India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక షాద్నగర్ చెందిన హబీబ్ అలీ, కబీర్, రెహమాన్, మక్దూం, అల్తాఫ్, అహ్మద్, ఇమ్రాన్ శనివారం కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు.
వాట్సాప్లో వచ్చే గుర్తు తెలియని ఏపీకే అప్లికేషన్లను క్లిక్ చేయడం వల్ల సైబరు నేరస్తుల వలలో చిక్కుకునే ప్రమాదం ఉందని మందమర్రి ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. ఎస్సై మాట్లాడుతూ.. మండలంలోని చెర్రకుంటకు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్కు వచ్చిన ఏపీకే ఫైల్ క్లిక్ చేయడంతో అతను తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.50వేలు పొగోట్టుకున్నట్లు తెలిపారు. సైబర్ మోసానికి గురైతే 1930నంబర్కు కాల్ చేయాలన్నారు.
2025 మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. పరీక్ష రుసుం అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125, వృత్తి విద్యా కోర్సులకు అదనంగా రూ.60 చెల్లించాలని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. అపరాధ రుసుం లేకుండా ఈ నెల 18, రూ.50 అపరాధ రుసుంతో డిసెంబర్ 2, రూ.200తో 12వ తేదీ, రూ.500తో 21వ తేదీలోగా చెల్లించాలని సూచించారు.
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే అధికారి మహేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, హమాలివాడ రైల్వే గేట్ వద్దకు ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని సింగరేణి రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మరణించినట్లు రైల్వే అధికారి మహేందర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, హమాలివాడ రైల్వే గేట్ వద్దకు ట్రాక్ వెంబడి నడుచుకుంటూ వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని సింగరేణి రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు గడువు శనివారంతో ముగియనుంది. కాగా జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ఉట్నూర్లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చని ఐటీడీవో పీవో ఖుష్బు గుప్తా వెల్లడించారు.
జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కెరమరి మండలం దేవాపూర్, అనార్పల్లి, తుమ్మగూడ జీపీల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి, కాగజ్ నగర్ మండలం కోసిని జీపీలో పాటు మున్సిపల్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు.
ఈనెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సంబంధిత సర్వే నిర్వహిస్తున్న మండల టీమ్లతో శుక్రవారం కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేలో ఎక్కడ కూడా పొరపాట్లకు, తప్పులకు తావివ్వకుండా సరైన సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలని స్పష్టం చేశారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలన్నారు.
నిషేధిత మత్తు పదార్థాలను వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు మండలాల వారీగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గంజాయి తదితర మత్తు పదార్థాలను వినియోగిస్తే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదారాబాద్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది పథంలో పయనిస్తోందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.