India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
BRS రజతోత్సవ సభ కోసం నగర శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను తరలించేందుకు నాయకులు వాహనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ను LED లైట్లతో అందంగా అలంకరించారు. సభ వరంగల్లో అయినా హైదరాబాద్ కేంద్రంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు వెళ్లాయి. బస్సులు, డీసీఎంలు, కార్లు ఘట్కేసర్ మీదుగా ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోనున్నాయి. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భువనేశ్వరినగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్ ఖాదర్ జిలానీ ఇంట్లో దోమల కోసం పెట్టిన మస్కిటో కాయిల్ అతని కుమారులు అబ్దుల్ రెహమాన్ (4), అతిఫా(4) పడుకున్న పరుపు పై పడింది. నిప్పు అంటుకోవడంతో పరుపు పూర్తిగా కాలిపోగా.. ఆ పొగతో ఊపిరి ఆడక రెహమాన్ మృతి చెందాడు. అతిఫా అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
HYDలో వ్యభిచార స్థావరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 48 గంటల్లో 3 చోట్ల ఈ ముఠాలకు చెక్ పెట్టారు. గురువారం బంజారాహిల్స్లో ఇద్దరు యువతులతో విటులు పట్టుబడ్డారు. శుక్రవారం లాలాగూడలో వ్యభిచారం చేయిస్తూ ఉగండా దేశస్థులు చిక్కారు. శ్రీనగర్కాలనీలోని ఓ స్పా సెంటర్లో తనిఖీ చేయగా ఆరుగురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు తేలింది. అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఉగ్రదాడి అనంతరం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థాన్ జాతీయులను వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఇటువంటి సమయంలో పాకిస్థాన్ యువకుడు ఫయాజ్ హైదరాబాద్లో అరెస్ట్ అయ్యాడు. నగర యువతిని పెళ్లి చేసుకున్న ఫయాజ్ ఎటువంటి వీసా లేకుండా నేపాల్ మీదుగా ఇండియాలోకి అక్రమంగా చొరబడ్డాడు. టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం 108వ స్థాపనా దినోత్సవాన్ని వేడుకలు ఇవాళ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో MLC ప్రొ.కోదండరాం, మాజీ ఎంపీ K.కేశవరావు, సీపీ CV ఆనంద్, గాయకుడు అందెశ్రీ, వీసీ ప్రొ.కుమార్ మోలుగారం పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.
HYD స్థానిక సంస్థల MLC కోటాలో ‘ఆ ఒక్క ఓటు’ ఆసక్తిని రేపుతోంది. 22 ఏళ్ల తర్వాత MIM మీద BJP పోటీ చేసింది. BRS పోలింగ్లో పాల్గొనలేదు. BJP 24, INC 14, MIM 50 మంది సభ్యులు ఓటేశారు. ఇందులో MIMకు 63 ఓట్లు పోలయ్యాయి. BJPకి 25 ఓట్లు రావడం చర్చనీయాంశమైంది. 24 మంది సభ్యుల సొంత ఓట్లకు అదనంగా మరో ఓటు పడింది. ఇంతకీ ఏ పార్టీ నుంచి మద్దతు వచ్చింది? BJPకి ఓటేసిన ఆ సభ్యుడు ఎవరు? అనేది హాట్ టాపిక్గా మారింది.
పహల్గామ్ ఉగ్రదాడిని హైదరాబాదీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. సిటీలోని రహదారుల మీద కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. చార్మినార్ వద్ద శుక్రవారం ‘పాకిస్థాన్ ముర్దాబాద్’ అంటూ ముస్లిం సోదరులు కదం తొక్కారు. ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నినాదాలు చేశారు. ఇక ట్యాంక్బండ్ మీద CM రేవంత్ రెడ్డి క్యాండిల్ మార్చ్కు వేలాదిమంది నగరవాసులు తరలివచ్చారు. ఉగ్రదాడి పట్ల HYDలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉస్మానియా యూనివర్సిటీ ప్రీ పీహెచ్డీ (పీహెచ్డీ కోర్స్ వర్క్) పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు గతంలో ప్రకటించారు. వివిధ సాంకేతిక కారణాల వల్ల పరీక్షలను వాయిదా వేసుకున్నట్లు వివరించారు. తిరిగి నిర్వహించబోయే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.SHARE IT
HYDలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఉక్కపోత కారణంగా ఏసీలు, కూలర్ల వినియోగం అధికంగా ఉండటంతో మీటర్లు నిరంతరాయంగా తిరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 24న 3795 మెగా వాట్లను వినియోగించగా ఈ ఏడాది అదే రోజు 4,170 మెగావాట్ల విద్యుత్ వినియోగించారు. ఏప్రిల్ 23 2024లో 3,745 మోగా వాట్లు వినియోగించగా ఈ ఏడాది 4,136 వాడారు. ఈ వారం, పది రోజుల్లో వినియోగం ఇంకా ఎక్కువ ఉండే అవకాశముంది.
Sorry, no posts matched your criteria.