Hyderabad

News April 8, 2024

HYD: ప్రేమను తిరస్కరించిందని యువకుడి ఆత్మహత్య

image

ప్రేమిస్తున్న యువతి తనను తిరస్కరించిందని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. అల్లీనగర్‌లో ఉండే సయ్యద్ షరీఫ్ కుమారుడు సోహెల్(20) మామిడిపల్లిలో ఓ కంపెనీ ఉద్యోగి. స్థానికంగా ఓ యువతిని అతడు ప్రేమిస్తున్నాడు. ఈనెల 6న ఆ యువతిని కలిసి ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ఆమె తిరస్కరించడంతో ఉరేసుకుని చనిపోయాడు. 

News April 8, 2024

HYD: టీ-హబ్‌ వినూత్న కార్యక్రమం

image

స్టార్టప్‌లతో యువతరాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో టీ-హబ్‌ వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా యంగ్‌ ఎకో స్టార్టప్స్‌ కాన్‌ప్లుయెన్స్‌ పేరుతో ఈనెల 28, 29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సెంటర్‌ ఫర్‌ గ్లోబల్‌ అఫైర్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ సహకారంతో ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నామని టీ హబ్‌ నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://bit.ly/3U2WKGr దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 8, 2024

HYD: కేబుల్ బ్రిడ్జ్‌పై యాక్సిడెంట్ ఘటనలో ఇద్దరి అరెస్ట్

image

HYD కేబుల్ బ్రిడ్జ్‌పై శుక్రవారం అర్ధరాత్రి సెల్ఫీ దిగుతున్న ఇద్దరినీ కారు ఢీకొట్టగా అందులో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదైంది. కారును అతివేగంగా నడిపి ప్రమాదానికి కారణమైన మాదాపూర్ మస్తాన్ నగర్ వాసి నవీన్(22)తోపాటు, కారులో ఉన్న తన స్నేహితుడు, యూసుఫ్‌గూడ వాసి మెరాజ్(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు వారికి 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.

News April 8, 2024

HYD: ఎస్ఐ రంజిత్‌కి 45 రోజుల రిమాండ్

image

లంచం తీసుకుంటూ ఇటీవల ACBకి పట్టుబడిన HYD మాదాపూర్ SI రంజిత్ కుమార్, కానిస్టేబుల్ విక్రమ్‌ను ACB అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నాంపల్లి ACB కోర్టులో వారిని హాజరుపరచగా న్యాయమూర్తి ఇద్దరికీ 45 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు పంపారు. SI రంజిత్ IIT ఖరగ్‌పూర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేయడం విశేషం. తర్వాత సివిల్స్ 2 సార్లు రాశారు. మెయిన్స్‌లో విఫలమవగా అనంతరం SI పరీక్షలు రాసి 2020లో జాబ్ పొందాడు.

News April 8, 2024

BREAKING: HYDలో మరో MURDER  

image

HYDలో వరుస హత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. మేడ్చల్ PS పరిధి మురహరిపల్లి హనీ బర్గ్ రిసార్ట్ సమీపంలో బిహార్ రాష్ట్రానికి చెందిన మనీశ్ వాష్మాన్(35)ను బండరాయితో కొట్టి దుండగులు  దారుణంగా హత్య చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

News April 8, 2024

HYD: భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా చికెన్ ధర ప్రస్తుతం రూ.294 పలుకుతోంది. వారంలోనే ఏకంగా రూ.50 పెరగడంతో మధ్య తరగతి వాళ్లు కొనేందుకు వెనకాడుతున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతకు కోళ్లు చనిపోతుంటాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్ నేపథ్యంలో ఎక్కువగా చికెన్ వాడటం వల్ల డిమాండ్ పెరిగింది. మరో వారంలో చికెన్ ధర రూ.350 వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు.

News April 8, 2024

HYD: రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం: రోనాల్డ్ రాస్

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఇప్పటి వరకు రూ.12.62 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.1,73,60,502 విలువ జేసే ఇతర వస్తువులు, 19,380 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.

News April 8, 2024

HYD: లింక్ ఓపెన్ చేశాడు.. రూ.16 లక్షలు స్వాహా

image

స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16 లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌ బుక్‌లో యాడ్ చూసి, అందులో ఉన్న లింక్ ఓపెన్ చేశాడు. విడతల వారీగా రూ.16 లక్షలు పెట్టుబడులు పెట్టాడు. ఆ డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయానని భావించి HYD సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి వాటికి అడిక్ట్‌ కావద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

News April 8, 2024

HYD: మూతలేని నీటి సంపులో పడి చిన్నారి మృతి

image

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు మూతలేని నీటి సంపులో పడి మృతిచెందిన ఘటన HYD జీడిమెట్ల PS పరిధిలో జరిగింది. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం రాఘాపూర్‌‌ వాసి శివకుమార్ షాపూర్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం భార్యాభర్తలు భోజనం చేసి నిద్రపోయారు. ఈ క్రమంలో పాప ఆడుకుంటూ ఇంటి ముందున్న సంపులో పడిపోయింది. కొద్దిసేపటికే అత్త నీటి కోసం వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం కనిపించింది. కేసు నమోదైంది.

News April 8, 2024

HYD: భానుడి ఉగ్రరూపం.. బయటకు రాకండి..!

image

HYD, ఉమ్మడి RRలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత దాటడం గమనార్హం. ఉ.8 నుంచి మొదలు సా.5 వరకు వేడి గాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మేడ్చల్‌లో 42.6, మూసాపేట 41.9, మల్కాజిగిరి 41.5, అంబర్‌పేట్ 41.4, ఉప్పల్ 41.3, ముషీరాబాద్ 41.2, చార్మినార్ 41.1, మెహదీపట్నం 41.0, ఇబ్రహీంపట్నం 41.6, వికారాబాద్‌ 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.