India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఒడ్డెర కాలనీకి చెందిన రాజేందర్ అదే కాలనీకి చెందిన ఓ బాలికను హైటెక్ సిటి వద్ద చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు వెల్లడించారు.
జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ సజావుగానే సాగుతుందని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో అధికారులతో, ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు, అభ్యంతరాలు, దరఖాస్తులకు ఈనెల 28 వరకు అవకాశం ఉందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలన్నారు.
మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగదు స్వాధీనంపై ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. కమిటీలో జిల్లా పరిషత్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా జితేందర్, జిల్లా సహకార అధికారి కమిటీ సభ్యుడు బి.మోహన్, జిల్లా ట్రెజరీ అధికారిగా హారికను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించి పలు జాతీయ రహదారుల విషయంపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూరూ.100 రూ.100 జాతీయరహదారి- జాతీయ రహదారి- 63 విస్తరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.
తండ్రిలేని ఓ యువతిని మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాలు.. AP భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈనేపథ్యంలో ఆమె ఆదిలాబాద్లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ADBకి వెళ్లాడు. ఈక్రమంలో అతడు కోడలిపై లైంగిక దాడి చేశాడు. ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు.
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జాఫర్ నగర్కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు SI సనత్ తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రమీనా హుస్సేన్ సోమవారం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోకు వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబీకులు తలుపులు పగలగొట్టి చూడగా బాలిక ఇంట్లో ఉరేసుకొని ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై SI కేసు నమోదు చేశారు.
కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ను KU అధికారులు మంగళవారం విడుదల చేశారు. 1, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 26 నుంచి, 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1, 5వ సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య విచ్చేశారు. ముందుగా ఉట్నూర్లో ఆయన పర్యటించగా ITDA PO ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలదేవి దేవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరుగుతున్న కుటుంబ సర్వేను పరిశీలించారు. అలాగే ఉట్నూర్ మండలం బిర్సాయిపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.
వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామస్థులు మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమగ్ర సర్వేకు సహకరించమని చెప్పారు.
చదువుకు పేదరికం అడ్డుకాదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్లగొండ గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం అశోక్ మున్నాభాయ్ దంపతుల కుమార్తె శ్రీ తేజకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రూ.50 వేల చెక్కును అందజేశారు. తీన్మార్ మల్లన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.