Hyderabad

News May 2, 2024

హైదరాబాద్‌‌లో CM రేవంత్ రెడ్డి మార్క్

image

HYDలో CM రేవంత్ రెడ్డి మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు ఆకర్షితులై ఇప్పటికే 12 మంది BRS కార్పొరేటర్లు‌ హస్తం కండువా కప్పుకొన్నారు. తాజాగా‌ వనస్థలిపురం BJP కార్పొరేటర్‌ వెంకటేశ్వర్ రెడ్డి రేవంత్ సమక్షంలో‌ పార్టీలోకి చేరారు. MP ఎన్నిక‌ల్లో రాజధానిలోని 4 స్థానాల్లో విజయమే లక్ష్యంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న CM చేరికలపైనా దృష్టి పెట్టారు.

News May 2, 2024

HYD: జాతీయ రహదారికి రైతుబంధు.. క్లారిటీ.!

image

HYD నుంచి శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో కడ్తాల్, అమనగల్లు ప్రాంతంలో రోడ్డుకు సైతం రైతుబంధు వస్తుందన్న అంశంపై అధికారులు స్పందించారు. రైతుల భూమి నుంచి జాతీయ రహదారి నిర్మించిన సమయంలో భూములు కట్ కాకపోవడంతో, పలువురికి రైతుబంధు అందుతుంది. అయితే రహదారి సర్వే చేస్తామని, రోడ్డు ఉన్న భూమి రైతుల పేరిట ఉంటే తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమనగల్లు తహశీల్దార్ లలిత తెలిపారు.

News May 2, 2024

HYD: రైలులో అపరిశుభ్రంగా ఉందా..? కాల్ చేయండి

image

HYD నగరం సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రైళ్లలో నీటి కొరత ఏర్పడటం, బెడ్స్ పాడైపోవడం, కొచ్ శుభ్రంగా లేకపోవడం, ఎలుకలు, బొద్దింకలు ఉండటం, మరుగుదొడ్లలో నీరు రాకపోవడం లాంటి సమస్యలు ఏర్పడితే తమకు కాల్ చేసి తెలిపితే తగు చర్యలు తీసుకుంటామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నోట్ విడుదల చేస్తూ నెంబర్లను తెలిపారు. ఫోటోలో ఉన్న నెంబర్లకు కాల్ చేసి తెలపాలన్నారు.

News May 1, 2024

తెలంగాణ, ఏపీ మధ్య పలు రైళ్లను రద్దు

image

TG, AP మధ్య పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పలు కారణాల వల్ల వికారాబాద్-గుంటూరు (12748) రైలుతో పాటు పలు రైళ్లు రద్దు అయ్యాయి. విజయవాడ- సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్- విజయవాడ (12714), వరంగల్ – సికింద్రాబాద్ (07757), సికింద్రాబాద్-కాజీపేట (07758), కాచిగూడ-మిర్యాలగూడ (07276), మిర్యాలగూడ-నడికుడి (07277), నడికుడి- మిర్యాలగూడ (07973) మిర్యాలగూడ (07974) రద్దయ్యాయి.

News May 1, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> మల్కాజిగిరి డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం
> మహంకాళి పీఎస్ పరిధిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
> దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ఎంబీఏ విద్యార్థి మృతి
> నగర వ్యాప్తంగా మే డే వేడుకలు
> కాచిగూడలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
> అక్రమంగా ఆక్సీ టాక్సిన్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
> బంజారాహిల్స్‌లోని ఓ సెలూన్‌లో అగ్నిప్రమాదం 
> నగర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం

News May 1, 2024

నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతానుతను తీసుకుంటా: సీఎం రేవంత్

image

పదేళ్ల పాలనలో బీజేపీ చేసిందేమీ లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట డివిజన్లో మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా నేడు ప్రచారం నిర్వహించారు. మల్కాజ్‌గిరి ఎంపీగా లక్ష ఓట్ల మెజారిటీతో ఆమెను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు

News May 1, 2024

దుండిగల్‌లో రోడ్డు ప్రమాదం.. ఎంబీఏ విద్యార్థి మృతి

image

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ బెడ్ రూం సర్వీసు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ఎంబీఏ విద్యార్థి మృతి చెందాడు. మృతుడు శివానంద్‌ను MBA విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. అతివేగంగా ప్రయివేట్ బస్సును వెనుక నుండి బైక్ తో ఢీ కొట్టడంతో చనిపోయినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News May 1, 2024

HYD: వడదెబ్బ తగిలి టీచర్ మృతి

image

వడదెబ్బతో టీచర్ మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో బుధవారం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలోని టాకితాండాలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రాణి.. తాండూర్‌లోని నెంబర్ 1 పాఠశాలలో ఎలక్షన్ శిక్షణ తరగతులకు హాజరయ్యింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బస్‌స్టాప్ వద్ద కుప్పకూలి పడిపోయింది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News May 1, 2024

ఈనెల 6న తాండూరుకు ప్రియాంక గాంధీ

image

ఈనెల 6న తాండూర్ పట్టణానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 6న జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌ఛార్జ్ మహేశ్ పాల్గొన్నారు.

News May 1, 2024

వనస్థలిపురం: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్

image

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం బీజేపీ కార్పొరేటర్ రావుల వెంకటేశ్వర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.