Adilabad

News November 14, 2024

మంచిర్యాలలో బాలికపై అత్యాచారయత్నం

image

11 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఒడ్డెర కాలనీకి చెందిన రాజేందర్ అదే కాలనీకి చెందిన ఓ బాలికను హైటెక్ సిటి వద్ద చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి అతడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు వెల్లడించారు.

News November 14, 2024

ADB: స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి: సురేంద్ర మోహన్

image

జిల్లాలో ఓటరు నమోదు ప్రక్రియ సజావుగానే సాగుతుందని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు సురేంద్ర మోహన్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో అధికారులతో, ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. కొత్త ఓటర్ల నమోదు, సవరణలు, తొలగింపులు, అభ్యంతరాలు, దరఖాస్తులకు ఈనెల 28 వరకు అవకాశం ఉందన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయంతో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలన్నారు.

News November 13, 2024

నగదు స్వాధీనంపై కమిటీ ఏర్పాటు : ఆదిలాబాద్ కలెక్టర్

image

మహారాష్ట్రలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నగదు స్వాధీనంపై ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. కమిటీలో జిల్లా పరిషత్, ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా జితేందర్, జిల్లా సహకార అధికారి కమిటీ సభ్యుడు బి.మోహన్, జిల్లా ట్రెజరీ అధికారిగా హారికను నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు.

News November 13, 2024

చెన్నూర్: కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

image

కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించి పలు జాతీయ రహదారుల విషయంపై వారు చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూరూ.100 రూ.100 జాతీయరహదారి- జాతీయ రహదారి- 63 విస్తరణ, కొత్త రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు.

News November 13, 2024

ADB: యువతిని గర్భవతిని చేసిన మేనమామ

image

తండ్రిలేని ఓ యువతిని మేనమామ గర్భవతిని చేసిన ఘటన ఇది. పోలీసులు తెలిపిన వివరాలు.. AP భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతి తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఈనేపథ్యంలో ఆమె ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ADBకి వెళ్లాడు. ఈక్రమంలో అతడు కోడలిపై లైంగిక దాడి చేశాడు. ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధారించారు.

News November 13, 2024

మంచిర్యాలలో 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జాఫర్ నగర్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు SI సనత్ తెలిపారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న రమీనా హుస్సేన్ సోమవారం పాఠశాల నుంచి వచ్చి ఇంట్లోకు వెళ్లి గడియ పెట్టుకుంది. ఎంత సేపటికి రాకపోవడంతో కుటుంబీకులు తలుపులు పగలగొట్టి చూడగా బాలిక ఇంట్లో ఉరేసుకొని ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై SI కేసు నమోదు చేశారు.

News November 12, 2024

ADB: KU పరీక్షల షెడ్యూల్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీలోని డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్‌ను KU అధికారులు మంగళవారం విడుదల చేశారు. 1, 5 సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 26 నుంచి, 3వ సెమిస్టర్ విద్యార్థులకు ఈ నెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1, 5వ సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 – 5 గంటల వరకు, 3వ సెమిస్టర్ వారికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News November 12, 2024

జిల్లాకు వచ్చిన ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి

image

ఆదిలాబాద్ జిల్లాకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య విచ్చేశారు. ముందుగా ఉట్నూర్‌లో ఆయన పర్యటించగా ITDA PO ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలదేవి దేవి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరుగుతున్న కుటుంబ సర్వేను పరిశీలించారు. అలాగే ఉట్నూర్ మండలం బిర్సాయిపేటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.

News November 12, 2024

లోకేశ్వరం: సమగ్ర సర్వేని బహిష్కరించిన ధర్మోరా గ్రామస్థులు

image

వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లోకేశ్వరం మండలం ధర్మోరా గ్రామస్థులు మంగళవారం సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే సమగ్ర సర్వేకు సహకరించమని చెప్పారు.

News November 12, 2024

సిర్పూర్: విద్యార్థినికి తీన్మార్ మల్లన్న రూ.50వేల సాయం

image

చదువుకు పేదరికం అడ్డుకాదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. నల్లగొండ గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించి చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం కొమ్ముగూడకు చెందిన దుర్గం అశోక్ మున్నాభాయ్ దంపతుల కుమార్తె శ్రీ తేజకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రూ.50 వేల చెక్కును అందజేశారు. తీన్మార్ మల్లన్నకు వారు కృతజ్ఞతలు తెలిపారు.