Adilabad

News May 7, 2024

క్యారమ్ ఆడిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్

image

బోథ్ మండలంలోని దనోరా గ్రామంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలను కలుస్తూ గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాసేపు చిన్నారులతో క్యారం ఆడి ఎమ్మెల్యే సందడి చేశారు. ఎంపీగా ఆత్రం సక్కును భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

News May 7, 2024

ఆదిలాబాద్: రూ.2తో ఓటు ఛాలెంజ్‌

image

పోలింగ్‌ బూత్‌లోకి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపోదని అనుమానం కలిగినప్పుడు ఏజెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారికి రూ.2 చెల్లించి సవాల్‌ చేసే అవకాశం ఉంది. ఓటరు బోగస్‌ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. జాబితాలో ఉన్న విధంగా ఓటరే అయితే ఓటు వేయడానికి అనుమతిచ్చి, సవాల్‌ చేసిన ఏజెంట్‌ ఓడిపోయినట్లు తీర్మానించి అతను చెల్లించిన రూ.2ను ప్రభుత్వానికి అప్పగిస్తారు.

News May 7, 2024

జైపూర్ మండలంలో చిరుత పులి సంచారం

image

జైపూర్ మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని నర్సింగాపూర్, గంగిపల్లి, కుందారం, మద్దులపల్లి అటవీ పరిధిలో చిరుత పులి సంచారాన్ని గుర్తించినట్లు అటవీశాఖ బీట్ అధికారి సతీష్ తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. తమ అవసరాల కోసం అడవిలోకి వెళ్లొద్దని ఆయన సూచించారు.

News May 7, 2024

ఆదిలాబాద్: మీరు ఓటేశారా..? రేపే LAST

image

ఆదిలాబాద్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ నమోదు చేసుకోగా.. ఇప్పటివరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. ఇంకా 2 రోజులు మాత్రమే గడువు ఉండడంతో త్వరగా ఓటును వినియోగించుకోవాలి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేది ఉద్యోగులు, ఉపాధ్యాయులే అయినా.. చిన్న పొరపాట్ల కారణంగా తిరస్కరణకు గురవుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది ఉద్యోగుల ఓట్లు తిరస్కరించారు.

News May 7, 2024

ADB: చీర ఆర్డర్ చేస్తే.. పీలికలు వచ్చాయి..!

image

ఆదిలాబాద్‌కి చెందిన ఓ ఉపాధ్యాయుడు తన భార్యకోసం ఆన్‌లైన్‌లో రూ.700 విలువైన చీరను బుక్ చేస్తే గుడ్డ పీలికలు వచ్చిన వైనం వెలుగుచూసింది.
ప్రముఖ కంపెనీ యాప్‌లో నచ్చిన చీరను ఆర్డర్ చేసి భార్యను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నారు. డెలివరీబాయ్ వచ్చి ఆర్డర్ ఇచ్చి వెళ్లగా.. విప్పి చూస్తే చిరిగిన పీలికలు కనిపించడంతో దంపతులు అవాక్కయ్యారు. డెలీవరీ ఏజెన్సీ దగ్గరకు వెళ్లి నిలదీస్తే తమకేం తెలియదంటూ చేతులెత్తేశారు.

News May 7, 2024

ఆదిలాబాద్: రెండు నెలల్లో 27 మంది దుర్మరణం

image

ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో 2 నెలల్లోనే 71 ప్రమాదాలు చోటుచేసుకోగా 27 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 48 మంది తీవ్రగాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు. గుడిహత్నూర్ మండలంలోని మేకలగండి, సీతాగొంది, దేవాపూర్ చెక్ పోస్టు, మావల బైపాస్ వద్ద, నేరడిగొండ మండలం బోరిగాం, కుప్టి ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువగా ఈ ప్రమాదాల్లో యువకులే మృత్యవాత పడుతున్నారు.

News May 7, 2024

MNCL: ఉమ్మడి జిల్లాకు రెడ్ అలర్ట్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భానుడు హడలెత్తిస్తున్నాడు. ఈ సీజన్‌లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హాజీపూర్, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా లింగాపూర్, తపాలపూర్, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.

News May 6, 2024

జన్నారం: పొదల్లో ఆడ శిశువు లభ్యం

image

మానవత్వాన్ని మంటగలిపే ఘటన జన్నారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ధర్మారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెట్ల పొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆడ శిశువును పడేశారు. అటుగా వెళ్తున్న ప్రవీణ్ శిశువును గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. స్పందించిన బ్లూ కోట్ పోలీసులు హుటాహుటిన శిశువును స్థానిక ఆసుపత్రికి తరలించారు.

News May 6, 2024

మంచిర్యాల: కూతురు పెళ్లైన కాసేపటికే తండ్రి మరణం

image

కూతురు వివాహం అయి 24గంటలు గడవక ముందే తండ్రి మృతిచెందిన ఘటన చెన్నూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మెయిన్ రోడ్‌లో జనరల్ స్టోర్ నడుపుతున్న మహ్మద్ ఏజాజ్ ఆదివారం రాత్రి తన కూతురికి వివాహం చేశాడు. వివాహవేడుక పూర్తయిన కాసేపటికే గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు.

News May 6, 2024

ఆసిఫాబాద్: సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని గురుడుపేట్‌లో భీమ్‌రావు(30)అనే వ్యక్తి మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.