Adilabad

News May 9, 2024

ఆదిలాబాద్: ఉరేసుకొని బలవన్మరణం

image

మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిలాబాద్ పట్టణం రాంనగర్‌లో రాపర్తి ప్రకాష్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏఎస్ఐ యూనుస్ తెలిపిన వివరాల మేరకు.. కూలి పని చేసుకుని జీవించే ప్రకాష్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ సమస్య తట్టుకోలేక జీవితంపై విరక్తితో గురువారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకున్నారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

News May 9, 2024

తానూర్: వడదెబ్బతో ఉపాధి కూలి మృతి

image

ఉపాధి హామీ పనులకు వెళ్లి వడ దెబ్బకు గురైన కూలి మృతి చెందిన ఘటన తానూర్ మండలంలో చోటుచేసుకుంది. బోసి గ్రామానికి చెందిన పర్వార్ విఠ్ఠల్ (60) బుధవారం కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి రాగా.. అస్వస్థతకు గురై పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే వడ దెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారించారు.

News May 9, 2024

ADB: ఎన్నికల సమరానికి.. ఇక మూడు రోజులే !

image

సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడటంతో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టిసారించాయి. ADB, PDPL లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, BRS, BJP మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయి సమావేశాలు, బహిరంగ సభలు, కూడలి సమావేశాల ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇక ప్రచారం మూడు రోజులు ఉండడంతో అభ్యర్థులలో ఉత్కంఠ నెలకొంది.

News May 9, 2024

ఖానాపూర్: నలుగురు బీజేపీ నాయకులపై కేసు నమోదు

image

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నలుగురు బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసినట్లు ఖానాపూర్ ఎస్సై లింబాద్రి తెలిపారు. ఖానాపూర్‌లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పర్యటన సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమయాన్ని ఉల్లంఘించారన్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యేలు రాజాసింగ్, పాయల్ శంకర్, బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అంకం మహేందర్ లపై కేసు నమోదు చేశామని ఖానాపూర్ ఎస్సై లింబాద్రి వెల్లడించారు.

News May 9, 2024

ADB: ఈ ఎంపీ స్థానం.. మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం

image

ADB MP స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలతో పొలిస్తే BJPలో ప్రస్తుతం ఉత్సహం కనిపించడం లేదు. SKZRకు అమిత్ షా, ఖానాపూర్‌కు రాజాసింగ్ తప్పితే రాష్ట్ర, జాతీయ నేతలెవరూ రాలేదు. గ్రూపు విభేదాలకు నిలయమైన కాంగ్రెస్‌లో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ వచ్చినా మార్పు కనిపించటంలేదు. ప్రస్తుతం BRS డీలాపడింది. నేతలు పార్టీ మారటం ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.

News May 9, 2024

ADB: వ్యభిచార గృహాలపై దాడులు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూడు చోట్ల నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై పోలీసులు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని మూడు కాలనీల్లో ఆకస్మికంగా దాడులు చేశారు. అక్కడ వ్యభిచారం చేస్తున్న ఆరుగురు యువతులను, ఎనిమిది మంది విటులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. వారిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.

News May 9, 2024

నేడు నిర్మల్ జిల్లాలో KTR పర్యటన

image

నేడు నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు భైంసాలో రోడ్డు షో నిర్వహించనున్నారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్ లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు.

News May 9, 2024

నేడు ఆదిలాబాద్ జిల్లాకు మాజీ గవర్నర్ రాక

image

బీజేపీ ఎంపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లాకు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రానున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం పట్టణంలోని కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్న సమావేశానికి ఆమె హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి స్టార్ క్యాంపెనర్‌గా ఆమె జిల్లాకు
వస్తున్నట్లు వెల్లడించారు.

News May 8, 2024

ఆదిలాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని మిస్సింగ్

image

ఆదిలాబాద్ నర్సింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉట్నూర్‌కి చెందిన ఓ యువతి ఈ నెల 4న ఇంటికి వెళ్తానని ప్రిన్సిపల్‌కి సెలవు పత్రం ఇచ్చి కాలేజీ నుంచి బయటికి వచ్చింది. అయితే బుధవారం ఆమె తండ్రి తనను చూడడానికి కాలేజీకి వెళ్లడంతో విషయం బయటపడింది. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు 2 టౌన్ CI అశోక్ తెలిపారు.

News May 8, 2024

ఆదిలాబాద్: POLYCET దరఖాస్తు గడువు పెంపు

image

POLYCET ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు ఆలస్య రుసుము రూ.100తో ఈ నెల 7న ముగిసింది. కాగా దరఖాస్తు గడువు ఈ నెల 14 వరకు పొడగించినట్లు ఆదిలాబాద్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ భరద్వాజ తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 24న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.