Adilabad

News May 5, 2024

నిర్మల్: రెడ్ జోన్‌లో 5 మండలాలు

image

నిర్మల్ జిల్లాలో 45.7 డిగ్రీల అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని ఐదు మండలాలైన నర్సాపూర్ జి, కడెం, కుబీర్, ఖానాపూర్, భైంసా మండలాలను వాతావరణ శాఖ అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించింది. వీటిలో 45.1 డిగ్రీ నుంచి 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించి బయటకు వెళ్లాలని సూచించారు.

News May 5, 2024

నిర్మల్: రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని క్రషర్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ సభాస్థలి ప్రాంగణాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పరిశీలించారు. హెలి ప్యాడ్, పార్కింగ్, తదితర ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

News May 4, 2024

ఆదిలాబాద్: రేపు ఇద్దరు అగ్రనేతల రాక

image

రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇద్దరు అగ్రనేతలు రానున్నారు. ఈ నెల 5వ తేదీన ఒకే రోజు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రావడం ఆసక్తి రేపుతోంది. ఆదిలాబాద్ లోక్ సభ పరిధిలోకి వచ్చే నిర్మల్‌లో కాంగ్రెస్ నిర్వహించే భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ హజరు కానుండగా.. కాగజ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించనున్న బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News May 4, 2024

ఆదిలాబాద్: MLC ఎన్నికలు మళ్ళీ ఉంటాయా..?

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో కుదుపు ఏర్పడింది. ఆదిలాబాద్ MLC సభ్యుడు దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు మరోసారి నిర్వహించక తప్పదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విఠల్ సుప్రీం కోర్టుకు వెళితే అక్కడి నుంచి వచ్చే ఫలితాన్ని బట్టి ఏం జరుగుతుందో ఆసక్తి నెలకొంది.

News May 4, 2024

బెల్లంపల్లి: పరీక్షలకు భయపడి విద్యార్థిని ఆత్మహత్య

image

పరీక్షలకు భయపడి బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ బస్తీకి చెందిన మహా శివప్రియ(20) ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఫార్మసీ కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఫార్మా డీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమవగా ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని భయాందోళన చెంది ఉదయం హాస్టల్ భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.

News May 4, 2024

ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా ప్రచారం.. అధికారుల క్లారిటీ

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రెస్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన కేయూ అధికారులు అది ఫేక్ అని నిర్ధారించారు. పరీక్షలు యథావిధిగా ఈనెల 6 నుంచి ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News May 4, 2024

ADB: ఆద‌ర్శంగా నిలుస్తున్న ఆ ఎమ్మెల్యే

image

సర్కారు దవాఖానకు నేను రాను అనేది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు సర్కారీ దవాఖానలలో పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తాయని, ప్రభుత్వ ఆస్పత్రిపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా MLA వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు జబ్బు చేస్తే స్వయంగా ప్రభుత్వ ద‌వ‌ఖానాకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. తాజాగా తన తండ్రి భీంరావు ద‌వ‌డ‌కు క్యాన్స‌ర్ కావ‌డంతో ఆయన ఆదిలాబాద్ రిమ్స్ లో చేర్పించి శ‌స్త్ర చికిత్స చేయించారు

News May 4, 2024

రూ: 2లక్షల 53 వేల విలువగల గంజాయి స్వాధీనం

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో టూ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా భారీగా గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో షేక్ షోయబ్ ను ఆరెస్ట్ చెయ్యగా, షేక్ సాదిక్ పరారీలో ఉన్నట్లు డిఎస్పి జీవన్ రెడ్డి మీడియాకు తెలిపారు. సుమారు 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు, దీని విలువ రూ: 2లక్షల 53 వేలు ఉంటుందని పేర్కొన్నారు. టూ టౌన్ సీఐ అశోక్, ఎస్సై లాల్ సింగ్ నాయక్, తదితరులు ఉన్నారు.

News May 4, 2024

ADB: ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

పార్లమెంటు సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని అదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రాజర్షి షా, సాధారణ పరిశీలకులు రాజేంద్ర విజయ్ సమక్షంలో ఈవీఎంల రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈవీఎంల రెండవ ర్యాండమైజేషన్ జరిపారు.

News May 3, 2024

ADB: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన గంగుల యోగేష్ (22) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. నిన్న రాత్రి సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతుడి తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.