మ గ్రామ సమీపంలో ఓ ఆవుపై దాడి చేసింది. దీంతో ఆవు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News November 16, 2024

నార్నూరు: కొడుకును కత్తితో పొడిచిన తండ్రి

image

కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నార్నూర్ మండలంలోని గుంజల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం గుంజాల గ్రామానికి చెందిన మేస్రం భుజంగరావు కుటుంబ తగాదాల కారణంగా తన కొడుకు బాలాజీని కత్తితో పొడిచాడు. స్థానికులు గమనించి బాలాజీని ఉట్నూర్ తరలించారు. కాగా అక్కడి వైద్యులు రిమ్స్ కు రిఫర్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 16, 2024

మంచిర్యాల: భార్యాభర్తలను ఢీకొన్న అంబులెన్స్.. భర్త మృతి

image

గద్దెరాగడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కోట సాంబశివరావు తన భార్య శివపార్వతితో కలిసి శుక్రవారం బైక్ పై మంచిర్యాలకు వెళ్తుండగా అంబులెన్స్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం MNCLకు, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. మార్గ మధ్యలోనే సాంబశివరావు మృతి చెందినట్లు SI రాజశేఖర్ వెల్లడించారు. కాగా వారు ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల నుంచి 15 ఏళ్ల క్రితం మందమర్రికి వలస వచ్చారు.