Hyderabad

News September 6, 2024

HYD: పకడ్బందీగా ఓటరు జాబితా ప్రక్షాళన: సుదర్శన్‌రెడ్డి

image

బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ ఓటరు జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఓటరు ముసాయిదా జాబితాను అక్టోబరు 29న, తుది జాబితాను జనవరి 6న ప్రచురిస్తామని వెల్లడించారు. గురువారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ఓటరు జాబితా ప్రక్షాళనపై రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News September 5, 2024

HYD: ఇబ్రహీంపట్నంలో ముగ్గురు ఆత్మహత్య

image

ఇబ్రహీంపట్నంలో విషాద ఘటన వెలుగుచూసింది. పెద్ద చెరువులో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులు హస్తినాపురానికి చెందిన మంగ కుమారి(తల్లి), శరత్(కుమారుడు), లావణ్య(కూతురు)గా గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. లావణ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

News September 5, 2024

HYD: పూడికతీతల్లో అధికారుల చేతివాటం

image

క్షేత్రస్థాయిలో పనిచేసే పలువురు సహాయ ఇంజినీర్లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు గుత్తేదారులతో చేతులు కలిపి అవకతవకలకు తెరలేపారు. నాలాల్లో పూడిక తొలగించకుండానే కొందరు గుత్తేదారులు పెట్టిన బిల్లులకు, ఇంజనీర్లు నిధులు మంజూరు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పూడికతీత, ఎంఈటీ పనులకు ఒకే బృందం పని చేయడంతో ఏ పనీ సరిగ్గా జరగట్లేదనే విమర్శలొస్తున్నాయి. పనుల లోపంతోనే డ్రైనేజీ సమస్యలు ఏర్పడుతున్నాయి.

News September 5, 2024

HYD: నకిలీ ఓట్లపై చర్యలు: ఆమ్రపాలి

image

నగరంలో నకిలీ ఓట్లు పెరిగాయని వివిధ పార్టీల నాయకులు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టికి తీసుకొచ్చారు. బుధవారం జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ), కమిషనర్ ఆధ్వర్యంలో బల్దియా ప్రధాన కార్యాలయంలోని సమావేశం నిర్వహించారు. బీఎ‌ల్‌వో లేకపోవడంతోనే అధికారులు పేర్లు చెప్పలేకపోతున్నారని భాజపా నేత మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు.

News September 5, 2024

HYD: నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి: KTR

image

జైనూర్ మండలంలో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం ఘటనను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. గురువారం X వేదికగా స్పందించారు. ‘జైనూర్లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం బాధిత మహిళకు రూ.లక్ష పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూడటం దుర్మార్గం’ అని అన్నారు.

News September 5, 2024

HYD: కలుషిత నీటి సమస్యతో.. ప్రజల తిప్పలు!

image

HYD ఎల్బీనగర్, ఉప్పల్, అత్తాపూర్, పాతబస్తీ, కోఠి తదితర ప్రాంతాల్లో కలుషిత తాగు నీరు సరఫరా కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలియాబాద్ సెక్షన్ పరిధిలోనూ పలుచోట్ల నుంచి ఈ సమస్యపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. మంచినీటిలో మురుగు నీరు కలిసి వస్తుందని పేర్కొన్నారు. ప్రతి సెక్షన్ పరిధిలో అధికారిక యంత్రాంగం మంచినీటి పరీక్షలు నిర్వహించాలని వారు కోరారు.

News September 5, 2024

HYD: బస్తీ దవాఖానాల్లో డెంగీ కిట్లు

image

జ్వరాలు, ఇతర వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రులు, బస్తీ, పల్లె దవాఖానాలలో అన్ని రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. మందులను ఇవ్వడంతో పాటు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే ప్రత్యేక కిట్ల ద్వారా పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేయనున్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే ప్రజలు అప్రమత్తం కావాలని, రోగులకు ఆందోళన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.

News September 5, 2024

ఖైరతాబాద్: నిమ్స్ అంటువ్యాధుల చికిత్సకు ప్రత్యేక ఓపీ

image

అంటువ్యాధుల చికిత్సకు పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ నగరి బీరప్ప తెలిపారు. ఇందుకోసం తమిళనాడు సీఎంసీ ఆస్పత్రి డాక్టర్ కె. భానుప్రసాద్‌ను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమించినట్లు చెప్పారు. ఆస్పత్రి పాత భవనంలోని జనరల్ మెడిసిన్ విభాగంలో ఓపీ సేవల్ని అందిస్తున్నారు. ప్రతీ మంగళవారం, గురువారం వైద్యుడు అందుబాటులో ఉంటారని తెలిపారు.

News September 5, 2024

HYD: బ్యాడ్మింటన్ టోర్నీకి దరఖాస్తులు

image

తెలంగాణ ఓపెన్ మాస్టర్స్ డబుల్స్ ప్రైజ్ మనీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్-2024కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఆర్డీబీఏ ప్రధానకార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. కొత్తపేటలోని స్పీడ్ బ్యాడ్మింటన్ అకాడమీ ఆవరణలో ‘ప్రాస్పెక్టస్’ పేరిట ఈ నెల 19-22 వరకు పోటీలు ఉంటాయన్నారు. 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

News September 5, 2024

HYD: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా HYD, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT