Hyderabad

News April 19, 2024

మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో శంకర్పల్లి వాసి

image

శంకర్పల్లి మున్సిపాలిటీ వివేకానంద నగర్ కాలనీకి చెందిన దండుగుల వెంకటేష్ నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపు పాల్గొని 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించారు. తన మిత్రుడు నరేష్ రెడ్డితో కలిసి సుమారు వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.

News April 18, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> వారసిగూడ పీఎస్ పరిధిలో బాలుడి మిస్సింగ్
> జూబ్లీ బస్ స్టేషన్లో అగ్నిమాపక అవగాహన డ్రిల్
> పాతబస్తీ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
> ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
> కాచిగూడ రైలు మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
> గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యం
> సెంట్రల్ యూనివర్సిటీలో ABVP, SFI విద్యార్థుల మధ్య ఘర్షణ
> రామంతపూర్‌లో BRS మీటింగ్

News April 18, 2024

HYD: JNTUHలో సైబర్ కోర్సులు

image

కూకట్పల్లిలోని JNTUHలో సైబర్ కోర్సులను అందిస్తున్నట్లు సైబర్ భద్రతా కేంద్రం ఆర్.శ్రీదేవి తెలిపారు. విద్యార్థులు, ఆచార్యులు, పరిశోధకులు సైబర్ భద్రత అంశాల పై అవగాహన పెంచుకుని నిపుణులవ్వాలనే లక్ష్యంతో ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అధికారులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

News April 18, 2024

HYD: రాజాసింగ్‌పై కేసు నమోదు

image

HYD నగరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ SHO లింగేశ్వర రావు తెలిపారు. గౌలిగూడ సమీపాన బాణసంచా కాల్చారని, ర్యాలీని ఆపి, భక్తులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు రాజాసింగ్ సహా జోగేందర్ సింగ్ బిట్టు పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా భారీగా భక్తులతో శోభయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

News April 18, 2024

బీఫామ్ అందుకున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి

image

మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాగి లక్ష్మారెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ నందు గులాబీ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. మల్కాజ్గిరి గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.

News April 18, 2024

HYD: రేప్ కేసులో మైనర్ బాలునికి జైలు శిక్ష

image

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రేప్ కేసులో మైనర్ బాలుడి(17)కి గురువారం రంగారెడ్డి జిల్లా జువైనల్ కోర్టు జడ్జి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధించినట్లు ఎస్సై బలరాం చెప్పారు. 2018లో జరిగిన ఘటనలో కేసు విచారణలో భాగంగా జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. నేరంపై వెంటనే స్పందించి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులను అధికారులు అభినందించారు.

News April 18, 2024

HYD: FREE కోచింగ్ కోర్సులు.. అర్హతలు

image

HYD నగరం NACలో గ్రామీణ యువకులకు ఉచిత కోచింగ్..
✓స్టోర్ సూపర్వైజర్-డిగ్రీ
✓స్ట్రక్చర్ సూపర్వైజర్-ఇంటర్
✓లాండ్ సర్వేయర్-ఇంటర్
✓ఎలక్ట్రికల్,హౌజ్ వైరింగ్- SSC
✓ప్లంబింగ్ అండ్ శానిటేషన్, డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్,వెల్డింగ్,పెయింటింగ్, డెకొరేషన్-5వ తరగతి
✓డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్- 5వ తరగతి
✓JCB బ్యాక్ హోల్డర్ ఆపరేటర్-5వ తరగతి చదివిన వారు అర్హులు
•ఆసక్తి కల వారు NAC విద్యాసంస్థలో సంప్రదించండి

News April 18, 2024

సికింద్రాబాద్: బీఫామ్ అందుకున్న ఎంపీ అభ్యర్థి

image

తెలంగాణ భవన్లో BRS అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావుకు కేసీఆర్ బీ ఫా అందజేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి బీఆర్ఎస్ కైవసం చేసుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2024

కంటోన్మెంట్: నివేదితకు బీఫాం అందజేసిన కేసీఆర్

image

కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు కేసీఆర్ బీఫాంను, రూ.40 లక్షల చెక్కును తెలంగాణ భవన్‌లో అందించారు. ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కేసీఆర్ ఆమెను ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహించి, ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు. సర్వేలు, దివంగత ఎమ్మెల్యేలు సాయన్న-లాస్యనందిత అందించిన సేవలవైపే ఉన్నాయని అన్నారు.

News April 18, 2024

HYD: JNTUH పరీక్ష ఫీజుల స్వీకరణ తేదీలు

image

కూకట్పల్లిలోని JNTUH యూనివర్సిటీలో బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి వివిధ సెమిస్టర్ల పరీక్ష ఫీజుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలియజేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించాలని JNTUH సూచించింది. ఎలాంటి అధికారం లేకుండా నేటి నుంచి మే రెండవ తేదీ వరకు అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. తర్వాత ఫీజు చెల్లిస్తే అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది.