India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ లింగంపల్లిలో <<14555090>>భర్త వేధింపులు భరించలేక వికాసిని ఆనే మహిళ<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మృతురాలి భర్త నవీన్ అదనపు కట్నం కోసం కోన్నిరోజులుగా వేధిస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన వికాసిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న నవీన్ ఆందోళక గురై పురుగు మందు తాగాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కులగణన తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి 2,3 నెలలు సమయం పట్టే అవకాశముండగా గ్రామాల్లో అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. పలు కారణాలతో గతంలో పోటీ నుంచి చేయనివారు వారు ఈసారి సై అంటున్నారు. సర్పంచ్ సంగతి పక్కన పెడితే వార్డు సభ్యుడిగా చేయాలన్నా కొన్ని చోట్ల పోటీ ఉంది. వార్డు సభ్యుడిగా గెలిచి ఉపసర్పంచ్ దక్కించుకోవాలని కొందరు ఉవ్విళ్లూరుతున్నారు. మరి మీ ప్రాంతంలో ఎలా ఉంది?
బెల్లంపల్లి పట్టణం స్థానిక రైల్వే రడగంబాలబస్తి శ్రీ దుర్గాదేవి దేవాలయంలో నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వినోద్ పాల్గొన్నారు. అనంతరం ఎండీ అంజాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన గార్వి షరీఫ్ విందులో పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు, తదితరులు ఉన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో పీజీ రెండో సంవత్సర ఫలితాలు విడుదలైనట్లు అదిలాబాద్ సైన్స్ కళాశాల ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ జగ్రామ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో పరీక్షలు రాసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఫలితాల కోసం ఈ https://www.braouonline.in/PG/Application/PG_EXAMINATIONSTATEMENT/PG_Resutls_Login.aspx# వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న పార్ట్ టైం ఉపాధ్యాయ పోస్టులకు ఉట్నూర్లోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్సీఓ ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీటీ సామాన్య శాస్త్రం 3, ఇంగ్లిష్ 3, పీజీటీ భౌతిక శాస్త్రం 1, వృక్ష, భౌతిక, ఆర్థిక, వాణిజ్యశాస్త్రాల్లో ఒక్కో లెక్చరర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. బాలికల పాఠశాలల్లో మహిళలతోనే భర్తీ చేస్తామన్నారు.
గ్రూప్-III పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో గ్రూప్-III పరీక్షల నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్తో కలిసి ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్ III పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ జాబితాలో పేరు నమోదులో ఎదురవుతున్న సందేహాల నివృత్తి కోసం జిల్లా కలెక్టరేట్లో 1950 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఓటర్ జాబితాలో పేరు నమోదులో ఏమైనా సందేహాలు ఉంటే 1950 టోల్ ఫ్రీ నంబర్ (ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు) సంప్రదించాలని సూచించారు.
10వ తరగతి వరకు తరగతులు పెంచాలని విద్యార్థులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ను కోరారు. భీమిని మండలంలోని చిన్నగుడిపేట్ ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకే ఉందని, ఆపై చదువులకు వెళ్లే వసతి, రోడ్డులేక చదువు ఆపేయాల్సి వస్తోందని చిన్నారులు వాపోయారు. తమ అభ్యర్థనను, ప్రభుత్వం, కలెక్టర్ గమనించి గ్రామంలోని పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యాబోధన జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,030గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ, ప్రైవేటు ధరలో ఎటువంటి మార్పులేదు. పత్తికి సరైన గిట్టుబాటు ధరను కల్పించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.