Hyderabad

News April 29, 2024

HYD: బార్‌లో బెట్టింగ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అరెస్ట్

image

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. HYD ఫిలింనగర్‌లోని ఓ బార్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు బార్‌లో తనిఖీలు నిర్వహించగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెరుకూరి రమేశ్ ఓ యాప్ ద్వారా IPL బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు తేలింది. దీంతో రమేశ్‌ను అరెస్టు చేసి సెల్‌ఫోన్‌తో పాటు రూ.16 వేలు స్వాధీనం చేసుకున్నారు.

News April 29, 2024

HYD: సెలవుల్లో ఊరెళ్తున్నారా.. జాగ్రత్త!

image

రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించింది. 1, 2 రోజులు ఇంటికి తాళం వేసి శుభకార్యానికి, ఇతర గ్రామానికి వెళ్తేనే దొంగలు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి స్వగ్రామాలకు వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సొంతూళ్లకు వెళ్లేవారు స్థానిక PSలో సమాచారం ఇవ్వడంతో పాటు, జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.

News April 28, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> సాయిచరణ్‌ను అభినందించిన సీఎం
> ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ 
>ఓయూలో విద్యార్థుల ఆందోళన 
> ట్యాంక్‌బండ్‌లో మహిళను కాపాడిన కానిస్టేబుల్ 
> శంషాబాద్‌లో చిరుత పులి.. మాటేసిన సిబ్బంది
> MMTSలో SIని బెదిరించి‌ చోరీ
> పబ్‌లో కొట్టుకున్న యువకులు
> నగరంలో‌ జోరుగా ఎన్నికల ప్రచారం
>లంగర్‌హౌస్‌లో మృతదేహం లభ్యం

News April 28, 2024

HYD శివారులో చిరుత పులి.. మాటేసిన సిబ్బంది

image

హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లో‌ చిరుతపులి సంచారంతో‌ అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫిర్యాదు మేరకు రన్‌వే‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత, మరో రెండు పిల్లలను పట్టుకునేందుకు బోన్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కదలికలను పరిశీలించేందుకు సీసీ కెమెరాల‌ను బిగించారు.

News April 28, 2024

HYD: సూపర్‌హీరో‌కు CM రేవంత్ రెడ్డి సన్మానం

image

సూపర్‌హీరో‌ సాయి‌చరణ్‌‌ సాహసం పట్ల‌ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. HYD శివారు నందిగామ‌లోని ఓ ఫార్మా కంపెనీ‌లో ఈ నెల 26న భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికు‌లను పదో తరగతి బాలుడు సాయిచరణ్ రిస్క్‌ చేసి కాపాడారు. ఆదివారం‌ స్థానిక MLA వీర్లపల్లి శంకర్‌ బాలుడిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. రేవంత్ రెడ్డి శాలువా కప్పి అతడిని అభినందించారు.

News April 28, 2024

4 స్థానాలు.. బరిలో 168 మంది

image

HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి MP స్థానాల్లో నామినేషన్ల పరిశీలన ముగిసింది. మల్కాజిగిరిలో ఏకంగా 114 మంది నామినేషన్ పత్రాలు సమర్పించడంతో శుక్రవారం అర్ధరాత్రి వరకు పరిశీలన కొనసాగింది. సికింద్రాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల నామినేషన్ల పరిశీలన శనివారం ఉదయం వరకు కొనసాగింది. పరిశీలన పూర్తయ్యాక నాలుగు స్థానాల్లో మొత్తం 168 మంది అభ్యర్థులు ఉన్నట్లు తేలిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.

News April 28, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత కలకలం?

image

HYD శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారని, ఇంకా రన్ వే పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిబ్బంది వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 28, 2024

హైదరాబాద్: MMTSలో SIని బెదిరించి‌ చోరీ

image

MMTS రైలులో వెళుతున్న CRPF SI‌ను బెదిరించిన ఆగంతకులు గొలుసు లాక్కెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే PS పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి వాసి ప్రసాద్(CRPF SI) శుక్రవారం రాత్రి MMTSలో ప్రయాణించారు. యాకుత్‌పుర‌-ఉప్పుగూడ స్టేషన్ల మధ్యన ముగ్గురు ఆగంతకులు కత్తితో బెదిరించి ఆయన మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసు, రెండు సెల్ ఫోన్లు దొంగిలించారు. కేసు నమోదైంది.

News April 28, 2024

చేవెళ్ల లోక్‌సభ స్థానంలో డబుల్ పేర్లతో గుబులు!

image

డబుల్‌ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. చేవెళ్ల మండలం ధర్మసాగర్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. AIFB నుంచి కర్మన్‌ఘాట్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్‌ వేయగా.. ఇదే పేరుతో దుండిగల్‌కు చెందిన రంజిత్‌రెడ్డి గాదె రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ నుంచి నామినేషన్ వేశారు.

News April 28, 2024

HYD: ‘చెరువులో దూకి చనిపోతున్నా’

image

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన బత్తుల కుమార్‌(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన కుమార్‌ తన భార్య మంజులకు ఫోన్‌చేసి తాను బొల్లారం చెరువు వద్ద ఉన్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో అక్కడ వెతకగా కనిపించలేదు. శామీర్‌పేట చెరువు వద్ద మృతదేహం లభ్యమైంది.