India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 29 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందన్నారు.

సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి మందమర్రి ఏరియాలో సోమవారం పర్యటించారు.GM దేవేందర్తో కలిసి ఏరియాలోని KK-OCPసందర్శించి పని ప్రదేశాలను పరిశీలించారు. ఉత్పత్తి ఉత్పాదకతపై సమీక్షించారు. రవాణాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు అంకితాభావంతో పనిచేసినప్పుడే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి మార్గం సులువుతుందన్నారు.

ఖానాపూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో చైనా మాంజా తగిలి ఒకరు గాయపడ్డారు. ఆ కాలనీకి చెందిన పరిమి చంద్ర విలాస్ పనిలో భాగంగా చేపలు పట్టడం కోసం సోమవారం గోదావరికి వెళ్తున్న సమయంలో జూనియర్ కాలేజ్ రోడ్డుపై పడిన చైనా మాంజా అకస్మాత్తుగా ఆయన గొంతుకు తగిలి కట్టయ్యింది. స్థానికులు ఆయనను మొదట ఖానాపూర్ ఆస్పత్రికి, అటు నుంచి నిర్మల్ ఆసుపత్రికి తరలించగా నాలుగు కుట్లు పడ్డాయి. ఈ సంఘటన ఖానాపూర్లో సంచలనం రేపింది.

అవినీతి నిరోధక శాఖ ఆదిలాబాద్ DSPగా పి.విజయ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వికారాబాద్ నుంచి ఆదిలాబాద్కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కార్యాలయ సిబ్బంది బొకో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీకి సంప్రదించాలని సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064లో వివరాలు తెలియజేయాలన్నారు.

మంచిర్యాల జిల్లాలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు చెందిన తుది ఓటరు జాబితా విడుదల చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఓటరు జాబితా సవరణలో భాగంగా నూతన ఓటరు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు అందిన దరఖాస్తులను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందిన తుది ఓటరు జాబితా ప్రచురించినట్లు పేర్కొన్నారు.

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు- 2024.-25 పరీక్షల షెడ్యూల్ విడుదలైనట్లు మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. ఈ నెల 11 నుంచి 17 వరకు డ్రాయింగ్ లోయర్, హయ్యర్ గ్రేడ్, 11న టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్, 12 నుంచి 16 వరకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు www.bsetelangana.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్కుమార్ దీపక్ అన్నారు. ముల్కల్ల పంచాయతీ వీరాంజనేయులు SHG సభ్యురాలు విజయకు సంచార చేపలు విక్రయించేందుకు వాహనాన్ని సోమవారం అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బాధ్యతతో వ్యాపారాన్ని నిర్వర్తించి కుటుంబానికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమీక్ష సోమవారం నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాను సెంటిమెంట్గా భావిస్తున్న కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కాగా టీపీసీసీ ఛీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఎన్నికల కార్యాచరణపై దిశానిర్ధేశం చేయనున్నారు.

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. ఆకాశంలో గాలిపటాలు ఎగురుతుంటాయ్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎగరవేస్తుంటారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొందరు కైట్స్ ఎగరవేయడానికి చైనా మాంజా వాడుతుండటంతో రోడ్లపై వెళ్లే వారికి అవి ప్రమాదకరంగా మారాయి. గతంలో చైనా మాంజాతో గొంతులు తెగి ప్రాణాలు పోయిన సందర్భాలూ ఉన్నాయి. కాగా, చైనా మాంజాలు వాడినా, విక్రయించినా చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఓ యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. CI రామకృష్ణ వివరాలు.. సారంగాపూర్ మండలం బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్, సాయికుమార్, మరో బాలుడు డిసెంబర్ 31న గొడవపడ్డారు. అది మనసులో పెట్టుకున్న సాయికుమార్ సదరు బాలుడితో కలిసి ఈనెల 4న అర్షద్ను గ్రామంలోని ఓ కూడలి వద్దకు రప్పించి కత్తితో పొడిచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.