India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాఫ్ నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసిన తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ఈ విషయమై సోమవారం ఉట్నూర్, గాదిగుడా నుంచి బాధితులు శైలజ, విజయలక్ష్మి, నీల ప్రజావాణికి వచ్చారు. అదనపు కలెక్టర్ శ్యామలదేవిని కలిసి విన్నవించారు. ట్రైనింగ్ పూర్తి చేసి 7 సంవత్సరాలు అవుతుందన్నారు. కాంట్రాక్ట్ లేదా ఔట్ సోర్సింగ్ పోస్ట్కి దరఖాస్తు చేసుకున్నా తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని వాపోయారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా చించ్ ఖేడ్కు చెందిన గోటి జితేందర్ బజర్హత్నూర్ మండలానికి చెందిన ఓ బాలికను ముంబైకి తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదిలాబాద్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులగం దేవిదాస్ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18న సబ్-జూనియర్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్ తెలిపారు. ఎంపికైన జిల్లా జట్టు వికారాబాద్ జిల్లాలోని 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు.

ఏక కాలంలో రెండు రెగ్యులర్ కోర్సులు కలిగి టీచర్ ఉద్యోగం పొందిన సౌజన్యపైన న్యాయ విచారణ జరిపించాలని ప్రజావాణికి తాంసి మండలానికి చెందిన అభ్యర్థి నవీన్ కుమార్ కోరారు. ఒక సాధారణ విద్యార్థిగా సుమారు 350 కి.మీ దూరంగా ఉన్న వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి రెండు కోర్సులు చేయడం సాధ్యం కాదన్నారు. ఆమె తప్పుడు సర్టిఫికెట్ పెట్టి అధికారులను తప్పుదోవ పట్టించిందన్నారు. చీటింగ్ కేసు నమోదు చేయలన్నారు.

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రత్నజాడే ప్రజ్ఞ కుమార్ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాలను కలెక్టర్కు అందజేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లాకు మంజూరైన ఐటీ టవర్ అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి జయేశ్ రంజన్ ను హైదరాబాద్లో సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఐటీ పరిశ్రమలను పట్టణాలకు విస్తరించాలని గత ప్రభుత్వం జిల్లాకు 2022లో ఐటీ టవర్ మంజూరు చేసిందన్నారు. కానీ ఇప్పటికి పనులు పూర్తి కాలేదన్నారు.

రేషన్ కార్డు డేటా ఎంట్రీ, ఇందిరమ్మ ఇళ్లు, పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణలపై సోమవారం ADB కలెక్టర్ రాజర్షిషా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు, ఇందిరమ్మఇళ్లకు సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి వివరాలను డేటా ఎంట్రీ రెండురోజుల్లో పూర్తి చేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం తెలిపారు. రైతుల ఆధార్ వెరిఫికేషన్లో పలు సాంకేతిక సమస్యల రీత్యా కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించారు. తర్వాత కొనుగోళ్లు తేదీని వెంటనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై రైతులు సహకరించాలని కోరారు.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ప్రభుత్వ పాఠశాలలో 1972-73 10వ తరగతి బ్యాచ్కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం 23 మంది విద్యార్థుల్లో 7గురు మరణించగా మిగిలిన 17 మంది పూర్వ విద్యార్థులు కలుసుకోవడం విశేషం. పాఠాలు చెప్పిన గురువులలో ఉన్న ఏకైక ఉపాధ్యాయుడు పోశెట్టిని సన్మానించారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.