India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఆదివారం ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా అర్లి(T)లో 5.9, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్(U) 6.0, నిర్మల్ జిల్లాలో పెంబి 8.0, మంచిర్యాల జిల్లాలో నెన్నెల 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గాయి.

ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. కౌటాల మండలం గురుడుపేట్కు చెందిన నీకా సాయికుమార్(27), కన్నెపల్లికి చెందిన మానస(20) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి వారి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారి తల్లిదండ్రులకు నచ్చచెప్పి ఇద్దరు ప్రేమికులను ఒక్కటి చేసినట్లు కౌటాల SI మధుకర్ తెలిపారు. ఇందులో గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని ASF ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని జైనూర్, కెరమెరి, వాంకిడి, ఆసిఫాబాద్, రెబ్బెన మండలాల్లో కవిత పర్యటిస్తారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి పర్యటన విజయవంతం చేయాలని ఆమె కోరారు.

ఓ యువకుడిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి అరెస్టయిన ఘటన సారంగాపూర్ మండలంలో ఆదివారం జరిగింది. గ్రామీణ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. బోరేగాం గ్రామానికి చెందిన షేక్ అర్షద్ అదే గ్రామానికి చెందిన సాయికుమార్ డిసెంబర్ 31న గొడవపడ్డారు. ఇది మనసులో పెట్టుకున్న సాయికుమార్ ఓ మైనర్తో కలిసి ఈ నెల 4న కత్తితో అర్షద్ను పొడిచి పారిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులిద్దరిని అరెస్టు చేశారు.

లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ భరోసా సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ గురించి, సెంటర్లో పనిచేసే ఉద్యోగుల విధులు తెలుసుకున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, సంబంధిత ఫైళ్లను తనిఖీ చేశారు. సిబ్బందికి కొన్ని సూచనలు, సలహాలు చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి భాస్కర్, భరోసా ఉమెన్ ఎస్సై తిరుమల, లీగల్ అడ్వైజర్ శైలజ తదితరులు ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత భీంపూర్ మండలం అర్లి (టి)లో 5.9 డిగ్రీలు నమోదైంది. సిర్పూర్ (యూ)లో 6.0, తిర్యాణి (6.1), బేల 6.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంబి(8.0), మంచిర్యాల జిల్లా నెన్నెల (9.5) డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా చలికి తట్టుకోలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ఇటీవల చెప్పుల షాపులో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. ఈనెల 2న చెప్పుల షాప్లో రూ.2వేల నగదును దొంగిలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాగా శనివారం పట్టణంలోని పంజాబ్ చౌక్లో ఎస్ఐ అశోక్ వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగ పట్టుబడ్డారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. శనివారం ఉష్ణోగ్రతలు అతి అల్పానికి చేరుకున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా సిర్పూర్(U) 6.1, ఆదిలాబాద్ జిల్లాలో అర్లి(T) 6.2, నిర్మల్ జిల్లాలో కుబీర్ 8.8, మంచిర్యాల జిల్లాలో జైపూర్ 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లా వాసులు తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని రైతుల పొలాలకు ఎమ్మెల్యే బొజ్జు సాగునీటిని విడుదల చేయనున్నారని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. రబీ సీజన్కు సంబంధించి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న రైతుల పొలాల్లో వేసే పంటల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదివారం ఉదయం 10 గంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారని వారు వెల్లడించారు. విషయాన్ని రైతులు, అందరూ గమనించాలని వారు సూచించారు.

పెద్దపులి దాడిలో 3 ఆవులు మృతి చెందిన ఘటన భీంపూర్లో చోటుచేసుకుంది. మండలంలోని పిప్పల్ కోటి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో శుక్రవారం మేతకు వెళ్లిన 3 ఆవులపై పులి దాడి చేసి చంపేయగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతులు పంట చేలకు వెళ్లాలంటే జంకుతున్నారు.
Sorry, no posts matched your criteria.