India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

MMC ఘట్కేసర్ సర్కిల్ ముత్వెల్లిగూడలో నీటి లీకేజీపై Way2News కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు. ‘<<19260987>>నమ్మండి.. ఇది రోడ్డే..!<<>>’ శీర్షికన శనివారం పబ్లిష్ అయిన కథనంతో HMWSSB మల్కాజిగిరి ED పంకజ, CGM (E) సంతోష్ సదరు ప్రాంతాన్ని సందర్శించారు. 200mm డయా పైపు నీటి లీకేజీ సమస్యను పరిష్కరించారు. స్పందించి సమస్య తీర్చిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

EMRI(108) సంస్థలో పైలట్ & EMT ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్ తీసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. డ్రైవర్కు అర్హతలు: SSC పాస్, 23-35yrs (LMV)బ్యాడ్జి నంబర్ ఉండాలి. EMTఅర్హతలు: MLT, DMLT, ANM, MPHA, GNM, B.SC, BZC 30 yrs లోపు వారు కింగ్ కోఠి 108 రీజనల్ ఆఫీస్ 10am- 2pm వరకు 9100799259లో సంప్రదించండి.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCCల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశనిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనంతా పటిష్ఠమైన భద్రతా చర్యల నడుమ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

నగర శివారు కీసరలోని గోషాల వద్దగల చెరువులో భారీ చేప జాలరుల వలకు చిక్కింది. ఓ వ్యక్తి ఆదివారం సరదగా అలా చెరువు వద్దకు వెళ్లాడు. 14కేజీల భారీ చేప చిక్కను కిలోల లెక్కన కొనుగోలు చేశాడు. దీంతో కుటుంబమంతా సంతోషం వ్యక్తం చేస్తుంది. పక్కనే గ్రౌండ్లో ఉన్న ప్లేయర్స్, స్థానికులు ఈ చేపను ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మీరెప్పుడైనా ఇంత పెద్ద చేపను లైవ్లో చూశారా?

ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల పేర్లతో నకిలీ వాహన బీమా పత్రాలను సృష్టిస్తున్న 9మంది ముఠా సభ్యులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా నకిలీ పత్రాలు, స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్ వెల్లడించారు. అవసరంలో ఉన్న వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. ప్రజలు అధికారిక వెబ్సైట్ల ద్వారానే బీమా తీసుకోవాలని పోలీసులు సూచించారు.

ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు చెబుతారు. ఈ సూత్రం ఎప్పటికీ వర్తిస్తుందని HYD జీవన్ దాన్ అధికారులు పేర్కొన్నారు. కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, గుండె కవాటాలు, కిడ్నీలు ₹కోట్లు పెట్టినా దొరకకపోవచ్చని వాటిని పదిలంగా కాపాడుకోవాలని సూచించారు. చెడు అలవాట్ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ₹లక్షల్లో సేవ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. అవయవాలు ఫెయిలైనవారు 4వేల మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!

పాతబస్తీలోని మురుగునీటి సమస్యల పరిష్కారానికి జలమండలి కొత్త రోబోటిక్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. విజయనగర్ కాలనీ సెక్షన్ పరిధిలోని మల్లేపల్లి ఎక్స్ రోడ్ వద్ద డీ-సిల్టింగ్ పనులను జలమండలి MD అశోక్ రెడ్డి, హైడ్రాకమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సీవర్ లైన్లలో ఏర్పడిన పూడికను తొలగించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఆధునిక పద్ధతులతో త్వరగా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు.

పబ్బుల హోరు.. DJల జోరు వదిలేసి హైటెక్ సిటీ Gen Z ‘నిశ్శబ్దాన్ని’ వెతుక్కుంటోంది. అర్ధరాత్రి దాటాక గచ్చిబౌలి సర్వీస్ రోడ్ల మీద కార్లు ఆపి ఎటువంటి సౌండ్ లేకుండా కేవలం ఆకాశాన్ని చూస్తూ గడపడం కొత్త ట్రెండ్. దీని పేరు కార్ పార్కింగ్ థెరపీ. ఒత్తిడిని జయించడానికి మందు అవసరం లేదు. మెట్రో రైలు శబ్దం వింటూ కారులో కునుకు తీస్తే చాలు అంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ అర్బన్ సన్యాసులకు ఇదే ప్రశాంతంగా ఉందట.

GHMC పరిధిలో ACB దాడుల పరంపర కేవలం అధికారుల అవినీతిని బయటపెట్టడమే కాదు.. వ్యవస్థలో పాతుకుపోయిన ‘పర్సెంటేజీ’ల దందాను కూడా ఎండగడుతోంది. చట్టపరంగా చూస్తే 64 శాతం శిక్షా రేటు అనేది న్యాయస్థానాలు అవినీతిపై చూపిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం. రాజకీయంగా కూడా ప్రభుత్వం 115 ప్రాసిక్యూషన్ శాంక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. అయితే, శిక్షలు ఒకవైపు.. వ్యవస్థ ప్రక్షాళన మరోవైపు సాగాల్సిందే!
Sorry, no posts matched your criteria.