Hyderabad

News July 6, 2024

HYD: వేగంగా HMDA భూముల డిజిటలైజేషన్!

image

HMDA భూములకు సంబంధించి GIS డిజిటల్ మ్యాపింగ్ చేసే ప్రక్రియ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొబైల్‌లో యాప్ ఓపెన్ చేస్తే చాలు అరచేతిలో భూముల వివరాలు, హద్దులతో సహా కనిపించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. HMDAకు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం 8,260 ఎకరాలను కేటాయించింది. నగర శివారు జిల్లాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం భూముల కేటాయింపు నిర్ణయం తీసుకుంది.

News July 6, 2024

HYD: లష్కర్‌ బోనాలు.. రేపు ఘటోత్సవం

image

రేపటి నుంచి లష్కర్‌లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమవుతుందని ఆలయ EO గుత్తా మనోహర్ రెడ్డి తెలిపారు. నూతన కమిటీ సభ్యులతో కలిసి శుక్రవారం‌ పలు విషయాలు వెల్లడించారు. జులై 7న ఘటోత్సవం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 21న సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఉ. 3:30కి CM రేవంత్ అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారన్నారు. 22న రగం(భవిష్యవాణి) ఉంటుంది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

News July 5, 2024

హైదరాబాద్‌లో వాచ్‌మెన్ దారుణ హత్య

image

మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో వాచ్​మెన్​ దారుణ హత్యకు గురయ్యాడు. చిలకలగూడ CI అనుదీప్​ కథనం ప్రకారం.. ఉప్పరిబస్తీలో నిర్మాణంలో ఉన్న భవనంలో కుమ్మరి రామచంద్రయ్య (40) వాచ్​మెన్‌గా పనిచేస్తున్నాడు. రాళ్ల పనిచేసే సలీమ్​‌తో కలిసి నిన్న రాత్రి 10 గంటలకు మద్యం సేవించారు. మద్యం మత్తులో గొడవ జరిగింది. క్షణికావేశంలో సలీమ్​ రామచంద్రయ్యను ఇనుప రాడ్‌తో తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై రామచంద్రయ్య చనిపోయాడు.

News July 5, 2024

గాంధీనగర్: ఉరేసుకుని బాలిక ఆత్మహత్య

image

తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై నాగరాజు రెడ్డి కథనం ప్రకారం.. న్యూ బోయిగూడకు చెందిన అబ్దుల్ రజాక్ కూతురు(13) ఇటీవల బన్సీలాల్ పేట్‌కు వెళ్లి స్నేహితులతో కలిసి ఆడుకొని వచ్చింది. అంతదూరం వెళ్లి రావడంపై తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 5, 2024

HYD: బస్సులో మహిళ ప్రసవం.. అభినందించిన ఎండీ సజ్జనార్

image

ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డ్రైవర్, కండక్టర్ సరోజతో పాటు మహిళా ప్రయాణికులను అభినందించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవాస్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండడం అభినందనీయమన్నారు.

News July 5, 2024

WOW.. HYD నగరంలో హెరిటేజ్ అందాలు!

image

HYD నగరం హెరిటేజ్ అందాలకు మారుపేరుగా నిలుస్తుంది. దేశ, విదేశాల నుంచి HYD నగరానికి తరలివస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కోకాపేటలోని హరే కృష్ణ హెరిటేజ్ టవర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపుగా 120 మీటర్ల ఎత్తులో ఈ హెరిటేజ్ టవర్ ఉండటం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కళాకారులు అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు.

News July 5, 2024

HYD: 8వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య

image

MBBS పూర్తి చేసిన మహిళ మతిస్థిమితం కోల్పోయి అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ASరావు నగర్‌కు చెందిన నిహారిక రావు(29)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. దీంతో రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ 8వ అంతస్తు నుంచి దూకడంతో కారుపై పడి మృతి చెందింది. కేసు నమోదైంది.

News July 5, 2024

HWO పరీక్షకు 56.92 శాతం మంది హాజరు

image

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ (HWO) పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు TGPSC అధికారులు పేర్కొన్నారు. పేపర్-1కు 56.94% మంది, పేపర్-2కు 56.04% మంది హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. త్వరలోనే రెస్పాన్స్ షీట్స్ విడుదల చేస్తామన్నారు. పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో జూన్ 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.

News July 5, 2024

HYD: జూలై 7 నుంచి MMTS సేవల పునరుద్ధరణ!

image

HYD నగరంలో జులై 6 వరకు పలు MMTS రైళ్ల సేవలు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. జులై 7 నుంచి సేవలను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ లింగంపల్లి (47222), లింగంపల్లి మేడ్చల్(47225), మేడ్చల్ సికింద్రాబాద్(47235), సికింద్రాబాద్ మేడ్చల్ (47236), మేడ్చల్ సికింద్రాబాద్ (47237) సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. అందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News July 5, 2024

HYD: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఓ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన అత్తాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. సీఐ వెంకట్ రామిరెడ్డి వివరాల ప్రకారం.. అత్తాపూర్ PS పరిధిలో నివసించే ఓ బాలిక ఇంటి సమీపంలో ఉండే యువకుడు కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. మాయమాటలతో బాలికను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లు సమాచారం. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు గురువారం అత్తాపూర్ PSలో ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదైంది.