India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్లో మెట్రో రైలును నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్కు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటించడంలో గల నిబద్ధతకు రైల్వేస్ విభాగంలో గోల్డెన్ పికాక్ పురస్కారాన్ని అందుకుంది. బెంగళూరులో జరిగిన ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ 25వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ ఛేంజ్’ కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
మహేశ్వరంలో MLA సబితా ఇంద్రారెడ్డి ఫ్లెక్సీని దిష్టిబొమ్మగా తయారుచేసి కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ పార్టీ మహేశ్వరం గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక PSలో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే తాను బీఆర్ఎస్లోనే ఉంటానని సబిత స్పష్టం చేసినా.. పలువురు INC నేతలు చేర్చుకోవద్దని ధర్నా చేయడం గమనార్హం. దీనిపై మీ కామెంట్?
నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కో-అపరిటివ్ సెంట్రల్ బ్యాంకు లిమిటెడ్ 3వ అంతస్థులో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. సైదాబాద్కు చెందిన నాలుగవ తరగతి ఉద్యోగి ఓంకార్ ఛైర్మన్ బాత్ రూమ్ కిటికీకి ఉరివేసుకుని బలవణ్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీ తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
రాజధానిలో BRS పార్టీ నుంచి కాంగ్రెస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. పలువురి చేరిక పట్ల హస్తం శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్లో చేరొద్దని నినాదాలు చేశారు. ఆమె దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదిలా ఉంటే పార్టీ మారడం లేదని సబిత ఇప్పటికే స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై వినూత్నంగా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఇటీవల రాంగ్ రూట్లో వెళ్లే వారిని అప్రమత్తం చేసిన పోలీసులు.. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్ట్ పెట్టారు. జనంలో ఆదరణ పొందిన కల్కి సినిమాలోని నినాదాన్ని ఎంచుకున్నారు. ‘హెల్మెట్ ధరించండి. సురక్షితంగా డ్రైవ్ చేయండి. రేపటి కోసం’ అంటూ హ్యాష్ట్యాగ్ ఇచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.
SHARE IT
నిరుద్యోగుల ఆశను అంతర్జాతీయ సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుని నట్టేట ముంచుతున్నారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ HYDలో అన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలిప్పిస్తామని విదేశాలకు తీసుకెళ్లి.. సైబర్ నేరాలు చేయిస్తున్నారని, ఇటీవల కంబోడియాలో నిరుద్యోగ యువత వారి వలలో చిక్కుకున్నారని తెలిపారు. తాజాగా శ్రీలంకలోనూ సైబర్ నేరాలు చేస్తున్నారంటూ దాదాపు 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD ఉప్పల్ PS పరిధిలో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన మంజుల(40) భర్త గతంలో చనిపోయాడు. కాగా ఆమె ఓ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో పని చేస్తోంది. ఈ క్రమంలో యజమాని పెన్నాం చంద్రమౌళి(47)కి ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఆమె మరొకరితో చనువుగా ఉందని తెలుసుకున్న చంద్రమౌళి తట్టుకోలేక మంజులను కారుతో ఢీకొట్టి చంపేశాడు. కేసు నమోదైంది.
ఈనెలలో బోనాల ఉత్సవాల నేపథ్యంలో హిందూ ప్రజలను ఉద్దేశించి HYD గోషామహల్ MLA రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బోనాల ఉత్సవాల్లో ఎట్టి పరిస్థితుల్లో హలాల్ జరగడానికి వీలు లేకుండా చూడాలన్నారు. మేకను, గొర్రెను బలిచ్చేటప్పుడు హలాల్ చేయనీయొద్దని, హిందూ పద్ధతిలోనే చేయాలన్నారు. ఒకవేళ బలిచ్చే వారు ముస్లిం అయితే అతడు తన మనసులోనైనా సరే ఆ గొర్రెను అల్లాకు సమర్పిస్తున్నానని చెబుతాడని ఆయన ఆరోపించారు.
ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో చక్రిపురం వైజంక్షన్, ఎన్ఎఫ్ కూడలి, కుషాయిగూడ ఠాణా సమీపంలోని రమాదేవి ఆస్పత్రి కూడలి, ఏఎస్ రావునగర్, అశోక్ నగర్, కెనరా బ్యాంకు కూడలి, నేతాజీనగర్, హెబ్బీ కాలనీ ఎక్స్ రోడ్డు, తల్లూరి కూడలి, కుషాయిగూడ డీమార్ట్ కూడలి, శారద చౌరస్తా, ఉప్పల్ ఎక్స్ రోడ్డు, చిలుకానగర్, వీటీ కమాన్ తదితర కూడళ్లు ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో చౌరస్తాలను GHMC విస్తరించనున్న విషయం తెలిసిందే. కాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆరాంఘర్ చౌరస్తా, పీడీపీ కూడలి, దుర్గానగర్ కూడలి, పిల్లర్ నంబర్ 294 కూడలి, పిల్లర్ నంబర్ 202, బన్సీలాల్నగర్, ట్రిపుల్ ఐటీ కూడలి, శేరిలింగంపల్లి గుల్మొహర్ కూడలి, కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసు, ఖాజాగూడ, రాడిసన్ డీఎల్ఎఫ్, ఆల్విన్ కాలనీ, మియాపూర్, ఖానామెట్, గూడెన్మెట్ చౌరస్తా తదితర కూడళ్లు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.