India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నట్లు మంత్రి పీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెబ్బన, వాంకిడి, కెరమెరి మండలాల్లో జంగు బాయి దేవత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో MRPS నాయకుడు ఎల్లన్న ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూర్యప్రసాద్, ఉపాధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్, కార్యదర్శిగా రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లాధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. ఈనెల 22న జిల్లాకు మందకృష్ణ మాదిగ వస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా పనిచేయాలని కోరారు.
అక్రమంగా తరలిస్తున్న పశువులను పోలీసులు పట్టుకున్న ఘటన సిర్పూర్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న పశువులను మండల కేంద్రంలో ఆదివారం పట్టుకున్నారు. అనంతరం పశువులను గోశాలలకు తరలించి, బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
రెబ్బన మండలం గోలేటికి చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి సీనియర్ సెపక్ తక్రా మేనేజర్లుగా ఎంపికయ్యారు. ఆదివారం గోలేటిలో తెలంగాణ రాష్ట్ర సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. జనవరి 10నుంచి 14వరకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే 34వ సీనియర్ జాతీయస్థాయి మహిళల టీం మేనేజర్గా పర్లపల్లి శిరీష, పురుషుల మేనేజర్గా రామకృష్ణారెడ్డి ఈనెల 11న ఎంపికయ్యారని తెలిపారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
నార్నూర్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2025 సంవత్సరానికి 100 సీట్లకు ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రశాంత్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదేవిధంగా పాఠశాలలో 7 తరగతి నుంచి 9వ తరగతిలో మిగిలిన సీట్లకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్షకోసం అర్హులైన విద్యార్థులు https Telangana ms.cgg.giv.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.